భారీగా నృసింహుని హుండీ ఆదాయం
రూ.2,45,48,023 కోట్ల నగదుతో పాటు ,బంగారం,వెండి,విదేశీ కరెన్సీ
కాకతీయ, యాదగిరిగుట్ట : తెలంగాణ తిరుపతిగా పేరుగాంచిన యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారి 41 రోజుల హుండీలను బుధవారం లెక్కించారు . 38 గ్రాముల మిశ్రమ బంగారం, రెండు కిలోల 8 00గ్రాముల మిశ్రమ వెండి తో పాటు ₹ 2,45,48,023 ( రెండు కోట్ల నలబై ఐదు లక్షల నలభై ఎనిమిది వేల ఇరవై మూడు రూపాయలు) నగదు ఆదాయం హుండీల ద్వారా సమకూరినట్లు దేవస్థానం కార్యనిర్వహణాధికారి ఎస్. వెంకట్రావు ఒక ప్రకటనలో తెలిపారు.

విదేశీ కరెన్సీ కూడా సమకూరినట్లు ఆయన వివరించారు.??అమెరికా- 1036 డాలర్లు,?? ఆస్ట్రేలియా – 5 డాలర్లు, ఇంగ్లాండ్- 45 పౌండ్స్,?? సౌదీ అరేబియన్ -5 రియల్,?? సింగపూర్ – 10 డాలర్స్ ,?? కతర్ – 1/2రియల్,?? ఒమన్ – 500 బైస ,??అరబ్ ఎమిరేట్స్- 70 థీర మ్స్, శ్రీలంక – 500., మలేసియా – 23, రింగిట్స్, కెనడా – 20 డాలర్స్, బెహ్రిన్ – 2 . హుండీ లెక్కింపులో అనువంశిక ధర్మకర్త బి నరసింహమూర్తి కూడా పాల్గొన్నారు.


