epaper
Monday, March 2, 2026
epaper

భూదాన్‌ భూముల్లో పేదలకు ఇళ్లు

భూదాన్‌ భూముల్లో పేదలకు ఇళ్లు
వెలుగుమట్ల భూదాన భూముల్లో ఇళ్లకు కోర్టు గ్రీన్ సిగ్నల్
నీరు, విద్యుత్ వంటి కనీస వసతులు వెంటనే కల్పించాలి
పేదలను బెదిరించేందుకు పోలీసుల జోక్యం ఆపాలి
భూదాన భూములపై కబ్జాలకు ప్రయత్నాలు జరుగుతున్నాయి
కోర్టు ఆదేశాలను విస్మరిస్తే న్యాయపరమైన చర్యలు తప్పవు
రాజ్యాంగం ప్రకారం పేదలకు న్యాయం చేయాలి
కోర్టు ఆదేశాలు అమలు చేయాలి
మాజీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బి. చంద్రకుమార్

కాకతీయ, ఖమ్మం : కోర్టు ఆదేశాల మేరకే ఖమ్మం వెలుగుమట్ల భూదాన భూముల్లో పేదలు ఇళ్లస్థలాలు ఏర్పాటు చేసుకున్నారని, వారికి వెంటనే నీటి సరఫరా, విద్యుత్ వంటి కనీస సౌకర్యాలు కల్పించాలని మాజీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బి. చంద్రకుమార్, సీనియర్ జర్నలిస్ట్ పాశం యాదగిరి డిమాండ్ చేశారు. ఖమ్మం ప్రెస్‌క్లబ్‌లో మంగళవారం నిర్వహించిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. 2014లో వెలుగుమట్లలోని భూదాన భూమిని పేదల ఇళ్లస్థలాల కోసం కేటాయించినట్లు తెలిపారు. కోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ, ఇప్పటి వరకు అక్కడ కనీస వసతులు కల్పించకుండా అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాకుండా పేదలను అక్కడి నుంచి వెళ్లగొట్టేందుకు పోలీసుల ద్వారా బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆరోపించారు.

పోలీసులు జోక్యం చేసుకోవ‌డం మానుకోవాలి

భూదాన భూముల్లో నివసిస్తున్న పేదలను భయభ్రాంతులకు గురిచేసి వెళ్లగొట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయని, పోలీసుల జోక్యం పూర్తిగా నిలిపివేయాలని జస్టిస్ చంద్రకుమార్ స్పష్టం చేశారు. కోర్టు ఆదేశాలను గౌరవించడం ప్రతి అధికారిక సంస్థ బాధ్యత అని, వాటిని అమలు చేయకుండా నిర్లక్ష్యం చేయడం చట్ట విరుద్ధమని హెచ్చరించారు. రాజకీయ నాయకులు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు భూదాన భూములను కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నారన్న ఆరోపణలు తీవ్రంగా ఉన్నాయని పేర్కొన్నారు. పేదలను అక్కడి నుంచి తొలగిస్తే ఆ భూములను ఆక్రమించే కుట్ర జరుగుతోందని విమర్శించారు.

కోర్టు ఆదేశాలు అమలు చేయకపోతే చర్యలు తప్పవు

భూదాన భూములను అమ్మే హక్కు గానీ, కొనుగోలు చేసే హక్కు గానీ ఎవరికీ లేదని స్పష్టం చేశారు. కోర్టు ఆదేశాలను పట్టించుకోకుండా పేదలను వేధిస్తే సంబంధిత అధికారులపై న్యాయపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. జిల్లా అధికారులు వెంటనే స్పందించి వెలుగుమట్ల భూదాన భూముల్లో నివసిస్తున్న పేదలకు నీరు, విద్యుత్, ఇతర మౌలిక వసతులు కల్పించాలని డిమాండ్ చేశారు. రాజ్యాంగం, న్యాయస్థానాల ఆదేశాలను గౌరవిస్తూ పేదలకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ సమావేశంలో భారత–చైనా మిత్రమండలి ఆల్ ఇండియా జనరల్ సెక్రటరీ డాక్టర్ మోహన్ రెడ్డి, సీనియర్ న్యాయవాది లక్ష్మీనారాయణ, తెలంగాణ ఓపిడిఆర్ రాష్ట్ర కార్యదర్శి డి. విజయేందర్, లంబాడ హక్కుల పోరాట సమితి నాయకులు భద్రు నాయక్, బిసి, ఎస్సీ, ఎస్టీ జేఏసీ నాయకులు రాంబాబు, యర్రా బాబు తదితరులు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

ఎస్సీ వర్గీకరణ పోరులో అమరవీరులకు జోహార్లు

ఎస్సీ వర్గీకరణ పోరులో అమరవీరులకు జోహార్లు సింగరేణిలో ఎమ్మార్పీఎస్ గద్దె వద్ద నివాళులు త్యాగాలు...

బొగ్గు–ఇసుక లారీల బీభత్సం..!

బొగ్గు–ఇసుక లారీల బీభత్సం..! మణుగూరు–బయ్యారం రహదారి ధ్వంసం దుమ్ము ధూళితో గిరిజన బిడ్డల అనారోగ్యం ప్రజల...

అదుపుతప్పిన ఇసుక ట్రాక్టర్ – డ్రైవర్ దుర్మరణం

అదుపుతప్పిన ఇసుక ట్రాక్టర్ – డ్రైవర్ దుర్మరణం నాగులవంచ వద్ద తెల్లవారుజామున ప్రమాదం ఓవర్‌టేక్...

వెలుగుమట్ల బాధితులపై ముమ్మర సర్వే

వెలుగుమట్ల బాధితులపై ముమ్మర సర్వే 21 మంది తహశీల్దార్లతో యుద్ధప్రాతిపదికన సర్వే ఖమ్మం జిల్లాకు...

వెలుగుమట్ల బాధితులకు బీఆర్ఎస్ అండ

వెలుగుమట్ల బాధితులకు బీఆర్ఎస్ అండ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర ఆధ్వర్యంలో భోజనాల పంపిణీ కాకతీయ,...

సీఎం రేవంత్ రెడ్డికి సన్మానసభ పోస్టర్ ఆవిష్కరణ

సీఎం రేవంత్ రెడ్డికి సన్మానసభ పోస్టర్ ఆవిష్కరణ కాకతీయ, ఖమ్మం : ఎస్సీ...

భూదాన్ వ్యవహారంలో విపక్షాలే అభాసు

భూదాన్ వ్యవహారంలో విపక్షాలే అభాసు పేదల పేరుతో రాద్ధాంతం చేశారు ఏజెంట్ల మోసాలపై బాధితులకు...

మోదీ పాలనలో దేశానికి ప్రమాదం

మోదీ పాలనలో దేశానికి ప్రమాదం కార్పొరేట్ల కోసమే కేంద్రం విధానాలు సీపీఐ (ఎం) పొలిట్...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img