epaper
Saturday, November 15, 2025
epaper

ఇన్ఫోసిస్‌ బంపర్‌ బైబ్యాక్‌.. బ‌ట్ దూరంగా ఫౌండర్స్‌..!

కాకతీయ, స్పోర్ట్స్:  భారత ఐటీ రంగంలో అగ్రగామి సంస్థల్లో ఒకటైన ఇన్ఫోసిస్‌ మరోసారి తన షేర్‌ హోల్డర్లకు భారీ గిఫ్ట్‌ ఇవ్వబోతోంది. కంపెనీ ఇప్పటివరకు ఎప్పుడూ చేయని రీతిలో రూ. 18,000 కోట్ల విలువైన షేర్‌ బైబ్యాక్‌ ప్రణాళికను ప్రకటించింది. అయితే ఆశ్చర్యకరంగా కంపెనీ ఫౌండర్స్‌, ముఖ్య ప్రమోటర్లు ఈ బైబ్యాక్‌లో పాల్గొనకూడదని నిర్ణయించారు. సంస్థ యొక్క ప్రమోటర్‌ మరియు ప్రమోటర్‌ గ్రూప్‌ సభ్యులు టెండర్‌ ఆఫర్‌ రూపంలో జరగబోయే ఈ షేర్‌ బైబ్యాక్‌లో పాల్గొనరని 2025 అక్టోబర్‌ 22న ఇన్ఫోసిస్‌ అధికారికంగా వెల్లడించింది.

ఈ జాబితాలో ఎన్.ఆర్. నారాయణమూర్తి, సుధా మూర్తి, నందన్‌ నీలేకని, అలాగే వారి కుటుంబ సభ్యుల పేర్లు ఉన్నాయి. ఈ నిర్ణయాన్ని వారు 2025 సెప్టెంబర్‌ 14 నుంచి 19 మధ్య తేదీలలో పంపిన లేఖల ద్వారా సంస్థకు తెలియజేశారు. ప్రస్తుతం ఇన్ఫోసిస్‌లో ప్రమోటర్లు మరియు వారి కుటుంబాల కలిపి వాటా 13.05% గా ఉంది. ఇందులో మూర్తి, నీలేకని, గోపాలకృష్ణన్‌, దినేష్‌, శిబులాల్‌ కుటుంబాలు ఉన్నాయి. మొత్తం వారు 54,20,29,249 షేర్లు కలిగి ఉన్నారు.

ప్రధాన ప్రమోటర్ల షేర్‌ వివరాలు

– సుధా గోపాలకృష్ణన్ : 9,53,57,000 షేర్లు (2.3%)
– రోహన్‌ మూర్తి : 6,08,12,892 షేర్లు (1.46%)
– నందన్‌ నీలేకని : 4,07,83,162 షేర్లు (0.98%)
– నారాయణ మూర్తి : 1,51,45,638 షేర్లు (0.36%)

బైబ్యాక్‌పై ఇన్వెస్టర్ల దృష్టి

ఇన్ఫోసిస్‌ వంటి ప్రముఖ ఐటీ సంస్థ ఇంత పెద్ద స్థాయిలో బైబ్యాక్‌ ప్రకటించడం స్టాక్‌ మార్కెట్‌లో చర్చనీయాంశమైంది. అయితే వ్యవస్థాపకులు ఇందులో పాల్గొనకపోవడం వెనుక కారణాలపై వివిధ రకాల విశ్లేషణలు జరుగుతున్నాయి. కొందరు దీన్ని దీర్ఘకాల పెట్టుబడిపై నమ్మకం సూచనగా చూస్తుండగా, మరికొందరు వారి వాటా స్థిరంగా ఉంచే వ్యూహంగా భావిస్తున్నారు.

