epaper
Saturday, November 15, 2025
epaper

పేదల ఆత్మగౌరవ చిహ్నం ఇందిరమ్మ ఇళ్లు

  • రాష్ట్ర రెవెన్యూ, హౌజింగ్, సమాచార, పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి
  • ఆరెంపులలో పూర్తయిన ఇందిరమ్మ ఇళ్ల ప్రారంభం
  • అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన పొంగులేటి

కాకతీయ ఖమ్మం ప్రతినిధి: పేదల ఆత్మగౌరవానికి చిహ్నంగా రాష్ట్ర ప్రభుత్వంచే ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం చేపట్టడం జరిగిందని రాష్ట్ర రెవెన్యూ, హౌజింగ్, సమాచార పౌరసంబంధాల శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. బుధవారం ఖమ్మం రూరల్ మండలం ఆరెంపుల గ్రామంలో ఆయన పూర్తయిన ఇందిరమ్మ ఇళ్లను ప్రారంభించి, పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు.

ఆరెంపుల గ్రామంలో ఇండ్లు పూర్తి చేసిన జెల్ల విజయ కుమారి, చెన్నబోయిన నరేష్, షేక్ నాగుల్ పాషా, చిర్ర రాజ్యం, సమర్థపు మమత, షేక్ రంజాన్ పాషా లకు చెందిన ఇందిరమ్మ ఇళ్లను రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. గృహ ప్రవేశ కార్యక్రమంలో పాల్గొని, ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులు చిర్ర రాజ్యం ఇంట్లో మంత్రి, కలెక్టర్, సిపిలు భోజనం చేశారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి మాట్లాడుతూ అధికారం, స్వార్థం కోసం కాకుండా పేదల ఆత్మగౌరవం కోసం ఉపయోగపడాలనే తాపత్రయంతో రేవంత్ రెడ్డి గృహ నిర్మాణ శాఖను తనకు కేటాయించారన్నారు. వైఎస్ఆర్ హయాంలో 25 లక్షల ఇందిరమ్మ ఇండ్లు నిర్మిస్తే, ప్రత్యేక తెలంగాణలో గత పాలకులు హౌసింగ్ కార్పోరేషన్ ను రద్దు చేశారని మంత్రి విమర్శించారు. పేద ప్రజలకు భరోసా, ధైర్యం అందించేలా ఇందిరమ్మ ఇండ్లను ప్రజా ప్రభుత్వం నిర్మిస్తుందని అన్నారు. పాలేరు నియోజకవర్గంలో నేడు గృహ ప్రవేశాలు జరుగుతున్నాయని మంత్రి హర్షం వ్యక్తం చేశారు. అర్హులైన ప్రతీ పేదవాడికి ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేస్తామని, రాబోయే అసెంబ్లీ ఎన్నికల లోపు మరో మూడు విడతలలో ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తామని అన్నారు.

జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి మాట్లాడుతూ ఆరెంపుల గ్రామంలో పైలెట్ ప్రాజెక్టు క్రింద చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల కార్యక్రమంలో నేడు 6 గృహ ప్రవేశాలు మంత్రి చేతుల మీదుగా జరగడం సంతోషకరమని అన్నారు. ఖమ్మం జిల్లాలో మొదటి విడత క్రింద 16,300 ఇందిరమ్మ ఇండ్లు మంజూరైతే 14 వేలకు పైగా ఇండ్లు మార్కింగ్ చేశామని, ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పురోగతి మేరకు ప్రతి సోమవారం నిధులు చెల్లించడం జరుగుతుందని అన్నారు. ఆరెంపుల నుండి ఖమ్మం – వరంగల్ ఆర్ అండ్ బి రోడ్డు వయా యన్.డి.ఆర్. గోదాము వరకు 77 లక్షలతో నిర్మించనున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులకు, 20 లక్షల అంచనా వ్యయంతో నిర్మించే పశు సంవర్ధక ఉప కేంద్రం నూతన భవనం, ప్రహరీ గోడ, మరుగుదొడ్ల నిర్మాణాలకు,ఎం.పి.పి.ఎస్. ఆరెంపులలో 13.50 లక్షలతో నిర్మించనున్న అదనపు తరగతి గది నిర్మాణ పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు.

