epaper
Sunday, March 1, 2026
epaper

భూదాన్ భూముల్లో గుడిసెల కూల్చివేత…

భూదాన్ భూముల్లో గుడిసెల కూల్చివేత…
వెలుగుమట్లలో 60 ఎకరాల భూమిపై ఉద్రిక్తత
600 పేద కుటుంబాల గుడిసెల కూల్చివేతపై ఆగ్రహం
కాంగ్రెస్ నిరంకుశ వైఖరికి నిదర్శనం : పువ్వాడ
వేలాది పోలీసులతో జేసీబీల దాడి అమానుషం
న్యాయపరంగా, ప్రజాస్వామ్య పద్ధతుల్లో ఉద్యమం ఉధృతం చేస్తామని హెచ్చరిక.

కాకతీయ, ఖమ్మం బ్యూరో : ఖమ్మం నగరంలోని వెలుగుమట్ల పరిధిలో ఉన్న భూదాన్ భూముల్లో పేదల గుడిసెల కూల్చివేతపై మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పదేళ్లుగా అక్కడే నివసిస్తూ తమకు పట్టాలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్న సుమారు 600 పేద కుటుంబాలపై వేలాది మంది పోలీసులతో దాడి చేసి, జేసీబీల సహాయంతో గుడిసెలను కూల్చివేయడం అమానుషం, ప్రజాస్వామ్యాన్ని అవమానపరిచే చర్య అని ఆయన విమర్శించారు.

వెలుగుమట్ల పరిధిలోని సుమారు 60 ఎకరాల భూదాన్ భూముల్లో పేదలు తాత్కాలిక నివాసాలు ఏర్పాటు చేసుకుని జీవనం సాగిస్తున్నారని, న్యాయపరంగా కూడా తమ హక్కుల కోసం పోరాడుతున్న సమయంలో ఈ విధంగా బలప్రయోగం చేయడం కాంగ్రెస్ ప్రభుత్వ అసలు స్వరూపాన్ని బయటపెట్టిందని ఆయన మండిపడ్డారు. హైకోర్టు స్టే పేరుతో కొంతమంది ప్రైవేట్ వ్యక్తులకు లబ్ధి చేకూర్చేందుకు స్వయంగా మంత్రి తుమ్మల ఆదేశాలతో పోలీసులు రంగంలోకి దిగారని ఆరోపించారు.

భూదాన్ భూములపై ఎప్పటినుంచో కొందరు ప్రభావశీలుల కన్ను ఉందని, రియల్ ఎస్టేట్ ప్రయోజనాల కోసం ఈ చర్యలు తీసుకున్నారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయని పువ్వాడ పేర్కొన్నారు. తెల్లవారుజామునే భారీ పోలీస్ బలగాలతో పేదల ఇళ్లను ఖాళీ చేయించడం నిరంకుశ పాలనకు నిదర్శనం అని ఆయన అభివర్ణించారు. ఇళ్లను కూల్చివేసి కుటుంబాలను రోడ్డుపైకి నెట్టివేయడం మానవత్వాన్ని మరిచిన చర్యగా పేర్కొన్నారు.

బీఆర్ఎస్ పార్టీ ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తోందని, మాజీ శాసనసభ్యుడిగా, మాజీ మంత్రిగా ప్రజల తరఫున తాను అండగా నిలుస్తానని స్పష్టం చేశారు. కూల్చివేతలను వెంటనే నిలిపివేసి, అర్హులైన పేద కుటుంబాలకు పట్టాలు మంజూరు చేసి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
అధికారాన్ని అడ్డుపెట్టుకుని పోలీస్ వ్యవస్థను వినియోగించడం సరికాదని, ప్రజాస్వామ్య పద్ధతుల్లో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ప్రజల ఆవేదనను ప్రభుత్వం గుర్తించకపోతే తగిన సమయంలో ప్రజలే తీర్పు చెబుతారని పువ్వాడ అజయ్ కుమార్ పేర్కొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

ఎస్సీ వర్గీకరణ పోరులో అమరవీరులకు జోహార్లు

ఎస్సీ వర్గీకరణ పోరులో అమరవీరులకు జోహార్లు సింగరేణిలో ఎమ్మార్పీఎస్ గద్దె వద్ద నివాళులు త్యాగాలు...

బొగ్గు–ఇసుక లారీల బీభత్సం..!

బొగ్గు–ఇసుక లారీల బీభత్సం..! మణుగూరు–బయ్యారం రహదారి ధ్వంసం దుమ్ము ధూళితో గిరిజన బిడ్డల అనారోగ్యం ప్రజల...

అదుపుతప్పిన ఇసుక ట్రాక్టర్ – డ్రైవర్ దుర్మరణం

అదుపుతప్పిన ఇసుక ట్రాక్టర్ – డ్రైవర్ దుర్మరణం నాగులవంచ వద్ద తెల్లవారుజామున ప్రమాదం ఓవర్‌టేక్...

వెలుగుమట్ల బాధితులపై ముమ్మర సర్వే

వెలుగుమట్ల బాధితులపై ముమ్మర సర్వే 21 మంది తహశీల్దార్లతో యుద్ధప్రాతిపదికన సర్వే ఖమ్మం జిల్లాకు...

వెలుగుమట్ల బాధితులకు బీఆర్ఎస్ అండ

వెలుగుమట్ల బాధితులకు బీఆర్ఎస్ అండ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర ఆధ్వర్యంలో భోజనాల పంపిణీ కాకతీయ,...

సీఎం రేవంత్ రెడ్డికి సన్మానసభ పోస్టర్ ఆవిష్కరణ

సీఎం రేవంత్ రెడ్డికి సన్మానసభ పోస్టర్ ఆవిష్కరణ కాకతీయ, ఖమ్మం : ఎస్సీ...

భూదాన్ వ్యవహారంలో విపక్షాలే అభాసు

భూదాన్ వ్యవహారంలో విపక్షాలే అభాసు పేదల పేరుతో రాద్ధాంతం చేశారు ఏజెంట్ల మోసాలపై బాధితులకు...

మోదీ పాలనలో దేశానికి ప్రమాదం

మోదీ పాలనలో దేశానికి ప్రమాదం కార్పొరేట్ల కోసమే కేంద్రం విధానాలు సీపీఐ (ఎం) పొలిట్...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img