epaper
Saturday, November 15, 2025
epaper

సాంస్కృతిక వారసత్వాన్ని కాపాడుకోవాలి

ఉత్సవాలతో పర్యాటక శోభ

విజయవాడ ఉత్సవ్ కార్యక్రమాల్లో సీఎం చంద్రబాబు

గిన్నిస్ బుక్ రికార్డు సాధించిన డప్పు కళాకారులు

కాకతీయ,అమరావతి: సాంస్కృతిక వారసత్వాన్ని కాపాడుకుని భావితరాలకు అందివ్వాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చెప్పారు. విజయవాడలో గత 11 రోజుల నుంచి విజయవాడ ఉత్సవ్ పేరుతో జరుగుతున్న వివిధ కార్యక్రమాల్లో సీఎం పాల్గొన్నారు. దసరా వేడుకల్లో భాగంగా చేపట్టిన సాంస్కృతిక సంబరాల్లో భాగంగా ఇందిరా గాంధీ స్టేడియం నుంచి బెంజ్ సర్కిల్ వరకూ సాంస్కృతిక కవాతు నిర్వహించారు. ఈ కవాతును ముఖ్యమంత్రి జెండా ఊపి ప్రారంభించారు. సుమారు 3 వేల మందితో వివిధ కళా రూపాలు, నృత్యాలతో భారీ ఎత్తున కవాతు జరిగింది. డప్పు కళాకారుల ప్రదర్శనకు గిన్నిస్ బుక్ రికార్డు దక్కింది. అనంతరం గొల్లపూడి ఎక్స్ పో గ్రౌండ్సులో ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ను ముఖ్యమంత్రి సందర్శించారు. అక్కడ ఏర్పాటు చేసిన స్టాళ్లను పరిశీలించారు. ఎక్స్ పోలో ఏర్పాటు చేసిన ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్సుతో కూడిన రోబో కిచెన్ విశేషాలు తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ…”సంక్షేమం, అభివృద్ధి అవసరం… అదే సమయంలో మానసిక ఆనందం కూడా అవసరమే. మన సంస్కృతీ సంప్రదాయాలు కాపాడుకోవాలి. మానసికంగా ప్రజలకు ఉల్లాసం ఉండాలి. నృత్య రీతులు, సంగీతం, సాహిత్యం, కళలు అన్నీ మన సంస్కృతిలో భాగం. కనుమరుగవుతున్న ఇలాంటి కళల్ని కాపాడుకోవాలి. వారసత్వంగా వచ్చిన ఈ కళలను భావితరాలకు అందివ్వాలి. విజయవాడ ఉత్సవ్ లో భాగంగా 280కి పైగా ఈవెంట్లను నిర్వహించారు. 2.50 లక్షల మంది వీటిని వీక్షించారు. హెలీ రైడింగ్ సహా వేర్వేరు సాహస క్రీడల్ని కూడా నిర్వహించి విజయవాడ ఉత్సవ్ ను ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు.” అని సీఎం అన్నారు.

ఆలయాలే మన సంపద

“దుర్గమ్మ ఆశీస్సులు… కృష్ణమ్మ కరుణ విజయవాడకు ఉంది. మూడేళ్లలో ఇక్కడి నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్లిన వాళ్లు మళ్లీ ఇక్కడే స్థిరపడడానికి వెనక్కి వస్తారు. విజయవాడ ఉత్సవ్ తో నగరంలో నూతన ఉత్సాహం కన్పిస్తోంది. ఎంజీ రోడ్డులో సాంస్కృతిక కవాతు నిర్వహించారు. డప్పు కళాకారులు పెద్ద ఎత్తున పాల్గొని గిన్నీస్ వరల్డ్ రికార్డును సాధించారు. గరగలు, కొమ్ముకోయ, తప్పెటగుళ్లు, కర్రసాము, బుట్టబొమ్మలు, భేతాళసెట్టు, నాసిక్ డోల్ లాంటి కళారూపాలు భిన్నత్వంలో ఏకత్వాన్ని ప్రదర్శించాయి. ఇవన్నీ ఆధ్యాత్మికతను పెంచేవే. పర్యాటకాన్ని అభివృద్ధి చేసేవే. టెంపుల్ టూరిజం కూడా ఏపీ ఆర్థికాభివృద్ధికి ముఖ్యం. ఏపీలో ఉన్న పుణ్యక్షేత్రాలు మన సంపద, మన వారసత్వం.” అని చంద్రబాబు అన్నారు.

