epaper
Monday, March 2, 2026
epaper

ఎన్నికలను ప్ర‌శాంతంగా నిర్వ‌హించాలి

ఎన్నికలను ప్ర‌శాంతంగా నిర్వ‌హించాలి
జిల్లాలో కట్టుదిట్టమైన పోలీసు బందోబస్తు
8 ఫ్లయింగ్ స్క్వాడ్‌, 4 స్టాటిక్ సర్వేలయన్స్ బృందాలు ఏర్పాటు
నియమావళి ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవు
భ‌ద్రాద్రి కొత్త‌గూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్‌

కాకతీయ, కొత్తగూడెం : జిల్లాలో జరగనున్న మున్సిపల్ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు పోలీస్ శాఖ తరఫున పటిష్టమైన చర్యలు చేపడుతున్నట్లు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజు స్పష్టం చేశారు. గురువారం ఎస్పీ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్‌లో ఎన్నికల నిర్వహణపై పోలీస్ అధికారులతో ప్రత్యేక సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఇతర శాఖలతో సమన్వయం పాటిస్తూ భద్రతా ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. జిల్లా పరిధిలోని కొత్తగూడెం కార్పొరేషన్, ఇల్లందు, అశ్వారావుపేట మున్సిపాలిటీలలో ఈ నెల 11న పోలింగ్ జరగనుందని వెల్లడించారు. మొత్తం 101 పోలింగ్ స్థానాల్లో 288 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశామని చెప్పారు. ఇందులో 148 సాధారణ పోలింగ్ కేంద్రాలు, 125 సున్నితమైన కేంద్రాలు, 15 క్రిటికల్ పోలింగ్ కేంద్రాలుగా గుర్తించినట్లు తెలిపారు.
ఎన్నికల నిఘా చర్యల్లో భాగంగా 8 ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు, 4 స్టాటిక్ సర్వేలయన్స్ బృందాలను నియమించామని చెప్పారు. ఎన్నికల విధుల్లో ఉన్న అధికారులు నిష్పక్షపాతంగా వ్యవహరించాలని, ప్రజలు స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకునేలా బాధ్యతగా పనిచేయాలని సూచించారు.
అభ్యర్థులు ప్రచార కార్యక్రమాలు చేపట్టేందుకు తప్పనిసరిగా సంబంధిత అధికారుల నుంచి ముందస్తు అనుమతులు తీసుకోవాలని స్పష్టం చేశారు. అనుమతులు లేకుండా ప్రచారం నిర్వహిస్తే ఎన్నికల నియమావళి ప్రకారం కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.
ఓటర్లను ప్రలోభపరిచే విధంగా నగదు, మద్యం, ఇతర వస్తువుల అక్రమ రవాణా జరిగితే కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ప్రజలకు ఇబ్బందులు కలిగించే వ్యక్తులపై ప్రత్యేక నిఘా ఉంచాలని సూచించారు.
ఈ సమావేశంలో కొత్తగూడెం డీఎస్పీ ఆదినారాయణ, పాల్వంచ డీఎస్పీ సతీష్ కుమార్, ఇల్లందు డీఎస్పీ వెంకన్నబాబు, ఎస్‌బీ ఇన్‌స్పెక్టర్ శ్రీనివాస్, డీసీఆర్బీ ఇన్‌స్పెక్టర్ శ్రీనివాస్, వివిధ సీఐలు, ఎస్సైలు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

ఎస్సీ వర్గీకరణ పోరులో అమరవీరులకు జోహార్లు

ఎస్సీ వర్గీకరణ పోరులో అమరవీరులకు జోహార్లు సింగరేణిలో ఎమ్మార్పీఎస్ గద్దె వద్ద నివాళులు త్యాగాలు...

బొగ్గు–ఇసుక లారీల బీభత్సం..!

బొగ్గు–ఇసుక లారీల బీభత్సం..! మణుగూరు–బయ్యారం రహదారి ధ్వంసం దుమ్ము ధూళితో గిరిజన బిడ్డల అనారోగ్యం ప్రజల...

అదుపుతప్పిన ఇసుక ట్రాక్టర్ – డ్రైవర్ దుర్మరణం

అదుపుతప్పిన ఇసుక ట్రాక్టర్ – డ్రైవర్ దుర్మరణం నాగులవంచ వద్ద తెల్లవారుజామున ప్రమాదం ఓవర్‌టేక్...

వెలుగుమట్ల బాధితులపై ముమ్మర సర్వే

వెలుగుమట్ల బాధితులపై ముమ్మర సర్వే 21 మంది తహశీల్దార్లతో యుద్ధప్రాతిపదికన సర్వే ఖమ్మం జిల్లాకు...

వెలుగుమట్ల బాధితులకు బీఆర్ఎస్ అండ

వెలుగుమట్ల బాధితులకు బీఆర్ఎస్ అండ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర ఆధ్వర్యంలో భోజనాల పంపిణీ కాకతీయ,...

సీఎం రేవంత్ రెడ్డికి సన్మానసభ పోస్టర్ ఆవిష్కరణ

సీఎం రేవంత్ రెడ్డికి సన్మానసభ పోస్టర్ ఆవిష్కరణ కాకతీయ, ఖమ్మం : ఎస్సీ...

భూదాన్ వ్యవహారంలో విపక్షాలే అభాసు

భూదాన్ వ్యవహారంలో విపక్షాలే అభాసు పేదల పేరుతో రాద్ధాంతం చేశారు ఏజెంట్ల మోసాలపై బాధితులకు...

మోదీ పాలనలో దేశానికి ప్రమాదం

మోదీ పాలనలో దేశానికి ప్రమాదం కార్పొరేట్ల కోసమే కేంద్రం విధానాలు సీపీఐ (ఎం) పొలిట్...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img