epaper
Thursday, November 20, 2025
epaper

నిబంధనలు పాటిస్తేనే ధాన్యం కేటాయింపు

నిబంధనలు పాటిస్తేనే ధాన్యం కేటాయింపు
మిల్ల‌ర్ల‌కు అదనపు కలెక్టర్ శ్రీనివాస రెడ్డి హెచ్చ‌రిక‌
రైస్ మిల్లర్లతో స‌మీక్ష స‌మావేశం

కాకతీయ, ఖమ్మం ప్రతినిధి : నిబంధనలు పాటించే రైస్ మిల్లర్లకే ధాన్యం కేటాయించడం జరుగుతుందని అదనపు కలెక్టర్ పి. శ్రీనివాస రెడ్డి అన్నారు. అదనపు కలెక్టర్, కలెక్టరేట్ సమావేశ మందిరంలో ధాన్యం కొనుగోలుపై రైస్ మిల్లర్లు, సంబంధిత అధికారులతో గురువారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ పి. శ్రీనివాస రెడ్డి మాట్లాడుతూ ఖరీఫ్ మార్కెటింగ్ సీజన్ ధాన్యం కొనుగోలు ప్రక్రియ ఆశించిన స్థాయిలో సజావుగా జరగడం లేదని తెలిపారు. జిల్లాలో ఉన్న 71 రైస్ మిల్లుల్లో ఇప్పటి వరకు 63 రైస్ మిల్లర్లు మాత్రమే బ్యాంకు గ్యారంటీ లు సమర్పించారని, మిగిలిన 8 మిల్లులకు ఎట్టి పరిస్థితులలో ధాన్యం కేటాయింపులు జరగవని అదనపు కలెక్టర్ స్పష్టం చేశారు.
8 మిల్లులు గతంలో పెండింగ్ ఉన్న రైస్ డెలివరీ పూర్తి చేసి, బ్యాంక్ గ్యారంటీలు సమర్పిస్తే ఖరీఫ్ సీజన్ ధాన్యం కేటాయింపు పై నిర్ణయం తీసుకుంటామని అన్నారు. 10 శాతం బ్యాంకు గ్యారంటీ, పెండింగ్ యాసంగి రైస్ డెలివరీ పూర్తి చేయని పక్షంలో రైస్ మిల్లులకు గోడౌన్ ట్యాగ్ చేయడం జరగదని అన్నారు.
ఖరీఫ్ మార్కెటింగ్ సీజన్ ధాన్యం తీసుకున్న ప్రతి రైస్ మిల్లర్ తప్పనిసరిగా యాసంగి కేటాయింపు తీసుకోవాల్సి ఉంటుందని అదనపు కలెక్టర్ స్పష్టం చేశారు. ప్రతి సీజన్ లో 2 నుంచి 3 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం రైస్ మిల్లర్లకు కేటాయించాల్సి ఉంటుందని, దీనికి అనుగుణంగా మిల్లర్లు కొల్లేటరల్ బ్యాంకు గ్యారంటీ సిద్దం చేసుకోవాలని అన్నారు. రైస్ డెలివరీకి సంబంధించి గోదాముల సమస్య పరిష్కారం కోసం నూతన గోదాముల నిర్మాణం చేపట్టామని అన్నారు. రైస్ మిల్లులకు ఉన్న వివిధ సమస్యల సంబంధించి దరఖాస్తులు అందిస్తే ప్రభుత్వానికి నివేదించడం జరుగుతుందని అన్నారు.
సమావేశంలో జిల్లా రైస్ మిల్లర్ల సంఘం అధ్యక్షులు బొమ్మ రాజేశ్వర రావు మాట్లాడుతూ ప్రతి సీజన్ 1,70,000 మెట్రిక్ టన్నులకు పైగా బియ్యం సరఫరా చేయాల్సి ఉంటుందని, ఇక్కడ గోదాముల ప్లేస్ సరిపోయేంత లేదని అన్నారు. గోడౌన్ సమస్య వల్ల దూర ప్రాంతాలకు బియ్యం డెలీవరి సమయంలో రవాణా ఖర్చులు అందించాలని కోరారు. ఈ సమావేశంలో జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి చందన్ కుమార్, జిల్లా పౌర సరఫరాల సంస్థ మేనేజర్ శ్రీలత, సంబంధిత అధికారులు, మిల్లర్ లు, తదితరులు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

సజావుగా పంచాయతీ ఎన్నికల నిర్వహణకు సన్నద్ధంగా ఉండాలి

సజావుగా పంచాయతీ ఎన్నికల నిర్వహణకు సన్నద్ధంగా ఉండాలి రాష్ట్ర ఎన్నికల సంఘం కమీషనర్...

హోంగార్డ్ ఉద్యోగుల ఆరోగ్య భీమాపథకంపై అవగాహన సదస్సు

హోంగార్డ్ ఉద్యోగుల ఆరోగ్య భీమాపథకంపై అవగాహన సదస్సు కాకతీయ, ఖమ్మం : హోంగార్డు...

ఎర్త్ సైన్స్ యూనివర్సిటీలో ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా కలెక్టర్

ఎర్త్ సైన్స్ యూనివర్సిటీలో ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ కొత్తగూడెం,...

ఖమ్మం నరగంలో దారుణ హత్య

ఖమ్మం నరగంలో దారుణ హత్య భార్య ను గొంతు కోసి హత్య చేసిన...

పాఠశాలలను పరిశుభ్రంగా ఉంచాలి.

పాఠశాలలను పరిశుభ్రంగా ఉంచాలి. నాణ్యమైన విద్యను అందించడం ఉపాధ్యాయుల లక్ష్యం జూలూరుపాడులో రాష్ట్ర విద్యాశాఖ...

పాల్వంచ‌లో స‌మ‌స్య‌ల తిష్ట‌

పాల్వంచ‌లో స‌మ‌స్య‌ల తిష్ట‌ డ్రైనేజీలు, రోడ్లకు మ‌ర‌మ్మ‌తులు చేప‌ట్టాలి ఎంపీడీవోకు బీఆర్ ఎస్ నేత‌ల...

అటవీ భూమిని కాపాడాలి

అటవీ భూమిని కాపాడాలి ఫారెస్ట్ అధికారుల‌కు డీఎఫ్‌వో కిష్ట‌గౌడ్ సూచ‌న‌ కాకతీయ, జూలూరుపాడు :...

కవులు సమాజ సంపదతో సమానం

కవులు సమాజ సంపదతో సమానం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివ రావు జిల్లా గ్రంథాలయాభివృద్ధికి కృషి కాకతీయ,కొత్తగూడెం...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...

రేవంత్ కు కొత్త సవాల్!

* సర్కార్ కు పరీక్షగా సీఎస్ ఎంపిక? * ఈ నెలాఖరున రామకృష్ణారావు...

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం కాక‌తీయ‌, హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లాలోని బాటసింగారంలో...

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన ప్రతిపాదించిన ప్రాజెక్టుపై...

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా న్యూ డిల్లీ జూలై...

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు మొన్న యూనివర్సిటీల్లో ఆందోళనలు నిషేధిస్తూ మెమో నేడు...

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌ కాంగ్రెస్‌ దూత ఫోన్‌ ట్యాపింగ్‌..! గాంధీ...
spot_img

Popular Categories

spot_imgspot_img