epaper
Monday, March 2, 2026
epaper

కారేపల్లిలో అక్రమ మద్యం గుట్టురట్టు

కారేపల్లిలో అక్రమ మద్యం గుట్టురట్టు
అధికారుల అండతోనే దందా?
ఆటోల్లో రూ.2.5 లక్షల విలువైన మద్యం పట్టివేత
‘110 కనకదుర్గ వైన్ షాప్’కు చెందిన నిల్వలుగా గుర్తింపు
ఎక్సైజ్ అధికారుల గోప్యతపై అనుమానాలు
గతంలోనూ ఇదే తరహా ఘటనలపై ఆరోపణలు
ఏజెన్సీ గ్రామాలకు అక్రమ రవాణాపై గ్రామస్థుల ఆగ్రహం
సమగ్ర విచారణ చేపట్టాలని కలెక్టర్‌కు విజ్ఞప్తి

కాకతీయ, కారేపల్లి : కారేపల్లి మండల కేంద్రంలో అక్రమ మద్యం దందా వెలుగులోకి రావడం స్థానికంగా కలకలం రేపింది. సోమవారం తహసీల్దార్ కార్యాలయం సమీపంలో ఆటోల్లో అక్రమంగా తరలిస్తున్న సుమారు రూ.2.5 లక్షల విలువైన మద్యం సీసాలను ఎక్సైజ్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అయితే ఈ ఘటనలో ఎక్సైజ్ అధికారుల వ్యవహార శైలిపై అనుమానాలు వ్యక్తమవుతూ వివాదానికి దారితీస్తోంది. విశ్వసనీయ సమాచారం ఆధారంగా ఎక్సైజ్ అధికారులు కారేపల్లి తహసీల్దార్ కార్యాలయం సమీపంలో దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆటోల్లో పెద్ద మొత్తంలో మద్యం బాటిళ్లు తరలిస్తున్నట్లు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న మద్యం నిల్వలు కారేపల్లిలోని ‘110 కనకదుర్గ వైన్ షాప్’కు చెందినవిగా ప్రాథమికంగా గుర్తించినట్లు సమాచారం. పట్టుబడిన మద్యాన్ని ఎక్సైజ్ కార్యాలయానికి తరలించి తదుపరి విచారణ కొనసాగిస్తున్నారు.

అధికారుల మౌనం… అనుమానాలకు తావు

సాధారణంగా భారీ స్థాయిలో అక్రమ మద్యం పట్టుబడినప్పుడు పూర్తి వివరాలను వెల్లడించాల్సిన ఎక్సైజ్ అధికారులు ఈ ఘటనలో గోప్యత పాటించడం పలు అనుమానాలకు తావిస్తోంది. నిందితుల వివరాలు, కేసు నమోదు అంశాలపై స్పష్టత ఇవ్వకపోవడంతో అధికారులపై స్థానికులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కొందరు అధికారులు అక్రమార్కులకు అండగా ఉంటున్నారనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. ఇటీవల బస్వాపూర్ ప్రాంతంలో కూడా ఆటోలో అక్రమ మద్యం పట్టుబడిన ఘటనలో ఇదే తరహా పరిస్థితులు నెలకొన్నాయని స్థానికులు పేర్కొంటున్నారు. ఆ సమయంలో నిందితులపై కఠిన చర్యలు తీసుకోకుండా, స్వాధీనం చేసుకున్న మద్యాన్ని తిరిగి సంబంధిత వైన్ షాప్‌కు అప్పగించారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో ఎక్సైజ్ శాఖ పనితీరుపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. బస్టాండ్ సెంటర్‌లోని వైన్ షాప్ యజమాని నిబంధనలకు విరుద్ధంగా ఆటోల ద్వారా ఏజెన్సీ గ్రామాలకు మద్యం తరలిస్తున్నారని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. అక్రమంగా మద్యం సరఫరా చేయడం వల్ల గ్రామాల్లో ప్రశాంత వాతావరణం దెబ్బతింటోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారుల పర్యవేక్షణ లేకపోవడం వల్లే ఈ దందా నిర్బంధం లేకుండా కొనసాగుతోందని విమర్శిస్తున్నారు.

కలెక్టర్ జోక్యం కోరుతున్న స్థానికులు

ఎక్సైజ్ శాఖ నిర్లక్ష్యం, అక్రమ మద్యం రవాణాలో అధికారుల ప్రమేయంపై జిల్లా కలెక్టర్ స్థాయిలో సమగ్ర విచారణ జరిపించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. అక్రమ మద్యం సరఫరా చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుని, ఈ దందాకు పూర్తిగా అడ్డుకట్ట వేయాలని కోరుతున్నారు. జిల్లాలో అక్రమ మద్యం వ్యాపారంపై కఠిన చర్యలు తీసుకుంటేనే ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉంటాయని ప్రజలు అభిప్రాయపడుతున్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

ఎస్సీ వర్గీకరణ పోరులో అమరవీరులకు జోహార్లు

ఎస్సీ వర్గీకరణ పోరులో అమరవీరులకు జోహార్లు సింగరేణిలో ఎమ్మార్పీఎస్ గద్దె వద్ద నివాళులు త్యాగాలు...

బొగ్గు–ఇసుక లారీల బీభత్సం..!

బొగ్గు–ఇసుక లారీల బీభత్సం..! మణుగూరు–బయ్యారం రహదారి ధ్వంసం దుమ్ము ధూళితో గిరిజన బిడ్డల అనారోగ్యం ప్రజల...

అదుపుతప్పిన ఇసుక ట్రాక్టర్ – డ్రైవర్ దుర్మరణం

అదుపుతప్పిన ఇసుక ట్రాక్టర్ – డ్రైవర్ దుర్మరణం నాగులవంచ వద్ద తెల్లవారుజామున ప్రమాదం ఓవర్‌టేక్...

వెలుగుమట్ల బాధితులపై ముమ్మర సర్వే

వెలుగుమట్ల బాధితులపై ముమ్మర సర్వే 21 మంది తహశీల్దార్లతో యుద్ధప్రాతిపదికన సర్వే ఖమ్మం జిల్లాకు...

వెలుగుమట్ల బాధితులకు బీఆర్ఎస్ అండ

వెలుగుమట్ల బాధితులకు బీఆర్ఎస్ అండ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర ఆధ్వర్యంలో భోజనాల పంపిణీ కాకతీయ,...

సీఎం రేవంత్ రెడ్డికి సన్మానసభ పోస్టర్ ఆవిష్కరణ

సీఎం రేవంత్ రెడ్డికి సన్మానసభ పోస్టర్ ఆవిష్కరణ కాకతీయ, ఖమ్మం : ఎస్సీ...

భూదాన్ వ్యవహారంలో విపక్షాలే అభాసు

భూదాన్ వ్యవహారంలో విపక్షాలే అభాసు పేదల పేరుతో రాద్ధాంతం చేశారు ఏజెంట్ల మోసాలపై బాధితులకు...

మోదీ పాలనలో దేశానికి ప్రమాదం

మోదీ పాలనలో దేశానికి ప్రమాదం కార్పొరేట్ల కోసమే కేంద్రం విధానాలు సీపీఐ (ఎం) పొలిట్...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img