epaper
Thursday, January 15, 2026
epaper

మొద‌టి విడ‌త ఎన్నిక‌ల‌కు భారీ భ‌ద్ర‌త‌

మొద‌టి విడ‌త ఎన్నిక‌ల‌కు భారీ భ‌ద్ర‌త‌
2 వేల మంది పోలీసులతో బందోబ‌స్తు
స‌మ‌స్యాత్మ‌క పోలింగ్ కేంద్రాల్లో సాయుధ బలగాలు
953 కేసుల్లో 6403 మంది బైండోవర్
12 లక్షల విలువ చేసే మద్యం సీజ్
16 సరిహద్దు చెక్ పోస్టుల వ‌ద్ద విస్తృత తనిఖీలు
5 ఎఫ్ఎస్టీ, 15 ఎస్ఎస్టీ బృందాల ద్వారా నిఘా
పోలీస్ కమిషనర్ సునీల్ దత్

కాకతీయ, ఖమ్మం ప్రతినిధి : గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా జిల్లాలో రెండు వేల మందితో భారీగా పోలీసు భద్రత ఏర్పాట్లను చేపట్టినట్లు పోలీస్ కమిషనర్ సునీల్ దత్ తెలిపారు. ఎన్నికలలో పోలీసుల విధివిధానాలపై దిశానిర్దేశం చేశామని, పౌరుల స్వేచ్ఛకు భంగం కలగకుండా ప్రలోభాలకు తావు లేకుండా ఓటరు పోలింగ్ కు కదిలేలా జిల్లా అధికార యంత్రాంగం ప్రత్యేక దృష్టి సారించి తగిన ఏర్పాట్లు చేసిందని తెలిపారు. ఇప్పటికే మండలలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా క్రిటికల్ పోలింగ్ స్టేషన్లలో సాయుధ పోలీసు బలగాలను మొహరించినట్లు తెలిపారు. ఎన్నికలు జరుగుతున్న ప్రాంతాల్లో స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్, రూట్ మొబైల్ పార్టీలు, 5 ఎఫ్ఎస్టీ బృందాలు, 15 ఎస్ఎస్టీ బృందాల ద్వారా నిఘా కొనసాగుతోందని, డబ్బు, మద్యం ప్రభావాన్ని నియంత్రించేలా తనిఖీలు చేపడుతున్నామని అన్నారు. ఇప్పటికే 953 బైండోవర్ కేసుల్లో 6403 మందిని తాహసిల్దార్ ఎదుట హాజరు పరిచామని పేర్కొన్నారు.

జిల్లాలో 184 స‌మ‌స్యాత్మ‌క కేంద్రాలు

జిల్లాలో జరిగే మూడు విడతల పోలింగ్ లో 184 క్రిటికల్ పోలింగ్ కేంద్రాలను గుర్తించామని, వాటిల్లో నామినేషన్ల దాఖలు ప్రక్రియ నుంచే పోలీసుల నిఘా పెంచామని, గ్రామంలో ప్రతి కదలికపై ఏసీపీ స్థాయి అధికారి ఆధ్వర్యంలో నిరంతరం పర్యవేక్షణ ఉంటుందన్నారు. పోలింగ్ రోజున ప్రత్యేక బలగాలతో బందోబస్తు నిర్వహిస్తామని, జిల్లా కేంద్రంల” స్పెషల్ బ్రాంచి, ఇతర సిబ్బందితో 24 గంటలూ పనిచేసేలా ప్రత్యేక సెల్ ఏర్పాటు చేశామని అన్నారు. అదేవిదంగా జిల్లా వ్యాప్తంగా 16 చెక్ పోస్టులను ఏర్పాటు చేసి, సరిహద్దు ప్రాంతాలలో ప్రత్యేక పోలీసు తనిఖీ కేంద్రాలను ఏర్పాటు చేశామని అన్నారు. ప్రతి తనిఖీ కేంద్రం వద్ద ఫ్లైయింగ్ స్క్వాడ్ బృందం ఉంటుందన్నారు. గ్రామాల్లో అనధికారిక మద్యం నిల్వలు ఏర్పాటు చేసుకున్న మద్యం గొలుసు దుకాణాలపై దాడులు చేసి 12 లక్షల విలువ చేసే 1200 లీటర్ల మద్యం సీజ్ చేసినట్లు తెలిపారు. జిల్లాలో తుపాకులు కలిగిన 86 మంది ఆయుధాలను జిల్లా పోలీసు హెడ్ క్వాటర్స్ లో అప్పగించారని తెలిపారు. 207 మంది రౌడీ షీటర్లు 1100 మంది ట్రబుల్ మంగర్స్ పాతనేరస్తులు కదలికలపై నిఘా ఏర్పాటు చేశామని అన్నారు. ఎన్నికలు జరిగే డివిజన్లలో ఇద్దరు ఏసీపీ స్థాయి అధికారులను నోడల్ అధికారులుగా నియమించాని అన్నారు. శాంతిభద్రతల దృష్ట్యా ఆయా ఎన్నికలు జరిగే మండలలో సెక్షన్ 163 BNSS యాక్ట్ అమల్లో ఉంటుందని, ప్రశాంత వాతావరణంలో ఎన్నికల నిర్వహణ కోసం గ్రామాల వారీగా భద్రతా చర్యలు తీసుకున్నామని తెలిపారు.

