epaper
Sunday, March 1, 2026
epaper

నాణ్యతలో రాజీ వద్దు

నాణ్యతలో రాజీ వద్దు
సింథటిక్ ట్రాక్ పనులు గడువులోపే పూర్తి చేయాలి
యువతకు ఆధునిక క్రీడా సౌకర్యాలు
సర్దార్ పటేల్ స్టేడియం క్రీడా హబ్‌గా అభివృద్ధి
కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి

కాకతీయ, ఖమ్మం : ఖమ్మం సర్దార్ పటేల్ స్టేడియంలో నిర్మాణంలో ఉన్న సింథటిక్ రన్నింగ్ ట్రాక్ పనులను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అధికారులను ఆదేశించారు. పనుల్లో ఎక్కడా నాణ్యత లోపాలు ఉండరాదని, అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా నిర్మాణాలు జరగాలని స్పష్టం చేశారు. శుక్రవారం కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి మున్సిపల్ కమిషనర్ అభిషేక్ అగస్త్య, నగర మేయర్ పునుకొల్లు నీరజతో కలిసి స్టేడియంలో జరుగుతున్న అభివృద్ధి పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. రూ.8 కోట్ల 50 లక్షల అంచనా వ్యయంతో నిర్మిస్తున్న సింథటిక్ రన్నింగ్ ట్రాక్ పనుల పురోగతిని సమీక్షించారు. అలాగే రూ.50 లక్షల వ్యయంతో నిర్మించిన నూతన టేబుల్ టెన్నిస్ హాల్‌ను సందర్శించి అక్కడి వసతులను పరిశీలించారు.

నాణ్యతతో పనులు జరగాలి

పరిశీలన సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ట్రాక్ లెవెలింగ్, ఫెన్సింగ్, బాండింగ్, లైన్ మార్కింగ్ పనులు ఐఎస్ఓ ప్రమాణాల ప్రకారం జరగాలని ఆదేశించారు. వర్షపు నీరు నిల్వ ఉండకుండా ప్రత్యేక డ్రైనేజీ వ్యవస్థ ఏర్పాటు చేయాలని, కార్బోచాంబర్లు నిర్మించాలని సూచించారు. స్టేడియంలో సరిపడా వెలుతురు ఉండేలా హైమాస్ట్ లైట్లు అమర్చాలని, పరిసరాల్లో పచ్చదనం పెంచేందుకు విస్తృతంగా మొక్కలు నాటాలని తెలిపారు. నిర్మాణ పనులు వేగంగా సాగాలని, నిర్ణీత సమయానికి పూర్తయ్యేలా రోజువారీ పర్యవేక్షణ ఉండాలని అధికారులను హెచ్చరించారు. క్రీడాకారులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సదుపాయాలన్నీ పకడ్బందీగా ఏర్పాటు చేయాలని సూచించారు.

యువతకు గొప్ప అవకాశం

ఈ సందర్భంగా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి మాట్లాడుతూ యువతను క్రీడల వైపు ప్రోత్సహించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెలిపారు. ఖమ్మం జిల్లాను క్రీడా రంగంలో ముందంజలో నిలపాలనే ఉద్దేశంతో సర్దార్ పటేల్ స్టేడియాన్ని ఆధునిక క్రీడా హబ్‌గా అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు. సింథటిక్ రన్నింగ్ ట్రాక్ అందుబాటులోకి వస్తే జిల్లా క్రీడాకారులు రాష్ట్ర, జాతీయ స్థాయిలో మరింత ప్రతిభ కనబర్చే అవకాశాలు పెరుగుతాయని పేర్కొన్నారు. స్టేడియంలో ఉన్న టేబుల్ టెన్నిస్ హాల్, రన్నింగ్ ట్రాక్ తదితర సదుపాయాలను యువత, విద్యార్థులు పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు.

