- ప్రజలు జాగ్రత్తగా ఉండాలన్న సీఐ
కాకతీయ, ఖమ్మం ప్రతినిధి: ఈ ఫోటోలో కనిపిస్తున్న నిందితులు నగరంలో తిరుగుతూ.. దొరికిన బంగారు బిస్కెట్ తక్కువ ధరకే ఇస్తామంటూ ప్రజలను మోసం చేస్తున్న నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని ఖమ్మం త్రీ టౌన్ సీఐ మెహన్ బాబు తెలిపారు. పథకం ప్రకారం ఓ అపరిచిత మహిళ ముందు వెళ్తూ ఆమె చేతిలోని ప్యాకెట్ జారవిడిచి ఆపై ఆమె ప్యాకెట్ తెరిచి బంగారు బిస్కెట్ దొరికిందని చెబుతుండగా మరో వ్యక్తి వచ్చి బంగారు బిస్కెట్ విలువ లక్షల్లో ఉంటుందని నమ్మిస్తాడు.
ఇదంతా నిజమేనని నమ్మిన ఓ మహిళ తన వద్ద ఉన్న రెండు తులాల బంగారు గొలుసు, రూ.10వేల నగదు అపరిచిత మహిళకు ఇవ్వడమే కాక మిగతా నగదు తెచ్చి ఇస్తానని చెప్పి మోసపోయింది. ఇందుకు సంబంధించి బాధితురాలు చేసిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు. ఫొటోలోని నిందుతులు ఎక్కడైనా కనిపిస్తే ఖమ్మం త్రీ టౌన్ ఇన్స్పెక్టర్ సెల్ నెంబర్ 8712659115, డయల్ 100కు సమాచారం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.


