epaper
Saturday, November 15, 2025
epaper

పీవోడ‌బ్ల్యూ రాష్ట్ర శిక్షణ తరగతులను జయప్రదం చేయండి

పీవోడ‌బ్ల్యూ రాష్ట్ర శిక్షణ తరగతులను జయప్రదం చేయండి
రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అందే మంగ విజయ్

కాకతీయ, కొత్తగూడెం రూరల్ : అక్టోబర్ 11, 12 తేదీల్లో నల్లగొండ జిల్లాకేంద్రంలోని శ్రామిక భవన్లో నిర్వ‌హించే ప్రగతిశీల మహిళా సంఘం (పీవోడ‌బ్ల్యూ) రాష్ట్రస్థాయి శిక్షణ తరగతుల‌ను జయప్రదం చేయాలని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అందే మంగ విజయ్ పిలుపునిచ్చారు. కొత్తగూడెం రైటర్ బస్తీ ఐఎఫ్‌టీయూ కార్యాలయం నందు ముఖ్య కార్యకర్తల సమావేశం రాజేశ్వరి అధ్యక్షతన గురువారం జరిగింది. ఈ సందర్భంగా అందే మంగ విజయ్ హాజ‌రై మాట్లాడారు. గత 50 సంవత్సరాలుగా త‌మ సంఘం మహిళల హక్కుల కోసం అనేక పోరాటాలు నిర్వహించిందని, హక్కుల సాధించడంలో ప్రధాన పాత్ర పోషించిందని అన్నారు. విద్యార్థి, యువజన సంఘాలతో ఐక్య కార్యాచరణ కమిటీ నిర్వహించి హైదరాబాదులో జరిగిన అందాల పోటీలకు వ్యతిరేకంగా పోరాడిందని పేర్కొన్నారు. బ్రాహ్మణ హిందూ భావజాలం పేరుతో మహిళలని వంటింటికే పరిమితం చేసే విధంగా ఈ పాలకవర్గాలు వ్యవహరిస్తున్నాయన్నారు. అందులో భాగంగానే సనాతన ధర్మం పేరుతో మహిళల్ని ఇంటికే పరిమితం చేయడం కోసం ఉద్యోగాల్లో రాణించకుండా, రిజర్వేషన్ల కోసం కొట్లాడకుండా, సాధించుకున్న హక్కులను పోగొట్టుకునే విధంగా పాలకులు వాళ్ల మెదల్లోకి పాశ్చాత్య సంస్కృతిని హిందూ భావజాలాన్ని ఎక్కిస్తున్నారని అన్నారు. మణిపూర్ రాష్ట్రంలో సుగంధ ద్రవ్యాల కోసం జరిగిన పోరాటంలో మహిళలను నగ్నంగా ఊరేగించి మహిళలను హింసించి దాడులు చేసి విధ్వంసం సృష్టించారని వారన్నారు. మరోపక్క ఏజెన్సీలో ఆదివాసీ మహిళలపై అత్యాచారాలు మారణ హోమం సృష్టిస్తున్నారని సైన్యాలతో బెదిరిస్తున్నారని, ఎదురు తిరిగిన వారిని బూటక ఎన్కౌంటర్ల పేరుతో కాల్చి చంపుతున్నారని మండిప‌డ్డారు. 79 ఏళ్ల స్వతంత్ర భారతదేశంలో మహిళలపై దాడులు పెరుగుతున్నాయని, అభివృద్ధి పేరుతో మహిళలని వ్యాపార వర్గాలు వాణిజ్య ప్రకటనల కోసం వారి అందచందాలను మార్కెట్లో వ్యాపారంగా మార్చుతున్నాయని, ఇది సరైన పద్ధతి కాదన్నారు. ఈ క్రమంలోనే మహిళలను చైతన్యం చేయడం కోసం ప్రగతిశీల మహిళా సంఘం ఆధ్వర్యంలో అక్టోబర్ 11, 12 తేదీల్లో నల్గొండ జిల్లాలో రాజకీయ శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నామ‌న్నారు. మహిళలు, విద్యార్థినులు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ రాజకీయ శిక్షణ తరగతులను ప్రభుత్వ జూనియర్ కాలేజీ ప్రిన్సిపల్ సుధారాణి ప్రారంభిస్తారని తెలిపారు. ప్రపంచీకరణ మహిళలు అనే అంశంపై పీవోడ‌బ్ల్యూ
జాతీయ నాయకురాలు సంధ్య, పని విధానం ప్రణాళిక కార్యక్రమంపై ఝాన్సీ, సామాజిక పరిణామ క్రమంలో స్త్రీలు అనే అంశంపై రాష్ట్ర అధ్యక్షురాలు అనసూయ, ఉద్యమాలలో స్త్రీలు అనే అంశంపై రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అందే మంగ విజయ్ బోధిస్తారని తెలియజేశారు. సమావేశంలో నాగలక్ష్మి, సంధ్య, రాములమ్మ, కరుణ, రాధ, వెంకటమ్మ, సుప్రియ తదితరులు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