ప్రజా సహకారంతో మరింత అభివృద్ధి

“ఏడాదిన్నర కిందటి వరకూ రాష్ట్ర ప్రజల ముఖాల్లో ఆనందమే లేదు. ఎక్కడ చూసినా భయం, దాడులు, ఆవేదనే నాడు రాజ్యమేలాయి. కూటమి అధికారంలోకి వచ్చాకే ప్రజల ముఖాల్లోకి స్వేచ్ఛ, సంతోషం వచ్చింది. పవన్ కల్యాణ్, బీజేపీతో కలిసి సుపరిపాలన అందిస్తామని ఇచ్చిన హామీని విశ్వసించి రికార్డు స్థాయిలో గెలిపించారు. ఈ సహకారాన్ని భవిష్యత్తులోనూ అందించాలి. ఉచిత బస్సు ప్రయాణంతో మహిళలు సంతోషంగా ఉన్నారు. సూపర్ సిక్స్ హామీలను సూపర్ హిట్ చేసిన ఘనత ప్రజలదే. రూ.2.50 లక్షల చొప్పున ప్రజలందరికీ యూనివర్సల్ హెల్త్ ఇన్సూరెన్సు తీసుకువచ్చిన రాష్ట్రం ఏపీనే. తల్లికి వందనంతో చదువుకునే పిల్లలందరికీ అండగా నిలిచాం. ప్రజలు ఆనందంగా ఉండేలా సమాజ నిర్మాణం చేస్తామని హామీ ఇస్తున్నాను.” అని ముఖ్యమంత్రి చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎంపీ కేశినేని శివనాథ్, స్థానిక ప్రజా ప్రతినిధులు, నేతలు, అధికారులు, సొసైటీ ఫర్ వైబ్రంట్ విజయవాడ ప్రతినిధులు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

కళ్యాణదుర్గంలో లోకేష్ ప్రజాదర్బార్

కళ్యాణదుర్గంలో లోకేష్ ప్రజాదర్బార్ ప్రజల‌ నుంచి వినతులు స్వీకరించిన మంత్రి అన్ని విధాల అండగా...

గుంత‌లు లేని దారులే మా ప్ర‌భుత్వ ల‌క్ష్యం

ప్రజల చేతిలో పల్లె రహదారుల సమాచారం త్వరలో అందుబాటులోకి ‘జియో...

శ్రీ చరణికి రూ.2.5 కోట్ల నజరానా

ఇంటి నిర్మాణానికి 1000 చ.గ. స్థలం గ్రూప్ 1 ఉద్యోగం...

జ‌గ‌న్ ప్ర‌భుత్వంలోనే ఎస్సీ, ఎస్టీల‌కు న్యాయం

కోట మండ‌ల వైసీపీ అధ్య‌క్షులు రాయంకుల‌ కాక‌తీయ. ఏలూరు ప్ర‌తినిధి :...

గిరిజన ‘గూడెం’లో తొలిసారి విద్యుత్ కాంతులు

ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చొరవతో గూడెంకు వెలుగులు కేంద్ర...

కృష్ణా నదిపై హై లెవెల్ వంతెన

దీవుల్లోని గ్రామాలకు అనుసంధానం రాష్ట్ర నిధులతోపాటు, సాస్కీ పథకం నిధులు...

దైవ‌ద‌ర్శ‌నంలో మృత్యుఘోష‌

దైవ‌ద‌ర్శ‌నంలో మృత్యుఘోష‌ శ్రీకాకుళం జిల్లా కాశిబుగ్గ ఆలయంలో తొక్కిసలాట 9 మంది భ‌క్తులు మృతి మృతుల్లో...

ఆలయంలో తొక్కిసలాట

9 మంది భ‌క్తులు మృతి మృతుల్లో బాలుడు.. ఎనిమిది మంది...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...

రేవంత్ కు కొత్త సవాల్!

* సర్కార్ కు పరీక్షగా సీఎస్ ఎంపిక? * ఈ నెలాఖరున రామకృష్ణారావు...

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం కాక‌తీయ‌, హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లాలోని బాటసింగారంలో...

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన ప్రతిపాదించిన ప్రాజెక్టుపై...

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా న్యూ డిల్లీ జూలై...

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు మొన్న యూనివర్సిటీల్లో ఆందోళనలు నిషేధిస్తూ మెమో నేడు...

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌ కాంగ్రెస్‌ దూత ఫోన్‌ ట్యాపింగ్‌..! గాంధీ...
spot_img

Popular Categories

spot_imgspot_img