epaper
Thursday, January 15, 2026
epaper

డిసెంబర్ 6న ఆరు ప్రాంతాల్లో పేలుళ్లు.. దేశం వ‌ణికేలా జైష్ కుట్ర!

డిసెంబర్ 6న ఆరు ప్రాంతాల్లో పేలుళ్లు.. దేశం వ‌ణికేలా జైష్ కుట్ర!
ఎర్రకోట పేలుడు దర్యాప్తులో బయటపడిన ఉగ్ర పథకం
బాబ్రీ మసీదు ఘటనకు ప్రతీకారం
ఐదు దశల్లో అమలు చేయబోయిన దాడి ప్రణాళిక

కాక‌తీయ‌, జాతీయం : దేశ రాజధానిని వణికించే కుట్రను నిఘా సంస్థలు సమయానికి ఛేదించాయి. ఇటీవల ఎర్రకోట సమీపంలో జరిగిన కారు పేలుడు కేసు విచారణలో సంచలన వివరాలు బయటపడ్డాయి. ఈ ఘటన వెనుక జైష్-ఎ-మొహమ్మద్ అనుబంధ ఉగ్ర మాడ్యూల్ ఉందని అధికారులు వెల్లడించారు. ఈ మాడ్యూల్‌ డిసెంబర్ 6న ఢిల్లీలోని ఆరు ప్రధాన ప్రదేశాల్లో సమన్వయంతో పేలుళ్లు జరపాలని ప్రణాళిక వేసిందని దర్యాప్తులో తేలింది. ఉగ్రవాదులు ఈ తేదీని వ్యూహాత్మకంగా ఎంచుకోవడం గమనార్హం. 1992లో ఇదే రోజున అయోధ్యలో బాబ్రీ మసీదు కూల్చివేత జరిగింది. ఆ ఘటనకు ప్రతీకారం తీర్చుకోవడమే తమ ఉద్దేశమని అరెస్టయిన అనుమానితులు విచారణలో వెల్లడించారు. ఈ నేపథ్యంలో డిసెంబర్ 6ను ప్రతీకారం దినంగా నిర్ణయించి దాడి చేయాలని వారు సిద్ధపడ్డారు.

ఐదు దశల ప్రణాళిక..

దర్యాప్తు సంస్థలు ఈ ఉగ్ర మాడ్యూల్ రూపొందించిన ఐదు దశల ప్రణాళికను గుర్తించాయి. మొదటగా, జైష్-ఎ-మొహమ్మద్ మరియు అన్సార్ ఘజ్వత్-ఉల్-హింద్ అనుబంధ వ్యక్తులతో ప్రత్యేక మాడ్యూల్‌ను ఏర్పాటు చేశారు. ఇందులో ఉన్నవారిలో కొంతమంది వైద్యులు, టెక్నికల్‌ నిపుణులు కూడా ఉన్నారని సమాచారం. రెండవ దశలో హర్యానాలోని నుహ్, గురుగ్రామ్ ప్రాంతాల నుంచి ఐఈడీల తయారీకి కావలసిన ముడిసరుకులు సేకరించారు. మూడవ దశలో పేలుడు పరికరాలను తయారు చేసి, ఢిల్లీలో లక్ష్యంగా పెట్టుకున్న ప్రాంతాల్లో రెక్కీ నిర్వహించ‌డం, నాలుగవ దశలో అసెంబుల్ చేసిన బాంబులను మాడ్యూల్ సభ్యుల మధ్య పంపిణీ చేయ‌డం, చివరగా డిసెంబర్ 6న ఢిల్లీలో ఆరు నుంచి ఏడు ప్రదేశాల్లో ఒకేసారి దాడులు జరిపే విధంగా ప్రణాళిక సిద్ధమైంది.

ఎర్రకోట సమీపంలో ఇటీవల చోటుచేసుకున్న కారు పేలుడు మొదట చిన్న ఘటనగా భావించినా, విచారణలో అది పెద్ద కుట్రకు తలుపులు తెరిచింది. ఆ కారు నుంచి సేకరించిన ఫోరెన్సిక్ ఆధారాలు, ఎలక్ట్రానిక్ డేటా ఆధారంగా నిఘా సంస్థలు ఈ మాడ్యూల్‌కు చేరుకున్నాయి. తద్వారా దేశ రాజధానిపై ముసుగులో సాగిన ఉగ్ర పథకం బహిర్గతమైంది. మొదట ఈ ఉగ్రవాద మాడ్యూల్ ఆగస్టు నెలలోనే దాడులు జరపాలని నిర్ణయించిందని, కానీ అంతర్గత సమన్వయ లోపాల వ‌ల్ల ప్రణాళిక ఆలస్యం కావడంతో చివరికి డిసెంబర్ 6న లక్ష్యంగా పెట్టుకున్నట్లు దర్యాప్తు తెలిపింది.

