epaper
Tuesday, November 18, 2025
epaper

పత్తి రైతుల సమస్యలపై గలమెత్తిన గంగుల

పత్తి రైతుల సమస్యలపై గలమెత్తిన గంగుల
సిసిఐ నిబంధనలు సడలించాలి
మిల్లుల సమ్మె వెంటనే విరమింపజేయాలి

కాకతీయ, కరీంనగర్ : పత్తి రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో సిసిఐ కొనుగోలు విధానాల్లో మార్పులు చేసి, రైతులకు ఉపశమనం కల్పించాలని మాజీ మంత్రి, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ జిల్లా అధికారులను కోరారు. ఈ మేరకు పత్తి రైతులతో కలిసి జిల్లా కలెక్టరేట్ ఎదుట బుధవారం నిరసన తెలుపుతూ అడిషనల్ కలెక్టర్ లక్ష్మీకిరణ్‌కు వినతిపత్రం సమర్పించారు.గంగుల కమలాకర్ మాట్లాడుతూ.ప్రస్తుత పరిస్థితుల్లో రైతు పండించిన పత్తి మొత్తం కొనుగోలు అయ్యేలా సిసిఐ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సిసిఐ జిన్నింగ్ మిల్లులకు ఎల్–1, ఎల్–2, ఎల్–3 అంటూ కేటాయింపులు చేసి ప్రతి మిల్లుకు 1450 క్వింటాళ్ల పరిమితి విధించడంతో రైతులు ఒకే మిల్లుకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడిందని, దీనివల్ల మిల్లు యజమానులు కొర్రీలు పెట్టి రైతులను నష్టపరుస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ పరిమితిని వెంటనే రద్దు చేయాల్సిన అవసరం ఉందని అన్నారు.పత్తి రైతుల్లో పెద్దశాతం కౌలు రైతులేనని, గతంలో పట్టేదారు ఆధార్,పాసుబుక్ సమర్పిస్తే వచ్చిన ఓటిపి ద్వారా సిసిఐ కొనుగోలు జరిగేదని గుర్తు చేశారు. అయితే ఇప్పుడది నిలిపివేసి, తప్పనిసరిగా పట్టేదారే వచ్చి వేలిముద్రతో స్లాట్ బుక్ చేయాల్సిన నిబంధన పెట్టడం కౌలు రైతులకు తీవ్ర ఇబ్బందులు తెచ్చిపెడుతోందని పేర్కొన్నారు. ఈ నిబంధన రైతు ప్రయోజనాలకు పూర్తిగా విరుద్ధమని తెలిపారు.మునుపు సిసిఐ రైతు నుంచి ఎకరాకు 12 క్వింటాళ్ల వరకు పత్తి కొనుగోలు చేసేదని, అయితే ఇప్పుడది 7 క్వింటాళ్లకు తగ్గించడంతో మిగిలిన పత్తిని రైతులు ప్రైవేటు దళారులకే అమ్మాల్సిన దుస్థితి నెలకొన్నదని కమలాకర్ వివరించారు. సిసిఐ రేటు రూ.8,110 ఉండగా దళారులు రూ.6,000 మాత్రమే ఇస్తుండటంతో క్వింటాల్‌కు రూ.2,100, ఎకరాకు రూ.16వేలకు పైగా రైతు నష్టపోతున్నాడని పేర్కొన్నారు.ఇక అకాల వర్షాల వలన పత్తి కాయలు నల్లబారిపోయి, సిసిఐ ‘నష్టం’ అంటూ కొనుగోలు నిరాకరిస్తోందని, దళారులు మాత్రం నాలుగు,ఐదు వేలకే కొనడం వల్ల రైతులు తీవ్రంగా దెబ్బతిన్నారని కమలాకర్ ఆవేదన వ్యక్తం చేశారు.జిల్లాలో జిన్నింగ్ మిల్లు యజమానుల సమ్మె కొనసాగుతోందని, దాని ప్రభావం రైతులపై పడుతోందని పేర్కొంటూ కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే జోక్యం చేసుకుని మిల్లుల సమ్మె విరమింపజేసి, సిసిఐ ద్వారా పత్తి మొత్తాన్ని కొనుగోలు అయ్యేలా చర్యలు తీసుకోవాలని
భారత రాష్ట్ర సమితి తరఫున గంగుల కమలాకర్ డిమాండ్ చేశారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

చదువు తో విద్యార్థుల జీవితాలలో వెలుగును నింపుతుంది

చదువు తో విద్యార్థుల జీవితాలలో వెలుగును నింపుతుంది ఫౌండేషన్ ఇంచార్జ్ బియ్యాల దినేష్ కాకతీయ,...

మహాత్మా నగర్‌లో శ్రీ అయ్యప్ప స్వామి ప్రతిష్ఠ

మహాత్మా నగర్‌లో శ్రీ అయ్యప్ప స్వామి ప్రతిష్ఠ 21 నుంచి మహోత్సవాలు కాకతీయ, కరీంనగర్...

23న చలో ఉట్నూర్ బహిరంగ సభను విజయవంతం చేయండి

23న చలో ఉట్నూర్ బహిరంగ సభను విజయవంతం చేయండి కాకతీయ, లక్షెట్టిపేట :...

కాంగ్రెస్ పాలనలో కరెంటు నుండి కాంట దాకా అన్నీ సమస్యలే

కాంగ్రెస్ పాలనలో కరెంటు నుండి కాంట దాకా అన్నీ సమస్యలే సీఎం రేవంత్...

మున్సిపల్ ఎన్నికలు వేగవంతం చేయాలి

మున్సిపల్ ఎన్నికలు వేగవంతం చేయాలి కేంద్ర మంత్రిని కోరిన మాజీ మేయర్ బిజెపి...

చిక్కటి దేహదారుడ్యానికి చక్కటి ఆరోగ్య సూచనలు

చిక్కటి దేహదారుడ్యానికి చక్కటి ఆరోగ్య సూచనలు కాకతీయ,హుజూరాబాద్‌: హుజూరాబాద్ మండలంలోని ప్రభుత్వ జూనియర్...

బీసీల హక్కులు బీసీలకే దక్కాలి

బీసీల హక్కులు బీసీలకే దక్కాలి జమ్మికుంట సదస్సును విజయవంతం చేయండి నాయకుల పిలుపు కాకతీయ, హుజురాబాద్:...

శివనగర్‌లో అక్రమంగా నిర్మిస్తున్న మొబైల్‌టవర్‌పై కాలనీవాసుల ఆగ్రహం

శివనగర్‌లో అక్రమంగా నిర్మిస్తున్న మొబైల్‌టవర్‌పై కాలనీవాసుల ఆగ్రహం అక్రమ అనుమతుల రద్దు కోరుతూ...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...

రేవంత్ కు కొత్త సవాల్!

* సర్కార్ కు పరీక్షగా సీఎస్ ఎంపిక? * ఈ నెలాఖరున రామకృష్ణారావు...

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం కాక‌తీయ‌, హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లాలోని బాటసింగారంలో...

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన ప్రతిపాదించిన ప్రాజెక్టుపై...

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా న్యూ డిల్లీ జూలై...

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు మొన్న యూనివర్సిటీల్లో ఆందోళనలు నిషేధిస్తూ మెమో నేడు...

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌ కాంగ్రెస్‌ దూత ఫోన్‌ ట్యాపింగ్‌..! గాంధీ...
spot_img

Popular Categories

spot_imgspot_img