ఏదులాపురంలో కాంగ్రెస్ జోరు..
కాకతీయ, ఖమ్మం బ్యూరో : ఖమ్మం జిల్లా ఏదులాపురం మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ జోరు కొనసాగుతోంది. ఇప్పటివరకు వెలువడిన ఫలితాల ప్రకారం కాంగ్రెస్ అభ్యర్థులు పలు వార్డుల్లో వరుస విజయాలు నమోదు చేసి ఆధిపత్యం చాటుతున్నారు. ఇప్పటివరకు ప్రకటించిన ఫలితాల ప్రకారం 1వ వార్డు, 3వ వార్డు, 4వ వార్డు, 7వ వార్డు, 8వ వార్డు, 9వ వార్డు, 20వ వార్డు, 25వ వార్డు, 29వ వార్డుల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు విజయం సాధించారు. ఈ విజయాలతో ఏదులాపురం మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ బలమైన స్థితిలో నిలిచింది. ఇంకా మిగిలిన వార్డుల ఫలితాలు రావాల్సి ఉండటంతో మొత్తం మున్సిపాలిటీపై ఏ పార్టీ ఆధిపత్యం సాధిస్తుందన్న దానిపై ఉత్కంఠ కొనసాగుతోంది. అయితే ఇప్పటి వరకు వచ్చిన ఫలితాలు కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉండటంతో ఆ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది.


