epaper
Monday, March 2, 2026
epaper

పోడు భూముల్లో మళ్లీ లొల్లి

  • ట్రెంచ్ పనులు ఆపాలని జేసీబీని అడ్డుకున్న గిరిజనులు
  • పోడు భూముల్లో ఉద్రిక్తత వాతావరణం

కాకతీయ, పినపాక : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలంలో మల్లీ పోడు భూముల లొల్లి మొదలైంది. నియోజకవర్గంలోని బోటుగూడెం గ్రామపంచాయతీ బందగిరి నగరంలో పోడు భూముల వ్యవహారం అటవీ శాఖ అధికారులు పోడుదారుల మధ్య వివాదంగా మారింది. వైయస్ రాజశేఖర్ రెడ్డి పాలన కంటే ముందు నుండే ఈ భూములను తాము సాగు చేసుకుంటున్నామని పోడు రైతులు తెలియజేస్తున్నారు. ఇప్పుడు ఆ భూముల్లో పంటలు కూడా వేశామని, అయినా ఫారెస్ట్ అధికారులు ట్రెంచ్ పేరుతో అడ్డుకున్నారని పోడుదారులు ఆరోపించారు. బీఆర్ఎస్ హయాంలో అంతరించి పోతున్న అడవులను సంరక్షించాలని అటవీశాఖలో కొత్తగా వచ్చిన అధికారులు జిల్లా అధికారుల ఆదేశాల మేరకు అటవీ భూములు అన్యాక్రాంతం కాకుండా తమ క్లస్టర్ పరిధిలో సరిహద్దులను ఏర్పాటు చేస్తున్నామని చెప్పారన్నారు. అయితే పినపాక మండల వ్యాప్తంగా చాలా చోట్ల వందలాది ఎకరాల్లో రైతు పోడు సాగు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అటవీ శాఖ అధికారులు తమ పరిధిలోని భూములు సాగు చేయొద్దని పోడుదారులను ఫారెస్ట్ అధికారులు అడ్డుకోవడంతో ఈ వివాదాలు తలెత్తుతున్నాయి.

ప్రజాప్రతినిధుల మాట బేఖాతరు..
ఇటీవల జిల్లాలో పర్యటించిన మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సీతక్క, పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు పోడు రైతులను ఇబ్బంది పెట్టొద్దని అటవీ అధికారులకు చెప్పారు. కానీ ఎవరూ పట్టించుకోవడం లేదని పోడుదారులు వాపోయారు. పోడు భూముల్లో నిర్వహిస్తున్న ట్రెంచ్ పనులను స్థానిక గిరిజన రైతులు అడ్డుకున్నారు. స్థానిక ఎమ్మెల్యే పాయం చెప్పిన ఆయన ఆదేశాలు పట్టించుకోకుండా పనులు చేస్తున్నారంటూ జేసీబీ ముందు గిరిజనులు పడుకున్నారు. దీంతో గిరిజన రైతులను పోడు భూముల్లోనుంచి అటవీశాఖ అధికారులు గిరిజనులను తప్పుకోవాలని చెప్పడంతో ఉద్రిక్తతకు దారితీసింది. అధికారుల తీరుతో గిరిజన రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. భూమిని వదిలే ప్రసక్తి లేదని గిరిజన రైతులు భీష్మించుకున్నారు.

పోడు రైతులకు అండగా ఉంటాం: సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు నిమ్మల వెంకన్న
పోడు రైతులకు అండగా ఉంటామని సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు నిమ్మల వెంకన్న అన్నారు. బుధవారం ట్రెంచ్ కొడుతున్న బండగిరి నగరం చేరుకొని అక్కడ గిరిజన సమస్యలు తెలుసుకున్నారు. అసెంబ్లీలో రైతులకు అండగా ఉంటామని, పోడు చేసుకున్న వారికి పట్టాలు ఇస్తామని ప్రభుత్వం ప్రకటిస్తే.. అధికారులు రైతుల మీద పీడీ చట్టాలతో కేసులు పెడుతున్నారని అన్నారు. సాగులో ఉన్న భూముల్లో ఈ పనులు ఏమిటని ఆయన ప్రశ్నించారు. కొత్త భూమి నరికితే అది గిరిజనులదైనా తప్పే అన్నారు. కానీ పాత భూములు ట్రంచ్ కొట్టడం ఏమిటని ప్రశ్నించారు. తక్షణమే పనులు నిలిపివేయకపోతే మరో ఉద్యమానికైనా సిద్ధమన్నారు. స్థానిక అధికారులకు అనేక సార్లు ఫిర్యాదు చేశామని అయినా ఇలా గిరిజన భూముల్లో పనులు చేయడం ఏమిటని ఆయన ప్రశ్నించారు.

