ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో నూతనంగా ఎన్నికైన ప్రజాప్రతినిధులకు సన్మానం
కాకతీయ, చేర్యాల: చేర్యాల మున్సిపాలిటీతో పాటు చేర్యాల, మద్దూర్ కొమురవెల్లి,మండలాలలోని గ్రామ పంచాయతీ పరిధిలోని గ్రామాల మాదిగ సమాజ వర్గానికి సంబంధించిన నూతనంగా ఎన్నికైన చేర్యాల మున్సిపల్ చైర్పర్సన్, కౌన్సిలర్లు,గ్రామ సర్పంచులు, ఉపసర్పంచులు, వార్డు సభ్యులను,ఎమ్మార్పీఎస్ మండల శాఖ ఆధ్వర్యంలో ఆదివారం సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా చేర్యాల పట్టణంలోని ఓ ఫంక్షన్ హాలు లో ఏర్పాటుచేసిన సన్మాన కార్యక్రమంలో గ్రామాల వారీగా సకుటుంబ సమేతంగా వచ్చిన,చేర్యాల మున్సిపల్, గ్రామస్థాయి నూతనంగా ఎన్నికైన ప్రజాప్రతినిధులకు శాలువాతో సన్మానించి జ్ఞాపికలను అందజేశారు. నూతనంగా ఎన్నికైన మున్సిపల్ చైర్ పర్సన్, కౌన్సిలర్లు, గ్రామ సర్పంచులు అభివృద్ధి కొరకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని రాబోయే రోజులలో ప్రజాప్రతినిధులుగా మంచి పేర్లు గడించాలని ఎమ్మార్పీఎస్ సిద్దిపేట జిల్లా అధ్యక్షులు ముక్కపల్లి రాజు, సిద్దిపేట జిల్లా ఇంచార్జి మల్లిగారి యాదగిరి అన్నారు. చేర్యాల మున్సిపల్ చైర్పర్సన్ ముస్త్యాల అరుణ -బాల నర్సయ్య, కౌన్సిలర్ కొమ్ము రాజేశ్వరి-నర్సింగరావు, ఆకునూర్ గ్రామ సర్పంచ్ కొమ్ము రవి, మద్దూర్ సర్పంచ్ దామెర మల్లేశం, చుంచన్నకోట గ్రామ సర్పంచ్ గొర్రె శ్రీనివాస్, పాత దొమ్మట సర్పంచ్ గంపల భవాని- కిషన్,తో పాటు చేర్యాల,మద్దూర్, చేర్యాల, కొమురవెల్లి, మండలాల మాదిగ ప్రజా ప్రతినిధులు హాజరు కాగా వారికి ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించారు.ఈ చేర్యాల డివిజన్ ఎమ్మార్పీఎస్ ఇంచార్జి సానవాల ప్రసాద్,చేర్యాల మండల ఇంచార్జి కొక్కొండ రవీ, మాదిగ ఉద్యోగ సమాఖ్య జిల్లా అధ్యక్షులు మరాటి సంతోష్ తదితరులు పాల్గొన్నారు.


