epaper
Monday, March 2, 2026
epaper

కాంగ్రెస్‌ను పాతరేయాలి

కాంగ్రెస్‌ను పాతరేయాలి
అబ‌ద్ద‌పు హామీల‌తో ప్ర‌జ‌ల‌ను త‌ప్పుదోవ‌
చేర్యాలలో ఒక్క పని చేయని కాంగ్రెస్
ప్రజలు ఆలోచించి ఓటు వేయాలి
అభివృద్ధి, సేవే బీఆర్‌ఎస్ లక్ష్యం
జ‌న‌గామ ఎమ్మెల్యే ప‌ల్లా రాజేశ్వ‌ర్‌రెడ్డి
ఉచిత వైద్య సేవలు కొనసాగిస్తానని హామీ

కాకతీయ, చేర్యాల : ఎన్నికల ముందు ప్రజలకు అమలు కాని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ, ఇప్పుడు వాటిని నెరవేర్చకుండా మరోసారి ప్రజలను మోసం చేయడానికి ఓట్ల కోసం వస్తోందని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. అబద్ధపు హామీలతో ప్రజలను మభ్యపెడుతున్న కాంగ్రెస్‌ను ఈ ఎన్నికల్లో పాతరేయాలని ఆయన పిలుపునిచ్చారు. శుక్రవారం చేర్యాల మున్సిపాలిటీ పరిధిలోని 4, 5, 6, 7, 8, 9 వార్డుల్లో బీఆర్‌ఎస్ అభ్యర్థుల తరఫున నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి పాల్గొన్నారు. వార్డు అభ్యర్థుల కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని ఓటర్లను కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, చేర్యాల పట్టణంలో ఇప్పటివరకు కనిపిస్తున్న అభివృద్ధి అంతా గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలోనే జరిగిందని, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఒక్క కొత్త పని కూడా చేపట్టలేదని విమర్శించారు. ప్రజలు అధైర్యపడాల్సిన అవసరం లేదని, రాబోయే రోజుల్లో మళ్లీ అధికారంలోకి వచ్చేది బీఆర్‌ఎస్ ప్రభుత్వమేనని ధీమా వ్యక్తం చేశారు.

అబద్ధపు ప్రచారాలతో ప్రజలను తప్పుదోవ ..!

ప్రత్యర్థి పార్టీలు అబద్ధపు ప్రచారాలతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాయని, అమలు కాని హామీలతో మోసం చేస్తున్నాయని ఆరోపించారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు తన సొంత నీలిమ ఆసుపత్రిలో గత రెండు సంవత్సరాలుగా ఉచిత వైద్య సేవలు అందిస్తున్నానని, ఈ సేవలు రాబోయే మూడు సంవత్సరాలు కూడా కొనసాగిస్తానని తెలిపారు. పేద ప్రజలు స్వంత ఖర్చులతో వైద్యం చేయించుకున్న సందర్భాల్లో సీఎంఆర్‌ఎఫ్ ద్వారా చెక్కులు అందజేస్తున్నామని, నిమ్స్ ఆసుపత్రిలో అత్యవసర చికిత్సల కోసం ఎల్ఓసీలు మంజూరు చేస్తున్నామని వివరించారు. ఇచ్చిన హామీలను ఆచరణలో చూపిస్తున్నానని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను, ప్రస్తుత కాంగ్రెస్ పాలనలో జరుగుతున్న పనులను ప్రజలు బేరీజు వేసుకోవాలని ఆయన కోరారు. కల్యాణలక్ష్మి, తులం బంగారం పొందినవారు కాంగ్రెస్‌కు ఓటు వేయాలని, అవి పొందని వారు బీఆర్‌ఎస్‌కు ఓటు వేయాలని వ్యాఖ్యానించారు. మహిళా భృతి రూ.2500 అందిన మహిళలు కాంగ్రెస్‌కు ఓటేయాలని, భృతి అందని వారు బీఆర్‌ఎస్ పార్టీకి మద్దతు ఇవ్వాలని పిలుపునిచ్చారు. విద్యార్థినులకు స్కూటీలు ఇస్తామని కాంగ్రెస్ ఇచ్చిన హామీ ఇప్పటివరకు అమలు కాలేదని గుర్తు చేస్తూ, ఆ హామీ నెరవేరని మహిళలంతా కారు గుర్తుకు ఓటేయాలని కోరారు. పట్టణ అభివృద్ధికి బీఆర్‌ఎస్ పార్టీ చేసిన సేవలను ప్రజలు గుర్తించి, ఈ మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

విద్యుత మీటరు రీడర్ల సమస్యను పరిష్కరించండి

విద్యుత మీటరు రీడర్ల సమస్యను పరిష్కరించండి * మార్చు 1 నుంచి మీటర్...

ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో నూతనంగా ఎన్నికైన ప్రజాప్రతినిధులకు సన్మానం

ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో నూతనంగా ఎన్నికైన ప్రజాప్రతినిధులకు సన్మానం కాకతీయ, చేర్యాల: చేర్యాల మున్సిపాలిటీతో...

రాంపూర్ లో ఘనంగా మల్లన్న పట్నాలు

రాంపూర్ లో ఘనంగా మల్లన్న పట్నాలు కాకతీయ,చేర్యాల: మండలంలోని రాంపూర్ గ్రామానికి చెందిన...

తెలంగాణ అగ్రి ఎంప్లాయిస్ యూనియన్‌ అధ్యక్షుడిగా పురం ఆంజనేయులు

తెలంగాణ అగ్రి ఎంప్లాయిస్ యూనియన్‌ అధ్యక్షుడిగా *పురం ఆంజనేయులు ఏకగ్రీవం సభ్యుల సమస్యలను పరిష్కరించేందుకు...

గజ్వేల్ శ్రీ సరస్వతి శిశు మందిర్ పాఠశాలలో ఘనంగా సైన్స్ ఎక్స్‌పో

గజ్వేల్ శ్రీ సరస్వతి శిశు మందిర్ పాఠశాలలో ఘనంగా సైన్స్ ఎక్స్‌పో -...

విద్యార్థులు సైన్స్‌ పట్ల ఆసక్తిని పెంచుకోవాలని

విద్యార్థులు సైన్స్‌ పట్ల ఆసక్తిని పెంచుకోవాలని * ప్రధానోపాధ్యాయులు సుదర్శన్ రెడ్డి * సైన్స్...

ఆర్అండ్‌ఆర్ కాలనీలో ఉచిత బీపీ, షుగర్ పరీక్షలు

ఆర్అండ్‌ఆర్ కాలనీలో ఉచిత బీపీ, షుగర్ పరీక్షలు - బాలాజీ న్యూరో సూపర్...

ప్రజలు అప్పగించిన బాధ్యతను సాకారం చేయాలి

ప్రజలు అప్పగించిన బాధ్యతను సాకారం చేయాలి *భువనగిరి పార్లమెంటు సభ్యులు చామల కిరణ్...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img