ఇన్ఫోసిస్‌ బైబ్యాక్‌ల చరిత్ర

ఇది ఇన్ఫోసిస్‌ చరిత్రలో ఐదవ షేర్‌ బైబ్యాక్‌. 2017లో మొదటి బైబ్యాక్ రూ. 13,000 కోట్లు, ఒక్కో షేర్‌కు రూ. 1,150. తర్వాత 2019, 2021, 2022లో వరుసగా రూ. 8,260 కోట్లు, రూ. 9,200 కోట్లు, రూ. 9,300 కోట్ల బైబ్యాక్‌లు నిర్వహించింది. ఈ బైబ్యాక్‌లు సంస్థకు ఈపీఎస్‌ పెరగడంలో, అలాగే షేర్‌ హోల్డర్లకు మెరుగైన క్యాపిటల్‌ రిటర్న్‌ అందించడంలో సహాయపడ్డాయి. ఇక ఇప్పుడు రూ.18,000 కోట్ల బైబ్యాక్‌తో పెట్టుబడిదారులకు ఇన్ఫోసిస్‌ మరోసారి లాభదాయకమైన అవకాశం ఇవ్వబోతోంది. అయితే ఫౌండర్లు దూరంగా నిలవడం వెనుక ఉన్న అసలు వ్యూహం ఏమిటన్నది మాత్రం స్టాక్‌ మార్కెట్‌ వర్గాల్లో హాట్‌టాపిక్‌గా మారింది.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

ChatGPT ఇప్పుడు ఫోన్‌పే యాప్‌లో..!

ChatGPT ఇప్పుడు ఫోన్‌పే యాప్‌లో..! ఓపెన్ ఏఐ-ఫోన్‌పే వ్యూహాత్మక భాగస్వామ్యం ప్రకటింపు కన్స్యూమర్ మరియు...

టాటా ట్రస్ట్స్‌లో విభేదాల మళ్లీ వెలుగులోకి..!

టాటా ట్రస్ట్స్‌లో విభేదాల మళ్లీ వెలుగులోకి..! రతన్ టాటా తర్వాత వారసత్వ పోరు నోయెల్...

మార్కెట్‌లోకి హీరో విడా వీఎక్స్‌2 గో..

మార్కెట్‌లోకి హీరో విడా వీఎక్స్‌2 గో.. కిలోమీటర్‌కి 90 పైసలే! ఎలక్ట్రిక్ మార్కెట్‌లో హీరో...

మార్కెట్‌లోకి హీరో విడా వీఎక్స్‌2 గో.. కిలోమీటర్‌కి 90 పైసలే!

మార్కెట్‌లోకి హీరో విడా వీఎక్స్‌2 గో.. కిలోమీటర్‌కి 90 పైసలే! ఎలక్ట్రిక్ మార్కెట్‌లో...

ఎన్‌బీఎల్‌లో వాటాల ఉప‌సంహ‌ర‌ణ‌పై త‌గ్గిన బీవోబీ

కాక‌తీయ‌, బిజినెస్ డెస్క్ : బ్యాంక్ ఆఫ్ బరోడా (BoB) నైనిటాల్...

టెస్లా ఇండియా ఆప‌రేష‌న్ హెడ్‌గా శరద్ అగర్వాల్‌

భార‌త మార్కెట్లో విస్త‌ర‌ణ ల‌క్ష్యంగా కంపెనీ నిర్ణ‌యం కాక‌తీయ‌, బిజినెస్ డెస్క్...

₹3,198 కోట్ల లాభాలు ఆర్జించిన అదాని ఎంటర్‌ప్రైజెస్

కాక‌తీయ‌, బిజినెస్ డెస్క్‌ : అదానీ ఎంటర్‌ప్రైజెస్ 2026 ఆర్థిక సంవత్సరం...

హిందుజా గ్రూప్‌ ఛైర్మన్‌ గోపీచంద్ క‌న్నుమూత‌

కాక‌తీయ‌, బిజినెస్ డెస్క్ : ప్రముఖ వ్యాపార సంస్థ హిందుజా గ్రూప్‌...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...

రేవంత్ కు కొత్త సవాల్!

* సర్కార్ కు పరీక్షగా సీఎస్ ఎంపిక? * ఈ నెలాఖరున రామకృష్ణారావు...

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం కాక‌తీయ‌, హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లాలోని బాటసింగారంలో...

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన ప్రతిపాదించిన ప్రాజెక్టుపై...

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా న్యూ డిల్లీ జూలై...

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు మొన్న యూనివర్సిటీల్లో ఆందోళనలు నిషేధిస్తూ మెమో నేడు...

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌ కాంగ్రెస్‌ దూత ఫోన్‌ ట్యాపింగ్‌..! గాంధీ...
spot_img

Popular Categories

spot_imgspot_img