ఆరెంపుల జెడ్పీ పాఠశాల ఆవరణలో ఖమ్మం రూరల్ మండలం, ఎదులాపురం మున్సిపాలిటీ ప్రాంత లబ్ధిదారులకు సి.ఎం.ఆర్.ఎఫ్. చెక్కులను, నూతన రేషన్ కార్డులను మంత్రి అందజేశారు.
కార్యక్రమంలో పోలీస్ కమిషనర్ సునీల్ దత్, రాష్ట్ర ఇరిగేషన్ అభివృద్ధి సంస్థ చైర్మన్ మువ్వా విజయ్ బాబు, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వర రావు, జిల్లా బీసీ సంక్షేమ అధికారిణి జి. జ్యోతి, హౌజింగ్ పిడి భూక్యా శ్రీనివాస్, ఖమ్మం ఆర్డీవో నర్సింహారావు, మార్కెట్ కమిటీ చైర్మన్లు హరినాథ బాబు, వెన్నపూసల సీతారాములు, ఖమ్మం రూరల్ తహసీల్దార్ రాంప్రసాద్, ఎంపిడివో శ్రీదేవి, ఎంఈఓ శ్రీనివాసరావు, ప్రజా ప్రతినిధులు, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

కాంగ్రెస్‌లో రేవంత్ జోష్‌

కాంగ్రెస్‌లో రేవంత్ జోష్‌ జూబ్లీహిల్స్ పీఠంపై హ‌స్తం పార్టీ జెండా ఉప ఎన్నిక గెలుపుతో...

సామినేనిని హ‌త్య చేసిందెవ‌రు..??

సామినేనిని హ‌త్య చేసిందెవ‌రు..?? ద‌ర్యాప్తు ఎందుకు ముందుకు సాగ‌డం లేదు..? ర‌క్త‌చ‌రిత్ర‌లో రాజ‌కీయ కోణంపై...

ఎన్ డి ఎ కూటమి విజయం

ఎన్ డి ఎ కూటమి విజయం హర్షం వ్యక్తం చేసిన బీజేపీ మండల...

యువతలో కొత్త జాగృతి ప్రేరణనే చైతన్యం

యువతలో కొత్త జాగృతి ప్రేరణనే చైతన్యం డ్రగ్స్ పై యుద్ధం ముగింపు ర్యాలీ ప్రజల...

భళారే.. యమ

భళారే.. యమ పిల్లల పండుగ రోజున అలరించిన బుడతడు కాకతీయ కొత్తగూడెం రూరల్: బాలల...

ఆయిల్ పామ్ సాగుతో రైతులకు లాభాల పంట…

ఆయిల్ పామ్ సాగుతో రైతులకు లాభాల పంట... రాష్ట్ర వ్యవసాయ,మార్కెటింగ్, సహకార, చేనేత...

కాంగ్రెస్ నాయకుడు మిక్కిలినేని కి మాతృవియోగం

కాంగ్రెస్ నాయకుడు మిక్కిలినేని కి మాతృవియోగం కాకతీయ,ఖమ్మం ప్రతినిధి: జిల్లా కాంగ్రెస్ నాయకుడు,...

టీబీ వ్యాధి పై ప్రతి ఒక్కరికి అవగాహన ఉండాలి

టీబీ వ్యాధి పై ప్రతి ఒక్కరికి అవగాహన ఉండాలి డాక్టర్ దుర్గాభవాని కాకతీయ, పినపాక:...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...

రేవంత్ కు కొత్త సవాల్!

* సర్కార్ కు పరీక్షగా సీఎస్ ఎంపిక? * ఈ నెలాఖరున రామకృష్ణారావు...

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం కాక‌తీయ‌, హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లాలోని బాటసింగారంలో...

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన ప్రతిపాదించిన ప్రాజెక్టుపై...

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా న్యూ డిల్లీ జూలై...

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు మొన్న యూనివర్సిటీల్లో ఆందోళనలు నిషేధిస్తూ మెమో నేడు...

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌ కాంగ్రెస్‌ దూత ఫోన్‌ ట్యాపింగ్‌..! గాంధీ...
spot_img

Popular Categories

spot_imgspot_img