- ఏఎస్సైగా ఉద్యోగోన్నతి పొందిన హెచ్ సీలను అభినందించిన సీపీ సునీల్ దత్
కతీయ,ఖమ్మం ప్రతినిధి : పదోన్నతులు మరింత బాధ్యతను పెంచుతాయని పోలీస్ కమిషనర్ సునీల్ దత్ అన్నారు. వివిధ పోలీస్ స్టేషన్లలో హెడ్ కానిస్టేబుళ్లుగా బాధ్యతలు నిర్వహిస్తూ అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్లు (ఏఎస్సై)గా ఉద్యోగోన్నతి పొంది న ఖమ్మం కమిషనరేట్ కు కేటాయించబడిన పోలీస్ అధికారులు సోమవారం పోలీస్ కమిషనర్ కార్యాలయంలో పోలీస్ కమిషనర్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారిని పోలీస్ కమిషనర్ అభినందించారు. కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ అడ్మిన్ రామానుజం, తదితరులు పాల్గొన్నారు.


