చెల్లని చెక్కు కేసులో వ్యక్తికి జైలు
కాకతీయ,మణుగూరు : చెల్లని చెక్కు అందించి తీసుకున్న డబ్బు తిరిగి ఇవ్వనందున శుక్రవారం మణుగూరు ఇన్చార్జి మెజిస్ట్రేట్ శివ నాయక్ నిందితుడికి ఏడాది జైలుతో పాటు రూ.8.50లక్షల నష్టపరిహారం చెల్లించాలని తీర్పును వెలువరించారు.మణుగూరు మండలం ఆదర్శనగర్ కి చెందిన ఇస్లావత్ బాలాజీ గత 2018లో ఖమ్మం జిల్లాకు చెందిన భుక్యా బాలాజీకి రూ.8.50లక్షలను అప్పుగా ఇచ్చాడు.దీనికి ప్రతిగా చెక్కును పొందాడు.ఆ చెక్కుతో బాధితుడు బ్యాంకులో సంప్రదించ గా,చెక్కు బౌన్స్ అయింది. నోటీసులు పంపినా స్పందించకపోవడంతో కోర్టును బాధితుడు ఆశ్రయించగా, వాదోపవాదనలు విన్న న్యాయస్థానం పై విధంగా తీర్పునిస్తూ వెలువరించింది.కాగా ఫిర్యాదుదారి తరుపున ఎస్వీ రమణారెడ్డి,బద్దం శ్రీనివాసరెడ్డి, గురుకృష్ణ,రతన్,వాసవీ న్యాయవాదులు వాదించారు.


