మల్లంపల్లి మండల మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా కుసుమ సునీత
కాకతీయ, ములుగు ప్రతినిధి: ములుగు జిల్లా మల్లంపల్లి మండల మహిళా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలిగా కుసుమ సునీతని నియమించారు. తాడ్వాయి మండలంలోని మేడారం హరిత హోటల్లో జరిగిన కార్యక్రమంలో జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు మద్దల నాగమణి కుసుమ సునీతకు నియామక పత్రాన్ని అందజేశారు. ఈసందర్భంగా మద్దల నాగమణి మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మహిళల కోసం పలు సంక్షేమ పథకాలను అమలు చేస్తోందన్నారు. రానున్న ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా మహిళా కాంగ్రెస్ సభ్యులు ప్రత్యేక కృషి చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో రాష్ట్ర మహిళా కాంగ్రెస్ ఉపాధ్యక్షురాలు ఆంగోతు సుగుణ, మేడారం ట్రస్ట్ బోర్డు చైర్మన్ ఇర్ప సుకన్య సునీల్, ములుగు మండల మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు (4వ వార్డు కౌన్సిలర్) గుంటోజు పావని, ఏటూరు నాగారం బ్లాక్ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు గీకురు భాగ్య తదితరులు పాల్గొన్నారు.


