హిడ్మా హతం..!?
ఒడిషా బార్డర్లో ఎన్ కౌంటర్
హిడ్మాతో పాటు మరో ఆరుగురు సైతం..
మృతుల్లో హిడ్మా భార్య కూడా
కాకతీయ, తెలంగాణ బ్యూరో : ఆంధ్రప్రదేశ్- ఓడిషా సరిహద్దులో జరిగిన ఎన్ కౌంటర్లో హిడ్మా హతమైనట్లుగా వార్తలు వస్తున్నాయి. హిడ్మాతో పాటు మరో ఆరుగురు కూడా మృతి చెందినట్లుగా తెలుస్తోంది. మృతుల్లో హిడ్మా భార్య కూడా ఉన్నట్లుగా తెలుస్తోంది.అగ్రనేతల్లో కొంతమంది ఇప్పటికే మృతి చెందగా మరికొంతమంది ఇటీవల లొంగిపోయిన విషయం తెలిసిందే. హిడ్మా మాత్రం మావోయిస్టు ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లేందుకే నిర్ణయించుకుని అడవుల్లోనే ఉండిపోయాడు. ఈ నేపథ్యంలో హిడ్మాను లొంగిపోవాలని కోరుతూ ఇటీవల చత్తీస్గడ్ హోంమంత్రి స్వయంగా చత్తీస్గడ్లోని ఆయన ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను కోరాడు. అయినా లొంగుబాటుకు సంబంధించి ఎలాంటి సానుకూల ప్రకటన ఆయన్ను రాలేదు. మరో వైపు హిడ్మాను అదుపులోకి తీసుకునేందుకు కూంబింగ్ బృందాలు ప్రయత్నాలను ముమ్మరం చేయగా… హిడ్మా ఎన్కౌంటర్ అయినట్లుగా వార్తలు రావడం గమనార్హం. ఈ విషయంపై పోలీసుల నుంచి ధ్రువీకరణ కాలేదు.