సామినేనిని హ‌త్య చేసిందెవ‌రు..??

సామినేనిని హ‌త్య చేసిందెవ‌రు..?? ద‌ర్యాప్తు ఎందుకు ముందుకు సాగ‌డం లేదు..? ర‌క్త‌చ‌రిత్ర‌లో రాజ‌కీయ కోణంపై...

ఎన్ డి ఎ కూటమి విజయం

ఎన్ డి ఎ కూటమి విజయం హర్షం వ్యక్తం చేసిన బీజేపీ మండల...

యువతలో కొత్త జాగృతి ప్రేరణనే చైతన్యం

యువతలో కొత్త జాగృతి ప్రేరణనే చైతన్యం డ్రగ్స్ పై యుద్ధం ముగింపు ర్యాలీ ప్రజల...

భళారే.. యమ

భళారే.. యమ పిల్లల పండుగ రోజున అలరించిన బుడతడు కాకతీయ కొత్తగూడెం రూరల్: బాలల...

ఆయిల్ పామ్ సాగుతో రైతులకు లాభాల పంట…

ఆయిల్ పామ్ సాగుతో రైతులకు లాభాల పంట... రాష్ట్ర వ్యవసాయ,మార్కెటింగ్, సహకార, చేనేత...

కాంగ్రెస్ నాయకుడు మిక్కిలినేని కి మాతృవియోగం

కాంగ్రెస్ నాయకుడు మిక్కిలినేని కి మాతృవియోగం కాకతీయ,ఖమ్మం ప్రతినిధి: జిల్లా కాంగ్రెస్ నాయకుడు,...

టీబీ వ్యాధి పై ప్రతి ఒక్కరికి అవగాహన ఉండాలి

టీబీ వ్యాధి పై ప్రతి ఒక్కరికి అవగాహన ఉండాలి డాక్టర్ దుర్గాభవాని కాకతీయ, పినపాక:...

సమాజ నిర్మాణం తరగతి గదిలోనే రూపుదిద్దుకుంటుంది…

సమాజ నిర్మాణం తరగతి గదిలోనే రూపుదిద్దుకుంటుంది... పిల్లలను స్వేచ్ఛగా వివక్షతరహితంగా పెంచాలి... స్మార్ట్ కిడ్జ్...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...

రేవంత్ కు కొత్త సవాల్!

* సర్కార్ కు పరీక్షగా సీఎస్ ఎంపిక? * ఈ నెలాఖరున రామకృష్ణారావు...

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం కాక‌తీయ‌, హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లాలోని బాటసింగారంలో...

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన ప్రతిపాదించిన ప్రాజెక్టుపై...

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా న్యూ డిల్లీ జూలై...

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు మొన్న యూనివర్సిటీల్లో ఆందోళనలు నిషేధిస్తూ మెమో నేడు...

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌ కాంగ్రెస్‌ దూత ఫోన్‌ ట్యాపింగ్‌..! గాంధీ...
spot_img

Popular Categories

spot_imgspot_img