కాగా, ఈ వివరాలు వెలుగులోకి రావడంతో ఢిల్లీ సహా దేశవ్యాప్తంగా నిఘా సంస్థలు హై అలర్ట్ ప్రకటించాయి. ఇప్పటికే అరెస్టయిన అనుమానితుల నుండి మరిన్ని వివరాలు సేకరిస్తున్నట్లు సమాచారం. అలాగే మ‌రోవైపు దేశ భద్రతకు ముప్పుగా ఉన్న ఈ ఉగ్ర మాడ్యూల్‌ను అధికారులు సమూలంగా నిర్వీర్యం చేయడానికి చర్యలు చేపట్టారు.ఎర్రకోట పేలుడు దర్యాప్తులో బయటపడిన ఉగ్ర పథకం
బాబ్రీ మసీదు ఘటనకు ప్రతీకారం

ఐదు దశల్లో అమలు చేయబోయిన దాడి ప్రణాళిక

కాక‌తీయ‌, జాతీయం : దేశ రాజధానిని వణికించే కుట్రను నిఘా సంస్థలు సమయానికి ఛేదించాయి. ఇటీవల ఎర్రకోట సమీపంలో జరిగిన కారు పేలుడు కేసు విచారణలో సంచలన వివరాలు బయటపడ్డాయి. ఈ ఘటన వెనుక జైష్-ఎ-మొహమ్మద్ అనుబంధ ఉగ్ర మాడ్యూల్ ఉందని అధికారులు వెల్లడించారు. ఈ మాడ్యూల్‌ డిసెంబర్ 6న ఢిల్లీలోని ఆరు ప్రధాన ప్రదేశాల్లో సమన్వయంతో పేలుళ్లు జరపాలని ప్రణాళిక వేసిందని దర్యాప్తులో తేలింది. ఉగ్రవాదులు ఈ తేదీని వ్యూహాత్మకంగా ఎంచుకోవడం గమనార్హం. 1992లో ఇదే రోజున అయోధ్యలో బాబ్రీ మసీదు కూల్చివేత జరిగింది. ఆ ఘటనకు ప్రతీకారం తీర్చుకోవడమే తమ ఉద్దేశమని అరెస్టయిన అనుమానితులు విచారణలో వెల్లడించారు. ఈ నేపథ్యంలో డిసెంబర్ 6ను ప్రతీకారం దినంగా నిర్ణయించి దాడి చేయాలని వారు సిద్ధపడ్డారు.

ఐదు దశల ప్రణాళిక..

దర్యాప్తు సంస్థలు ఈ ఉగ్ర మాడ్యూల్ రూపొందించిన ఐదు దశల ప్రణాళికను గుర్తించాయి. మొదటగా, జైష్-ఎ-మొహమ్మద్ మరియు అన్సార్ ఘజ్వత్-ఉల్-హింద్ అనుబంధ వ్యక్తులతో ప్రత్యేక మాడ్యూల్‌ను ఏర్పాటు చేశారు. ఇందులో ఉన్నవారిలో కొంతమంది వైద్యులు, టెక్నికల్‌ నిపుణులు కూడా ఉన్నారని సమాచారం. రెండవ దశలో హర్యానాలోని నుహ్, గురుగ్రామ్ ప్రాంతాల నుంచి ఐఈడీల తయారీకి కావలసిన ముడిసరుకులు సేకరించారు. మూడవ దశలో పేలుడు పరికరాలను తయారు చేసి, ఢిల్లీలో లక్ష్యంగా పెట్టుకున్న ప్రాంతాల్లో రెక్కీ నిర్వహించ‌డం, నాలుగవ దశలో అసెంబుల్ చేసిన బాంబులను మాడ్యూల్ సభ్యుల మధ్య పంపిణీ చేయ‌డం, చివరగా డిసెంబర్ 6న ఢిల్లీలో ఆరు నుంచి ఏడు ప్రదేశాల్లో ఒకేసారి దాడులు జరిపే విధంగా ప్రణాళిక సిద్ధమైంది.

ఎర్రకోట సమీపంలో ఇటీవల చోటుచేసుకున్న కారు పేలుడు మొదట చిన్న ఘటనగా భావించినా, విచారణలో అది పెద్ద కుట్రకు తలుపులు తెరిచింది. ఆ కారు నుంచి సేకరించిన ఫోరెన్సిక్ ఆధారాలు, ఎలక్ట్రానిక్ డేటా ఆధారంగా నిఘా సంస్థలు ఈ మాడ్యూల్‌కు చేరుకున్నాయి. తద్వారా దేశ రాజధానిపై ముసుగులో సాగిన ఉగ్ర పథకం బహిర్గతమైంది. మొదట ఈ ఉగ్రవాద మాడ్యూల్ ఆగస్టు నెలలోనే దాడులు జరపాలని నిర్ణయించిందని, కానీ అంతర్గత సమన్వయ లోపాల వ‌ల్ల ప్రణాళిక ఆలస్యం కావడంతో చివరికి డిసెంబర్ 6న లక్ష్యంగా పెట్టుకున్నట్లు దర్యాప్తు తెలిపింది.

కాగా, ఈ వివరాలు వెలుగులోకి రావడంతో ఢిల్లీ సహా దేశవ్యాప్తంగా నిఘా సంస్థలు హై అలర్ట్ ప్రకటించాయి. ఇప్పటికే అరెస్టయిన అనుమానితుల నుండి మరిన్ని వివరాలు సేకరిస్తున్నట్లు సమాచారం. అలాగే మ‌రోవైపు దేశ భద్రతకు ముప్పుగా ఉన్న ఈ ఉగ్ర మాడ్యూల్‌ను అధికారులు సమూలంగా నిర్వీర్యం చేయడానికి చర్యలు చేపట్టారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

భారత్​లో స్థిరత్వం

భారత్​లో స్థిరత్వం ప్రపంచమంతా అనిశ్చితి ఉన్నా మ‌నం సేