బీఆర్ఎస్ నేతలపై కేసులు
కాకతీయ, కొత్తగూడెం ప్రతినిధి : బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావుపై సిట్ విచారణను వ్యతిరేకిస్తూ ఆదివారం కొత్తగూడెంలో బీఆర్ఎస్ నాయకులు బైక్ ర్యాలీ నిర్వహించారు. అయితే మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా అనుమతులు లేకుండా ర్యాలీ నిర్వహించడంతో కోడ్ ఉల్లంఘన కింద బీఆర్ఎస్ నేతలపై పోలీసులు కేసులు నమోదు చేశారు.
ఎన్నికల నిబంధనలను అతిక్రమించినందుకు పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు కొత్తగూడెం వన్టౌన్ సీఐ కరుణాకర్, త్రీటౌన్ సీఐ ఇంద్రసేనారెడ్డి తెలిపారు. ఎన్నికల సమయంలో అనుమతి లేకుండా ర్యాలీలు, ప్రదర్శనలు నిర్వహిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు.