2వేల మంది పోలీసుల‌తో భారీ బందోబ‌స్తు..!

అడిషనల్ డీసీపీలు ప్రసాద్ రావు, రామానుజం, కుమారస్వామి, విజయబాబు, ఏసీపీలు రమణమూర్తి, తిరుపతి రెడ్డి, వసుంధర యాదవ్, శ్రీనివాసులు, మహేష్, సాంబరాజు,సత్యనారాయణ, సర్వర్, సుశీల్ సింగ్, నర్సయ్య తో పాటు సిఐలు, ఆర్ ఐలు, ఎస్సై లు పోలీస్, హోంగార్డ్ సిబ్బంది మొత్తం 2000 మంది బందోబస్త్ లో పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

ఖండాంతరాల్లో సిపిఐ శతాబ్ది సంబరం..!

ఖండాంతరాల్లో సిపిఐ శతాబ్ది సంబరం..! విదేశాల్లోనూ ఎగసిన వామపక్ష జెండా ఖమ్మం వామపక్ష కుటుంబాల...

రూ.15 లక్షల గంజాయి ద్రవం పట్టివేత.. ఇద్ద‌రి అరెస్టు..

రూ.15 లక్షల గంజాయి ద్రవం పట్టివేత.. ఇద్ద‌రి అరెస్టు.. ద్విచక్ర వాహనం, రెండు...

రిజర్వేషన్లకు ముందే టికెట్ల యుద్ధం

రిజర్వేషన్లకు ముందే టికెట్ల యుద్ధం * మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో పొలిటికల్ హీట్ *...

చైనా మాంజాలపై ఉక్కుపాదం

చైనా మాంజాలపై ఉక్కుపాదం * విక్రయిస్తే కేసులు తప్పవు * వాహనదారులకు ప్రాణహాని * పక్షుల...

ప్రజావాణి కి అధికారుల డుమ్మా

ప్రజావాణి కి అధికారుల డుమ్మా * 11 దాటినా జాడలేని అధికారులు * 29...

భూసారం కాపాడుకోవడం రైతు బాధ్యత

భూసారం కాపాడుకోవడం రైతు బాధ్యత సాగు ఖర్చులు త‌గ్గితేనే ఆదాయం పెరుగుతుంది అవసరానికి మించి...

స్థానిక సమస్యలకు సీపీఐ(ఎం)తోనే పరిష్కారం

స్థానిక సమస్యలకు సీపీఐ(ఎం)తోనే పరిష్కారం సంస్కృతి–సంప్రదాయాలకు ప్రతీక రంగవల్లికలు సీపీఐ(ఎం) ఖమ్మం డివిజన్ కార్యదర్శి...

నేడు కాంగ్రెస్‌ ముత్యాల ముగ్గుల పోటీలు

నేడు కాంగ్రెస్‌ ముత్యాల ముగ్గుల పోటీలు కొత్తగూడెం ప్రకాశం స్టేడియంలో 3 గంటలకు...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...

రేవంత్ కు కొత్త సవాల్!

* సర్కార్ కు పరీక్షగా సీఎస్ ఎంపిక? * ఈ నెలాఖరున రామకృష్ణారావు...

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం కాక‌తీయ‌, హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లాలోని బాటసింగారంలో...

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన ప్రతిపాదించిన ప్రాజెక్టుపై...

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా న్యూ డిల్లీ జూలై...

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు మొన్న యూనివర్సిటీల్లో ఆందోళనలు నిషేధిస్తూ మెమో నేడు...

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌ కాంగ్రెస్‌ దూత ఫోన్‌ ట్యాపింగ్‌..! గాంధీ...
spot_img

Popular Categories

spot_imgspot_img