epaper
Monday, November 17, 2025
epaper

కూతుర్ని చంపి, కొడుకుకి ఉరి వేసిన తండ్రి అరెస్ట్

కూతుర్ని చంపి, కొడుకుకి ఉరి వేసిన తండ్రి అరెస్ట్

కాకతీయ, కరీంనగర్ : ఇద్దరు పిల్లలు అంగవైకల్యాలతో బాధపడుతుండటంతో మానసిక వేదనకు గురైన ఓ తండ్రి ఘాతుకానికి పాల్పడ్డాడు. కూతుర్ని ఉరివేసి చంపి, కొడుకుపై కూడా అదే పద్ధతిలో హత్యాయత్నం చేసిన ఘటన కరీంనగర్ పట్టణంలో వెలుగుచూసింది. నిందితుడైన అనవేణి మల్లేష్ (38)ను త్రీటౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు.2009లో మల్లేష్,పోసవ్వలకు హర్షిత్, హర్షిత అనే ఇద్దరు పిల్లలు. ఇద్దరికీ చిన్నప్పటి నుంచే మానసిక, శారీరక అంగవైకల్యాలు. నిలోఫర్, ఉస్మానియా, నిమ్స్, బోయినపల్లి నేషనల్ హ్యాండీక్యాప్డ్ ఆసుపత్రి, కరీంనగర్‌లోని పలు ప్రైవేట్ ఆసుపత్రులు, తిరుపతి బర్డ్స్, స్విమ్స్—ఎక్కడ పరీక్షలు చేసినా ప్రయోజనం లేకపోవడంతో మల్లేష్ తీవ్ర మనోవేదనకు గురయ్యాడు. స్విమ్స్ వైద్యులు పిల్లల పరిస్థితి జీవితాంతం అలాగే ఉంటుందని చెప్పడంతో అతనిలో నిరాశ మరింతగా పెరిగిందని పోలీసులు వెల్లడించారు.15వ తేదీ మధ్యాహ్నం భార్య మార్కెట్‌కు వెళ్లిన అవకాశాన్ని నిందితుడు ఉపయోగించుకున్నాడు. ముందుగా చల్లని పానీయంలో పురుగుమందు కలిపి పిల్లలకు ఇవ్వడానికి ప్రయత్నించినా వారు తాగకపోవడంతో యత్నం విఫలమైంది. వెంటనే కాటన్ గుడ్డను రెండు భాగాలుగా చించి కూతురు హర్షిత, కొడుకు హర్షిత్ మెడలకు ఉరి వేసినట్టు విచారణలో ఒప్పుకున్నాడు. ఈ దారుణంలో కూతురు మృతి చెందగా, కొడుకు ప్రాణాలతో బయటపడ్డాడు.తరువాత టవల్ ముక్కలను బయట పడేసి, ఇంటి నుంచి పారిపోయిన మల్లేష్ కరీంనగర్ నుంచి హైదరాబాద్ జేబీఎస్ చేరి అక్కడ లాడ్జ్‌లో తలదాచుకున్నాడు. మరుసటి రోజు మంచిర్యాలలో తిరుగుతూ పోలీసులను తప్పించుకునే ప్రయత్నం చేశాడు. గాలింపు దళాలు మల్లేష్‌ను చివరకు 17వ తేదీ ఉదయం కరీంనగర్ ఆర్టీసీ బస్టాండ్ వద్ద గుర్తించి అదుపులోకి తీసుకున్నాయి.కేసు సంఖ్య 439/2025గా, భారత న్యాయ విధానం సెక్షన్లు 103(1), 109(1) కింద నమోదు చేసినట్లు త్రీటౌన్ ఇన్స్పెక్టర్ జాన్ రెడ్డి తెలిపారు. నిందితుడి మొబైల్ ఫోన్, కరీంనగర్–హైదరాబాద్, జేబీఎస్–మంచిర్యాల మార్గాల రెండు బస్‌టికెట్లు, హత్యకు ఉపయోగించిన కాటన్ గుడ్డముక్కలను పంచుల సమక్షంలో స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని రిమాండ్‌కు తరలించే ప్రక్రియ కొనసాగుతోంది.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

కొలువుతీరునున్న వర్తక సంఘం కార్యవర్గం ఇదే

కొలువుతీరునున్న వర్తక సంఘం కార్యవర్గం ఇదే కాకతీయ, ఖమ్మం ప్రతినిధి: ఖమ్మం నగరంలో...

సెక్యూరిటీ సిబ్బందికి క్రమశిక్షణ ముఖ్యం

సెక్యూరిటీ సిబ్బందికి క్రమశిక్షణ ముఖ్యం సెక్యూరిటీ జిఎం చందా లక్ష్మీనారాయణ కాకతీయ, కొత్తగూడెం: సెక్యూరిటీ...

పోక్సో కేసులో నిందితుడికి జీవిత ఖైదు

పోక్సో కేసులో నిందితుడికి జీవిత ఖైదు కాకతీయ, కొత్తగూడెం: పోక్సో కేసులో నిందితుడికి...

ఛాంబర్ లో మరోసారి మాటేటి ప్రభంజనం

ఛాంబర్ లో మరోసారి మాటేటి ప్రభంజనం కాకతీయ,ఖమ్మంప్రతినిధి : నిన్న జరిగిన చాంబర్...

ఏసీబీ వలలో ఇద్దరు ప్రభుత్వ ఉద్యోగులు, రేషన్ షాప్ డీలర్

ఏసీబీ వలలో ఇద్దరు ప్రభుత్వ ఉద్యోగులు, రేషన్ షాప్ డీలర్ కాకతీయ, ఇల్లందు:...

కల్వకుంట్ల కవితను కలిసిన నాయకులు

కల్వకుంట్ల కవితను కలిసిన నాయకులు కాకతీయ, ఖమ్మం : తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు...

సామాజిక ఐక్యతే అభివృద్ధికి మూలం

సామాజిక ఐక్యతే అభివృద్ధికి మూలం ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు ప్రభుత్వం ఎల్లప్పుడూ...

ఆకర్షణీయ ప్రకటనలతో సైబర్ మోసాలు

ఆకర్షణీయ ప్రకటనలతో సైబర్ మోసాలు పోలీస్ కమిషనర్ సునీల్ దత్ కాకతీయ, ఖమ్మం ప్రతినిధి:...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...

రేవంత్ కు కొత్త సవాల్!

* సర్కార్ కు పరీక్షగా సీఎస్ ఎంపిక? * ఈ నెలాఖరున రామకృష్ణారావు...

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం కాక‌తీయ‌, హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లాలోని బాటసింగారంలో...

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన ప్రతిపాదించిన ప్రాజెక్టుపై...

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా న్యూ డిల్లీ జూలై...

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు మొన్న యూనివర్సిటీల్లో ఆందోళనలు నిషేధిస్తూ మెమో నేడు...

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌ కాంగ్రెస్‌ దూత ఫోన్‌ ట్యాపింగ్‌..! గాంధీ...
spot_img

Popular Categories

spot_imgspot_img