గ్రామాభివృద్ధికి కృషి : సర్పంచ్ లక్ష్మీకుమారి
కాకతీయ, జూలూరుపాడు: మండల పరిధిలోని పడమటి నర్సాపురం పంచాయతీ అభివృద్ధిలో భాగంగా గ్రామంలో సీసీ రోడ్ల నిర్మాణ పనులను సర్పంచ్ లక్ష్మీ కుమారి ప్రారంభించారు. సర్పంచ్ మాట్లాడుతూ గ్రామ అభివృద్ధికి అందరూ సహకరించాలని, గ్రామ అభివృద్ధికి తనవంతు కృషి చేస్తానని తెలిపారు. ఉప సర్పంచ్ ఆళ్ల ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ.. గ్రామాన్ని అభివృద్ధి చేయడం లక్ష్యం అన్నారు. గత పది సంవత్సరాల నుండి పంచాయతీ కార్యాలయం చుట్టూ రహదారులు అభివృద్ధి నోచుకోలేదు, నూతన బాధ్యతలు చేపట్టిన పాలకవర్గం మరుగున పడిన రహదారి పనులను అభివృద్ధి చేయడంతో ప్రజల్లో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కార్యక్రమంలో కార్యదర్శి బి.హారిక, రామాలయ కమిటీ చైర్మన్ లేళ్ల అప్పిరెడ్డి, వార్డు మెంబర్లు, గ్రామ పెద్దలు యువకులు తదితరులు పాల్గొన్నారు.


