epaper
Thursday, January 15, 2026
epaper

పత్తి రైతుల సమస్యలపై గలమెత్తిన గంగుల

పత్తి రైతుల సమస్యలపై గలమెత్తిన గంగుల
సిసిఐ నిబంధనలు సడలించాలి
మిల్లుల సమ్మె వెంటనే విరమింపజేయాలి

కాకతీయ, కరీంనగర్ : పత్తి రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో సిసిఐ కొనుగోలు విధానాల్లో మార్పులు చేసి, రైతులకు ఉపశమనం కల్పించాలని మాజీ మంత్రి, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ జిల్లా అధికారులను కోరారు. ఈ మేరకు పత్తి రైతులతో కలిసి జిల్లా కలెక్టరేట్ ఎదుట బుధవారం నిరసన తెలుపుతూ అడిషనల్ కలెక్టర్ లక్ష్మీకిరణ్‌కు వినతిపత్రం సమర్పించారు.గంగుల కమలాకర్ మాట్లాడుతూ.ప్రస్తుత పరిస్థితుల్లో రైతు పండించిన పత్తి మొత్తం కొనుగోలు అయ్యేలా సిసిఐ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సిసిఐ జిన్నింగ్ మిల్లులకు ఎల్–1, ఎల్–2, ఎల్–3 అంటూ కేటాయింపులు చేసి ప్రతి మిల్లుకు 1450 క్వింటాళ్ల పరిమితి విధించడంతో రైతులు ఒకే మిల్లుకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడిందని, దీనివల్ల మిల్లు యజమానులు కొర్రీలు పెట్టి రైతులను నష్టపరుస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ పరిమితిని వెంటనే రద్దు చేయాల్సిన అవసరం ఉందని అన్నారు.పత్తి రైతుల్లో పెద్దశాతం కౌలు రైతులేనని, గతంలో పట్టేదారు ఆధార్,పాసుబుక్ సమర్పిస్తే వచ్చిన ఓటిపి ద్వారా సిసిఐ కొనుగోలు జరిగేదని గుర్తు చేశారు. అయితే ఇప్పుడది నిలిపివేసి, తప్పనిసరిగా పట్టేదారే వచ్చి వేలిముద్రతో స్లాట్ బుక్ చేయాల్సిన నిబంధన పెట్టడం కౌలు రైతులకు తీవ్ర ఇబ్బందులు తెచ్చిపెడుతోందని పేర్కొన్నారు. ఈ నిబంధన రైతు ప్రయోజనాలకు పూర్తిగా విరుద్ధమని తెలిపారు.మునుపు సిసిఐ రైతు నుంచి ఎకరాకు 12 క్వింటాళ్ల వరకు పత్తి కొనుగోలు చేసేదని, అయితే ఇప్పుడది 7 క్వింటాళ్లకు తగ్గించడంతో మిగిలిన పత్తిని రైతులు ప్రైవేటు దళారులకే అమ్మాల్సిన దుస్థితి నెలకొన్నదని కమలాకర్ వివరించారు. సిసిఐ రేటు రూ.8,110 ఉండగా దళారులు రూ.6,000 మాత్రమే ఇస్తుండటంతో క్వింటాల్‌కు రూ.2,100, ఎకరాకు రూ.16వేలకు పైగా రైతు నష్టపోతున్నాడని పేర్కొన్నారు.ఇక అకాల వర్షాల వలన పత్తి కాయలు నల్లబారిపోయి, సిసిఐ ‘నష్టం’ అంటూ కొనుగోలు నిరాకరిస్తోందని, దళారులు మాత్రం నాలుగు,ఐదు వేలకే కొనడం వల్ల రైతులు తీవ్రంగా దెబ్బతిన్నారని కమలాకర్ ఆవేదన వ్యక్తం చేశారు.జిల్లాలో జిన్నింగ్ మిల్లు యజమానుల సమ్మె కొనసాగుతోందని, దాని ప్రభావం రైతులపై పడుతోందని పేర్కొంటూ కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే జోక్యం చేసుకుని మిల్లుల సమ్మె విరమింపజేసి, సిసిఐ ద్వారా పత్తి మొత్తాన్ని కొనుగోలు అయ్యేలా చర్యలు తీసుకోవాలని
భారత రాష్ట్ర సమితి తరఫున గంగుల కమలాకర్ డిమాండ్ చేశారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

వృద్ధురాలిని నట్టేట ముంచారు..!

వృద్ధురాలిని నట్టేట ముంచారు..! విలువైన భూముల అక్రమ రిజిస్ట్రేషన్లు మీడియా ముందుకు వచ్చిన శంభునిపల్లి...

జర్నలిస్టుల అరెస్టులు అన్యాయం

జర్నలిస్టుల అరెస్టులు అన్యాయం అక్రమ అరెస్టులను ఖండించిన టీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర కో కన్వీనర్ కే....

పురాభివృద్ధే నా లక్ష్యం..!

పురాభివృద్ధే నా లక్ష్యం..! ఎన్నికల హామీల అమలే ప్రాధాన్యం క్యాతన్‌పల్లిలో అభివృద్ధి పనులకు శ్రీకారం సీసీ...

వావిలాలలో వైభవంగా గోదాదేవి కల్యాణం

వావిలాలలో వైభవంగా గోదాదేవి కల్యాణం కాకతీయ, జమ్మికుంట : ధనుర్మాస ఉత్సవాల ముగింపు...

వలపు వల… లక్షల లూటీ

వలపు వల… లక్షల లూటీ ఇన్‌స్టాగ్రామ్ ముసుగులో సెక్స్ ట్రాప్ నగ్న వీడియోలతో...

వాస్తవాల‌కు వేదికగా కాకతీయ

వాస్తవాల‌కు వేదికగా కాకతీయ వెహికిల్ ఇన్‌స్పెక్టర్ కంచె వేణు కాకతీయ, హుజురాబాద్ : ప్రజా...

నో కాంప్రమైజ్.. ఆన్ డ్యూటీ..!

నో కాంప్రమైజ్.. ఆన్ డ్యూటీ..! ఎస్సైపై వేటు నిలిపివేయాల‌ని ఎమ్మెల్యే హుకుం..!! వెన‌క్కి త‌గ్గ‌ని...

సీఏం రేవంత్ రెడ్డి మాటల మాంత్రికుడు

సీఏం రేవంత్ రెడ్డి మాటల మాంత్రికుడు 6 డీఏలు పెండింగ్ అంటే రాష్ట్రం...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...

రేవంత్ కు కొత్త సవాల్!

* సర్కార్ కు పరీక్షగా సీఎస్ ఎంపిక? * ఈ నెలాఖరున రామకృష్ణారావు...

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం కాక‌తీయ‌, హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లాలోని బాటసింగారంలో...

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన ప్రతిపాదించిన ప్రాజెక్టుపై...

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా న్యూ డిల్లీ జూలై...

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు మొన్న యూనివర్సిటీల్లో ఆందోళనలు నిషేధిస్తూ మెమో నేడు...

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌ కాంగ్రెస్‌ దూత ఫోన్‌ ట్యాపింగ్‌..! గాంధీ...
spot_img

Popular Categories

spot_imgspot_img