epaper
Thursday, January 15, 2026
epaper

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి నాలుగు నెలల (ఏప్రిల్-జూలై) ఆర్థిక స్థితిగతులపై కంప్ట్రోలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌ (సి ఏ జి ) కు తెలంగాణ ప్రభుత్వం సమర్పించిన నివేదిక ఆందోళన కలిగిస్తోంది. ఈ కాలంలో రాష్ట్రం సాధించిన ఆదాయం బడ్జెట్‌ అంచనాల కంటే చాలా తక్కువగా ఉండగా, అప్పులు మాత్రం గణనీయంగా పెరిగినట్లు నివేదికలో స్పష్టమైంది. ప్రభుత్వం 2025-26 బడ్జెట్‌లో రాబడి అంచనాలను భారీగా ఉంచినా, ఆ అంచనాల్లో కేవలం 21 శాతం మాత్రమే నాలుగు నెలల్లో రాబట్టగలిగింది. అంటే వాస్తవ ఆదాయం ఆశించిన స్థాయిలో లేకపోవడం ఆర్థిక పరిస్థితిపై ప్రతికూల ప్రభావం చూపుతోంది. పన్ను రాబడులు, జీఎస్టీ, ఎక్సైజ్‌, రిజిస్ట్రేషన్‌ ఫీజులు కూడా అంచనాలకు తగ్గట్టుగా లేవని సూచనలున్నాయి.

అప్పుల భారమే ఎక్కువ:

ఇక రాష్ట్ర అప్పుల విషయంలో అయితే పరిస్థితి మరింత ఆందోళనకరంగా ఉంది. సంవత్సరం మొత్తం కోసం ప్రభుత్వం ఉంచుకున్న అప్పు అంచనాల్లో ఇప్పటికే 45 శాతం మించిపోయింది. అంటే నాలుగు నెలల్లోనే దాదాపు సగం అప్పులు తీసుకున్నట్టే. మిగతా ఎనిమిది నెలల్లో కూడా ఇదే విధంగా అప్పులు కొనసాగితే బడ్జెట్ అంచనాలను మించి భారీ అప్పు భారం రాష్ట్రంపై పడే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. రాబడి తగ్గి, అప్పులు పెరగడం వల్ల రాష్ట్ర అభివృద్ధి కార్యక్రమాల అమలుపై ప్రభావం పడే అవకాశం ఉందని విశ్లేషకులు అంటున్నారు. సంక్షేమ పథకాల అమలు, ప్రాజెక్టుల ఖర్చులు, ఉద్యోగుల జీతాల కోసం ప్రభుత్వం మరింతగా అప్పులపై ఆధారపడాల్సి వస్తుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

ముందున్న సవాళ్లు:

ప్రస్తుత పరిస్థితుల్లో మిగిలిన ఎనిమిది నెలల్లో భారీ ఆదాయం రాబట్టడం ప్రభుత్వానికి పెద్ద సవాల్‌గా మారింది. అప్పు పరిమితులను అధిగమిస్తే ఆర్థిక శ్రద్ధ, భవిష్యత్తు అభివృద్ధి ప్రణాళికలపై ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు. మొత్తం మీద తెలంగాణ ఆర్థిక పరిస్థితి పెరుగుతున్న అప్పులు, తగ్గుతున్న ఆదాయం అనే క్లిష్ట సమీకరణంలో నడుస్తోంది. ప్రభుత్వం ఆదాయ వనరులు పెంచే చర్యలు తీసుకోవడం అత్యవసరమని నిపుణుల అభిప్రాయం.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

బీఆర్ఎస్‌కు ట‌ఫ్ టైం

బీఆర్ఎస్‌కు ట‌ఫ్ టైం ఖ‌మ్మంలో పార్టీని నిల‌బెట్టేది ఎవ‌రు..? మాజీమంత్రినా..? మాజీ ఎంపీనా..? కారు దిగిపోతున్న...

జర్నలిస్టులకు అండగా ప్రజా ప్రభుత్వం

జర్నలిస్టులకు అండగా ప్రజా ప్రభుత్వం అక్రిడిటేషన్లు తగ్గవు… మరింత పెరుగుతాయి జీవో–252లో మార్పులు, సూచనలకు...

ఇరాన్ ఆంక్షల దెబ్బ… బాస్మతి ఎగుమతులకు బ్రేక్

ఇరాన్ ఆంక్షల దెబ్బ… బాస్మతి ఎగుమతులకు బ్రేక్ అమెరికా ఆంక్షలతో ఇరాన్ ఆర్థిక...

జంక్ష‌న్లు జామ్‌

జంక్ష‌న్లు జామ్‌ విజయవాడ జాతీయ రహదారిపై వాహనాల రద్దీ 6 కిలోమీటర్ల మేర నిలిచిపోయిన...

మూసీ ప్రాజెక్టుతో రియ‌ల్ బూమ్‌

మూసీ ప్రాజెక్టుతో రియ‌ల్ బూమ్‌ ప్రాపర్టీ ధరలు హైక్ ! దాదాపు 15 నుండి...

క‌థ‌నం క‌ల‌క‌లం !

క‌థ‌నం క‌ల‌క‌లం ! ఐఏఎస్ అధికారికి, మంత్రికి మధ్య వివాహేతర బంధం ? అత్యంత...

విష‌మిచ్చి చంపండి

విష‌మిచ్చి చంపండి ఇప్ప‌టికే స‌గం చ‌నిపోయా మహిళా అధికారులను వివాదాల్లోకి లాగొద్దు రేటింగ్స్ కోసం మానసిక...

వివాదాలొద్దు

వివాదాలొద్దు ప‌క్క రాష్ట్రాల‌తో చ‌ర్చ‌ల‌కు సిద్ధం ప‌ర‌స్ప‌ర స‌హ‌కారంతో ముందుకుసాగుదాం ప్రపంచ నగరాలతో హైదరాబాద్ పోటీ 2034...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

రేవంత్ కు కొత్త సవాల్!

* సర్కార్ కు పరీక్షగా సీఎస్ ఎంపిక? * ఈ నెలాఖరున రామకృష్ణారావు...

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం కాక‌తీయ‌, హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లాలోని బాటసింగారంలో...

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన ప్రతిపాదించిన ప్రాజెక్టుపై...

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా న్యూ డిల్లీ జూలై...

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు మొన్న యూనివర్సిటీల్లో ఆందోళనలు నిషేధిస్తూ మెమో నేడు...

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌ కాంగ్రెస్‌ దూత ఫోన్‌ ట్యాపింగ్‌..! గాంధీ...

27 నుంచి గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌

27 నుంచి గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ కాక‌తీయ‌, హైద‌రాబాద్ : గ్రీన్ ఇండియా...
spot_img

Popular Categories

spot_imgspot_img