ఎమ్మెల్యేతో మాట్లాడాం, సమస్యను పరిష్కరిస్తాం: కాంగ్రెస్ నాయకుడు బండారు సాంబ
పోడు రైతుల సమస్య తెలియగానే బందగిరి నగరానికి చేరుకుని, తక్షణమే పినపాక శాసనసభ్యుడు పాయం వెంకటేశ్వర్లుతో మాట్లాడామని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు బండారు సాంబ తెలిపారు. గిరిజన సమస్యలపై కాంగ్రెస్ పార్టీ సానుకూలంగా ఉందని, తక్షణమే ట్రంచ్ పనులు నిలిపివేయాలని ఎమ్మెల్యే అటవీ శాఖ అధికారులకు తెలిపినట్లుగా సాంబ తెలిపారు. పూర్తిస్థాయిలో సర్వే నిర్వహించిన తర్వాత అటవీ శాఖ భూములు ఉంటే వారికి అందిస్తామని సైతం తెలిపారు. కానీ ఎంతో కాలంగా పోడు సాగు చేసుకుంటున్న భూములపై దౌర్జన్యం వద్దని అన్నారు.

ఫారెస్ట్ హద్దులు దాటి ట్రంచ్ పనులు నిర్వహించడం లేదని ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ తేజస్విని, డీడిఆర్ఓ అరుణ తెలిపారు. బందగిరి నగరంలో ఎంతోకాలంగా సాగు చేసుకుంటున్న పోడు భూముల్లో ట్రంచ్ పనులు చేస్తున్నామన్న ప్రచారంలో వాస్తవం లేదన్నారు. గిరిజనుల ఆవేదన అర్థం చేసుకొని రెండు రోజులు ట్రంచ్ పనులు నిలిపివేస్తున్నామని తెలిపారు. జిపిఎస్ మ్యాప్ పూర్తి స్థాయిలో పరిశీలించిన తర్వాత ఫారెస్ట్ భూములను స్వాధీనం చేసుకుంటామని తెలిపారు. ఎవరి భూములు ఉద్దేశపూర్వకంగా లాక్కోవడం లేదని తెలిపారు. పర్యావరణాన్ని కాపాడుకోవడం ప్రతి ఒక్కరి హక్కు అని తెలిపారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

ఎస్సీ వర్గీకరణ పోరులో అమరవీరులకు జోహార్లు

ఎస్సీ వర్గీకరణ పోరులో అమరవీరులకు జోహార్లు సింగరేణిలో ఎమ్మార్పీఎస్ గద్దె వద్ద నివాళులు త్యాగాలు...

బొగ్గు–ఇసుక లారీల బీభత్సం..!

బొగ్గు–ఇసుక లారీల బీభత్సం..! మణుగూరు–బయ్యారం రహదారి ధ్వంసం దుమ్ము ధూళితో గిరిజన బిడ్డల అనారోగ్యం ప్రజల...

అదుపుతప్పిన ఇసుక ట్రాక్టర్ – డ్రైవర్ దుర్మరణం

అదుపుతప్పిన ఇసుక ట్రాక్టర్ – డ్రైవర్ దుర్మరణం నాగులవంచ వద్ద తెల్లవారుజామున ప్రమాదం ఓవర్‌టేక్...

వెలుగుమట్ల బాధితులపై ముమ్మర సర్వే

వెలుగుమట్ల బాధితులపై ముమ్మర సర్వే 21 మంది తహశీల్దార్లతో యుద్ధప్రాతిపదికన సర్వే ఖమ్మం జిల్లాకు...

వెలుగుమట్ల బాధితులకు బీఆర్ఎస్ అండ

వెలుగుమట్ల బాధితులకు బీఆర్ఎస్ అండ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర ఆధ్వర్యంలో భోజనాల పంపిణీ కాకతీయ,...

సీఎం రేవంత్ రెడ్డికి సన్మానసభ పోస్టర్ ఆవిష్కరణ

సీఎం రేవంత్ రెడ్డికి సన్మానసభ పోస్టర్ ఆవిష్కరణ కాకతీయ, ఖమ్మం : ఎస్సీ...

భూదాన్ వ్యవహారంలో విపక్షాలే అభాసు

భూదాన్ వ్యవహారంలో విపక్షాలే అభాసు పేదల పేరుతో రాద్ధాంతం చేశారు ఏజెంట్ల మోసాలపై బాధితులకు...

మోదీ పాలనలో దేశానికి ప్రమాదం

మోదీ పాలనలో దేశానికి ప్రమాదం కార్పొరేట్ల కోసమే కేంద్రం విధానాలు సీపీఐ (ఎం) పొలిట్...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img