నిర్వహణకూ ప్రత్యేక ప్రణాళిక

నిర్మాణం పూర్తయిన తర్వాత నిర్వహణ కూడా అత్యంత కీలకమని కలెక్టర్ పేర్కొన్నారు. సింథటిక్ ట్రాక్‌ను దీర్ఘకాలం ఉపయోగించుకునేలా ప్రత్యేక నిర్వహణ ప్రణాళిక రూపొందించాలని అధికారులకు సూచించారు. క్రీడల ద్వారా యువతలో క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం, నాయకత్వ లక్షణాలు పెరుగుతాయని అన్నారు. ప్రతిరోజూ కొంత సమయం క్రీడలకు కేటాయించుకోవాలని విద్యార్థులు, యువతకు సూచించారు. గ్రామీణ ప్రాంతాల నుంచి కూడా ప్రతిభావంతులైన క్రీడాకారులు వెలుగులోకి రావాలని, అందుకు అవసరమైన అన్ని సదుపాయాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఖమ్మం నగరంలో క్రీడల అభివృద్ధికి అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని, స్టేడియం అభివృద్ధికి కావాల్సిన ప్రతిపాదనలు తన దృష్టికి తీసుకురావాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా యువజన, క్రీడల శాఖ అధికారి టి.సునీల్ రెడ్డి, మున్సిపల్ ఎస్ఈ రంజిత్, ఈఈ కృష్ణలాల్, డీఈ నవీన్, ఉద్యానవన అధికారిణి రాధిక, క్రీడాకారులు, కోచ్‌లు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

ఎస్సీ వర్గీకరణ పోరులో అమరవీరులకు జోహార్లు

ఎస్సీ వర్గీకరణ పోరులో అమరవీరులకు జోహార్లు సింగరేణిలో ఎమ్మార్పీఎస్ గద్దె వద్ద నివాళులు త్యాగాలు...

బొగ్గు–ఇసుక లారీల బీభత్సం..!

బొగ్గు–ఇసుక లారీల బీభత్సం..! మణుగూరు–బయ్యారం రహదారి ధ్వంసం దుమ్ము ధూళితో గిరిజన బిడ్డల అనారోగ్యం ప్రజల...

అదుపుతప్పిన ఇసుక ట్రాక్టర్ – డ్రైవర్ దుర్మరణం

అదుపుతప్పిన ఇసుక ట్రాక్టర్ – డ్రైవర్ దుర్మరణం నాగులవంచ వద్ద తెల్లవారుజామున ప్రమాదం ఓవర్‌టేక్...

వెలుగుమట్ల బాధితులపై ముమ్మర సర్వే

వెలుగుమట్ల బాధితులపై ముమ్మర సర్వే 21 మంది తహశీల్దార్లతో యుద్ధప్రాతిపదికన సర్వే ఖమ్మం జిల్లాకు...

వెలుగుమట్ల బాధితులకు బీఆర్ఎస్ అండ

వెలుగుమట్ల బాధితులకు బీఆర్ఎస్ అండ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర ఆధ్వర్యంలో భోజనాల పంపిణీ కాకతీయ,...

సీఎం రేవంత్ రెడ్డికి సన్మానసభ పోస్టర్ ఆవిష్కరణ

సీఎం రేవంత్ రెడ్డికి సన్మానసభ పోస్టర్ ఆవిష్కరణ కాకతీయ, ఖమ్మం : ఎస్సీ...

భూదాన్ వ్యవహారంలో విపక్షాలే అభాసు

భూదాన్ వ్యవహారంలో విపక్షాలే అభాసు పేదల పేరుతో రాద్ధాంతం చేశారు ఏజెంట్ల మోసాలపై బాధితులకు...

మోదీ పాలనలో దేశానికి ప్రమాదం

మోదీ పాలనలో దేశానికి ప్రమాదం కార్పొరేట్ల కోసమే కేంద్రం విధానాలు సీపీఐ (ఎం) పొలిట్...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img