epaper
Sunday, March 1, 2026
epaper

ఇన్ఫోసిస్‌ బంపర్‌ బైబ్యాక్‌.. బ‌ట్ దూరంగా ఫౌండర్స్‌..!

కాకతీయ, స్పోర్ట్స్:  భారత ఐటీ రంగంలో అగ్రగామి సంస్థల్లో ఒకటైన ఇన్ఫోసిస్‌ మరోసారి తన షేర్‌ హోల్డర్లకు భారీ గిఫ్ట్‌ ఇవ్వబోతోంది. కంపెనీ ఇప్పటివరకు ఎప్పుడూ చేయని రీతిలో రూ. 18,000 కోట్ల విలువైన షేర్‌ బైబ్యాక్‌ ప్రణాళికను ప్రకటించింది. అయితే ఆశ్చర్యకరంగా కంపెనీ ఫౌండర్స్‌, ముఖ్య ప్రమోటర్లు ఈ బైబ్యాక్‌లో పాల్గొనకూడదని నిర్ణయించారు. సంస్థ యొక్క ప్రమోటర్‌ మరియు ప్రమోటర్‌ గ్రూప్‌ సభ్యులు టెండర్‌ ఆఫర్‌ రూపంలో జరగబోయే ఈ షేర్‌ బైబ్యాక్‌లో పాల్గొనరని 2025 అక్టోబర్‌ 22న ఇన్ఫోసిస్‌ అధికారికంగా వెల్లడించింది.

ఈ జాబితాలో ఎన్.ఆర్. నారాయణమూర్తి, సుధా మూర్తి, నందన్‌ నీలేకని, అలాగే వారి కుటుంబ సభ్యుల పేర్లు ఉన్నాయి. ఈ నిర్ణయాన్ని వారు 2025 సెప్టెంబర్‌ 14 నుంచి 19 మధ్య తేదీలలో పంపిన లేఖల ద్వారా సంస్థకు తెలియజేశారు. ప్రస్తుతం ఇన్ఫోసిస్‌లో ప్రమోటర్లు మరియు వారి కుటుంబాల కలిపి వాటా 13.05% గా ఉంది. ఇందులో మూర్తి, నీలేకని, గోపాలకృష్ణన్‌, దినేష్‌, శిబులాల్‌ కుటుంబాలు ఉన్నాయి. మొత్తం వారు 54,20,29,249 షేర్లు కలిగి ఉన్నారు.

ప్రధాన ప్రమోటర్ల షేర్‌ వివరాలు

– సుధా గోపాలకృష్ణన్ : 9,53,57,000 షేర్లు (2.3%)
– రోహన్‌ మూర్తి : 6,08,12,892 షేర్లు (1.46%)
– నందన్‌ నీలేకని : 4,07,83,162 షేర్లు (0.98%)
– నారాయణ మూర్తి : 1,51,45,638 షేర్లు (0.36%)

బైబ్యాక్‌పై ఇన్వెస్టర్ల దృష్టి

ఇన్ఫోసిస్‌ వంటి ప్రముఖ ఐటీ సంస్థ ఇంత పెద్ద స్థాయిలో బైబ్యాక్‌ ప్రకటించడం స్టాక్‌ మార్కెట్‌లో చర్చనీయాంశమైంది. అయితే వ్యవస్థాపకులు ఇందులో పాల్గొనకపోవడం వెనుక కారణాలపై వివిధ రకాల విశ్లేషణలు జరుగుతున్నాయి. కొందరు దీన్ని దీర్ఘకాల పెట్టుబడిపై నమ్మకం సూచనగా చూస్తుండగా, మరికొందరు వారి వాటా స్థిరంగా ఉంచే వ్యూహంగా భావిస్తున్నారు.

