epaper
Thursday, November 20, 2025
epaper

ఎర్త్ సైన్స్ యూనివర్సిటీలో ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా కలెక్టర్

ఎర్త్ సైన్స్ యూనివర్సిటీలో ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా కలెక్టర్
జితేష్ వి. పాటిల్

కొత్తగూడెం, కాకతీయ రూరల్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డాక్టర్ మన్మోహన్ సింగ్ ఎర్త్ సైన్స్ యూనివర్సిటీ ప్రారంభోత్సవ కార్యక్రమానికి రానున్న నేపథ్యంలో, ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ గురువారం ప్రత్యక్షంగా పరిశీలించారు. యూనివర్సిటీ క్యాంపస్ మొత్తం పర్యటించిన కలెక్టర్ అకాడమిక్ బ్లాక్ రిపేర్ వర్క్స్, ఆడిటోరియం మరమ్మత్తులు, బాలుర కామన్ మెస్ బాలికల హాస్టల్ పనుల పురోగతిని పరిశీలించి సంబంధిత శాఖలతో వివరంగా చర్చించారు. ఆడిటోరియంలో మౌలిక వసతులు, సీటింగ్ ఏర్పాట్లు, స్టేజ్ సెటప్, లైటింగ్, ఎలక్ట్రికల్ పనులు వంటి అంశాలన్నీ నాణ్యతతో పూర్తవ్వాలని ఆయన సూచించారు.
యూనివర్సిటీ పాత కొత్త భవనాల సుందరీ కరణ, పార్కింగ్ ప్రాంతాల అభివృద్ధి, క్యాంపస్ అంతటా పరిశుభ్రత, లైటింగ్ పనులను కలెక్టర్ పరిశీలించి పలు సూచనలు–సలహాలు ఇచ్చారు. ముఖ్యమంత్రి ప్రారంభించే శిలాఫలకం ఏర్పాట్లను కూడా పరిశీలించి, దాని వద్ద ఏర్పాట్లు ఆకర్షణీయంగా, సముచిత ప్రమాణాలతో ఉండాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు. విద్యార్థుల వసతి గృహాల్లో ఫర్నిచర్ అమరిక, నీటి సదుపాయాలు, శౌచాలయాల మరమ్మత్తులు, వసతి ప్రాంతాల పరిశుభ్రత వంటి అంశాలను కూడా ఆయన సమీక్షించారు. క్యాంపస్ ఆవరణ మొత్తం పచ్చదనం ఉట్టిపడేలా మొక్కలు నాటడంతో పాటు పరిసరాలు పరిశుభ్రంగా ఉండేలా చూడాలని కళాశాల ప్రిన్సిపల్ డా. జగన్మోహన్ రాజును కలెక్టర్ ప్రత్యేకంగా ఆదేశించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, యూనివర్సిటీ ప్రారంభోత్సవం జిల్లాకు అత్యంత ప్రతిష్ఠాత్మకమైన కార్యక్రమమని, అన్ని ఏర్పాట్లు అత్యున్నత నాణ్యతతో పూర్తవ్వాలని సూచించారు. విద్యా రంగంలో జిల్లాకు ఇది ఒక ప్రధాన మైలురాయి అవుతుందని, ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం అన్ని శాఖల సమిష్టి బాధ్యత అని స్పష్టం చేశారు. అధికారులు అత్యంత వేగం శ్రద్ధతో పనులు పూర్తి చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.
ఈ పరిశీలనలో కలెక్టర్ వెంట కొత్తగూడెం మున్సిపల్ కమిషనర్ సుజాత, పంచాయతీరాజ్ ఈ ఈ శ్రీనివాస్, ఎర్త్ సైన్స్ యూనివర్సిటీ అధ్యాపకులు, సిబ్బంది సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

ఖమ్మం నరగంలో దారుణ హత్య

ఖమ్మం నరగంలో దారుణ హత్య భార్య ను గొంతు కోసి హత్య చేసిన...

పాఠశాలలను పరిశుభ్రంగా ఉంచాలి.

పాఠశాలలను పరిశుభ్రంగా ఉంచాలి. నాణ్యమైన విద్యను అందించడం ఉపాధ్యాయుల లక్ష్యం జూలూరుపాడులో రాష్ట్ర విద్యాశాఖ...

పాల్వంచ‌లో స‌మ‌స్య‌ల తిష్ట‌

పాల్వంచ‌లో స‌మ‌స్య‌ల తిష్ట‌ డ్రైనేజీలు, రోడ్లకు మ‌ర‌మ్మ‌తులు చేప‌ట్టాలి ఎంపీడీవోకు బీఆర్ ఎస్ నేత‌ల...

అటవీ భూమిని కాపాడాలి

అటవీ భూమిని కాపాడాలి ఫారెస్ట్ అధికారుల‌కు డీఎఫ్‌వో కిష్ట‌గౌడ్ సూచ‌న‌ కాకతీయ, జూలూరుపాడు :...

కవులు సమాజ సంపదతో సమానం

కవులు సమాజ సంపదతో సమానం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివ రావు జిల్లా గ్రంథాలయాభివృద్ధికి కృషి కాకతీయ,కొత్తగూడెం...

క‌గార్ పేరుతో కేంద్రం హ‌త్యాకాండ‌

క‌గార్ పేరుతో కేంద్రం హ‌త్యాకాండ‌ దుర్మార్గపు విధానాలను ప్రశ్నించే వారిపై న‌ర‌మేధం బూట‌క‌పు ఎన్‌కౌంట‌ర్ల‌పై...

విద్యార్థులు పుస్తక పఠన నైపుణ్యం పెంపొందించుకోవాలి

విద్యార్థులు పుస్తక పఠన నైపుణ్యం పెంపొందించుకోవాలి జిల్లా విద్యాశాఖ అధికారి చైతన్య జైని గ్రంథాలయ...

భారత దేశ తొలి మహిళా ప్రధాని ఇందిరా గాంధీ

భారత దేశ తొలి మహిళా ప్రధాని ఇందిరా గాంధీ ఖ‌మ్మం డీసీసీ అధ్య‌క్షుడు...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...

రేవంత్ కు కొత్త సవాల్!

* సర్కార్ కు పరీక్షగా సీఎస్ ఎంపిక? * ఈ నెలాఖరున రామకృష్ణారావు...

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం కాక‌తీయ‌, హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లాలోని బాటసింగారంలో...

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన ప్రతిపాదించిన ప్రాజెక్టుపై...

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా న్యూ డిల్లీ జూలై...

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు మొన్న యూనివర్సిటీల్లో ఆందోళనలు నిషేధిస్తూ మెమో నేడు...

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌ కాంగ్రెస్‌ దూత ఫోన్‌ ట్యాపింగ్‌..! గాంధీ...
spot_img

Popular Categories

spot_imgspot_img