epaper
Thursday, January 15, 2026
epaper

అక్రమ అరెస్టులను ఖండించండి

అక్రమ అరెస్టులను ఖండించండి
సీపీఎం ఖమ్మం డివిజన్ కార్యదర్శి వై విక్రమ్
మంత్రి తుమ్మల జోక్యం చేసుకోవాలి

కాకతీయ, ఖమ్మం ప్రతినిధి : ప్రజా సమస్యలపై ఆందోళన చేస్తున్న సీపీఎం నాయకుల అక్రమ అరెస్టులను ఖండించాలని ఖమ్మం డివిజన్ కార్యదర్శి వై విక్రమ్, ఖమ్మం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు యర్రా శ్రీనివాసరావు లు కోరారు. శుక్రవారం సీపీఎం ఖమ్మం త్రీ టౌన్ కమిటీ ఆధ్వర్యంలో సుందరయ్య నగర్ పార్క్ నుంచి ఎఫ్ సీఐ గుట్ట మీద నుంచి ప్రకాష్ నగర్ శ్రీనివాస్ నగర్ వరకు పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీఎం ఖమ్మం డివిజన్ కార్యదర్శి వై విక్రమ్, ఖమ్మం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు యర్రా శ్రీనివాస రావులు మాట్లాడుతూ 17,27,28,29,30 వ డివిజన్ల లో రోడ్డు విస్తరణలో భాగంగా చాలామంది నిరుపేదల ఇండ్లు తీసివేస్తామని చెప్పి స్థానిక కార్పొరేటర్లు, కాంట్రాక్టర్లు ప్రజలను భయాందోళన గురి చేస్తున్నారని ఆరోపించారు. ఈ సందర్భంగా పార్టీ ఆధ్వర్యంలో బాధితులతో పాదయాత్ర ర్యాలీ నిర్వహించడం జరిగింది. ర్యాలీ నిర్వహిస్తుంటే పోలీసులు సిపిఎం నాయకులు ప్రజలను అక్రమంగా అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ తరలించారని విమర్శించారు.

అరెస్టు చేసిన వారిలో సిపిఎం ఖమ్మం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు యర్రా శ్రీనివాసరావు, సిపిఎం ఖమ్మం 3 టౌన్ కార్యదర్శి భూక్యా శ్రీనివాసరావు, యర్రా రంజిత్, సారంగి పాపారావు,బాధితులను కూడా అరెస్టు చేయడం దుర్మార్గం అని ఆరోపించారు. 29వ డివిజన్లో రోడ్డు విస్తరణలో భాగంగా అక్కడ నివాసముంటున్న ఒక 20 కుటుంబాలను ఇల్లు అడ్డుగా వస్తున్నాయి అని చెప్పి రోడ్డును సక్రమంగా వేయకుండా వంకరలు తిప్పి ఆ పేద ప్రజల లెట్రిన్ బాత్రూంలు కూలగొట్టడం జరిగింది అని విమర్శించారు. ప్రజలకు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా రోడ్డు ఎంత వెడల్పు వస్తుందో చెప్పకుండా నిర్ధారణ చేయకుండా కార్పొరేటర్లు ఇస్టానుసారంగా వాళ్లకు ఇష్టం వచ్చిన చోట రోడ్డును ఎటువైపు మల్లాలంటే అటువైపు మలుచుకుంటూ వెళ్తా ఉన్నారు అని తెలిపారు. ఖ‌చ్చితంగా అధికారులు ప్లాన్ ప్రకారం కాకుండా 80 అడుగులు అని ఒకసారి, మరోసారి 70 అడుగులు అని ప్రజలను భయాందోళన గురిచేస్తున్నారని తెలిపారు. కాబట్టి ఇప్పటికైనా అధికారులు స్పందించి ప్రజలకు నష్టం వాటిల్లకుండా రోడ్డును వేయాలని వారు కోరారు. ఈ సమస్య విషయంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, కమిషనర్, మేయర్ వెంటనే స్పందించి స్థానిక ప్రజలతో చర్చించాలి అని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సిపిఎం ఖమ్మం 3 టౌన్ కార్యదర్శి భూక్యా శ్రీనివాసరావు, సిపిఐ 31 కార్యదర్శి నూనె .శశిధర్, భూక్య రవీందర్, సిపిఎం ఖమ్మం త్రీ టౌన్ కార్యదర్శి వర్గ సభ్యులు వజెనేపల్లి శ్రీనివాసరావు, సిపిఎం 31 డివిజన్ కార్పొరేటర్ ఎర్ర గోపి,షేక్ సైదులు, షేక్ హిమామ్,యర్రా. రంజిత్, సారంగి పాపారావు, రంగు హనుమంతా చారి, నాయిని నరసింహారావు, తదితరులు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

ఖండాంతరాల్లో సిపిఐ శతాబ్ది సంబరం..!

ఖండాంతరాల్లో సిపిఐ శతాబ్ది సంబరం..! విదేశాల్లోనూ ఎగసిన వామపక్ష జెండా ఖమ్మం వామపక్ష కుటుంబాల...

రూ.15 లక్షల గంజాయి ద్రవం పట్టివేత.. ఇద్ద‌రి అరెస్టు..

రూ.15 లక్షల గంజాయి ద్రవం పట్టివేత.. ఇద్ద‌రి అరెస్టు.. ద్విచక్ర వాహనం, రెండు...

రిజర్వేషన్లకు ముందే టికెట్ల యుద్ధం

రిజర్వేషన్లకు ముందే టికెట్ల యుద్ధం * మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో పొలిటికల్ హీట్ *...

చైనా మాంజాలపై ఉక్కుపాదం

చైనా మాంజాలపై ఉక్కుపాదం * విక్రయిస్తే కేసులు తప్పవు * వాహనదారులకు ప్రాణహాని * పక్షుల...

ప్రజావాణి కి అధికారుల డుమ్మా

ప్రజావాణి కి అధికారుల డుమ్మా * 11 దాటినా జాడలేని అధికారులు * 29...

భూసారం కాపాడుకోవడం రైతు బాధ్యత

భూసారం కాపాడుకోవడం రైతు బాధ్యత సాగు ఖర్చులు త‌గ్గితేనే ఆదాయం పెరుగుతుంది అవసరానికి మించి...

స్థానిక సమస్యలకు సీపీఐ(ఎం)తోనే పరిష్కారం

స్థానిక సమస్యలకు సీపీఐ(ఎం)తోనే పరిష్కారం సంస్కృతి–సంప్రదాయాలకు ప్రతీక రంగవల్లికలు సీపీఐ(ఎం) ఖమ్మం డివిజన్ కార్యదర్శి...

నేడు కాంగ్రెస్‌ ముత్యాల ముగ్గుల పోటీలు

నేడు కాంగ్రెస్‌ ముత్యాల ముగ్గుల పోటీలు కొత్తగూడెం ప్రకాశం స్టేడియంలో 3 గంటలకు...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...

రేవంత్ కు కొత్త సవాల్!

* సర్కార్ కు పరీక్షగా సీఎస్ ఎంపిక? * ఈ నెలాఖరున రామకృష్ణారావు...

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం కాక‌తీయ‌, హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లాలోని బాటసింగారంలో...

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన ప్రతిపాదించిన ప్రాజెక్టుపై...

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా న్యూ డిల్లీ జూలై...

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు మొన్న యూనివర్సిటీల్లో ఆందోళనలు నిషేధిస్తూ మెమో నేడు...

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌ కాంగ్రెస్‌ దూత ఫోన్‌ ట్యాపింగ్‌..! గాంధీ...
spot_img

Popular Categories

spot_imgspot_img