ఇన్ఫోసిస్‌ బైబ్యాక్‌ల చరిత్ర

ఇది ఇన్ఫోసిస్‌ చరిత్రలో ఐదవ షేర్‌ బైబ్యాక్‌. 2017లో మొదటి బైబ్యాక్ రూ. 13,000 కోట్లు, ఒక్కో షేర్‌కు రూ. 1,150. తర్వాత 2019, 2021, 2022లో వరుసగా రూ. 8,260 కోట్లు, రూ. 9,200 కోట్లు, రూ. 9,300 కోట్ల బైబ్యాక్‌లు నిర్వహించింది. ఈ బైబ్యాక్‌లు సంస్థకు ఈపీఎస్‌ పెరగడంలో, అలాగే షేర్‌ హోల్డర్లకు మెరుగైన క్యాపిటల్‌ రిటర్న్‌ అందించడంలో సహాయపడ్డాయి. ఇక ఇప్పుడు రూ.18,000 కోట్ల బైబ్యాక్‌తో పెట్టుబడిదారులకు ఇన్ఫోసిస్‌ మరోసారి లాభదాయకమైన అవకాశం ఇవ్వబోతోంది. అయితే ఫౌండర్లు దూరంగా నిలవడం వెనుక ఉన్న అసలు వ్యూహం ఏమిటన్నది మాత్రం స్టాక్‌ మార్కెట్‌ వర్గాల్లో హాట్‌టాపిక్‌గా మారింది.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

రూ.30 వేలు తగ్గిన వెండి

రూ.30 వేలు తగ్గిన వెండి ఒక్క రోజులోనే దిగొచ్చిన ధ‌ర‌ 24 క్యారెట్ల 10...

బ్యాంక్ కస్టమర్లకు ఊరట?

బ్యాంక్ కస్టమర్లకు ఊరట? అన్ని బ్యాంకులకు ఒకే ఛార్జీలు, నిబంధనలు! ఆర్బీఐ కసరత్తు షురూ కాక‌తీయ‌,...

శాంసంగ్‌ నుంచి గెలాక్సీ A07 5G

శాంసంగ్‌ నుంచి గెలాక్సీ A07 5G త్వరలో విడుదలకు స‌న్నాహాలు కాక‌తీయ‌, బిజినెస్ :...

తీవ్ర సంక్షోభం… ఫ్లైట్ల రద్దుతో కుప్పకూలిన ఇండిగో షేర్లు..!

తీవ్ర సంక్షోభం… ఫ్లైట్ల రద్దుతో కుప్పకూలిన ఇండిగో షేర్లు..! సిబ్బంది కొరత వేళ...

హెచ్‌పీలో భారీగా లేఆఫ్స్.. ఏఐ ఎఫెక్టేనా..?

హెచ్‌పీలో భారీగా లేఆఫ్స్.. ఏఐ ఎఫెక్టేనా..? హెచ్‌పీ లేఆఫ్స్‌ కలకలం ఏఐ ధాటికి 6...

న్యూ అవతార్‌లో టాటా సియ‌ర్రా..

న్యూ అవతార్‌లో టాటా సియ‌ర్రా.. ధ‌ర‌, ఫీచ‌ర్ల వివ‌రాలు ఇవే! ఆటోమొబైల్ ఫ్యాన్స్‌కు గుడ్...

ఎస్‌బీఐ కస్టమర్లకు అలర్ట్..ఈ నెల 30తో ఆ సేవ‌లు బంద్‌!

ఎస్‌బీఐ కస్టమర్లకు అలర్ట్..ఈ నెల 30తో ఆ సేవ‌లు బంద్‌! స్టేట్ బ్యాంక్...

ChatGPT ఇప్పుడు ఫోన్‌పే యాప్‌లో..!

ChatGPT ఇప్పుడు ఫోన్‌పే యాప్‌లో..! ఓపెన్ ఏఐ-ఫోన్‌పే వ్యూహాత్మక భాగస్వామ్యం ప్రకటింపు కన్స్యూమర్ మరియు...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img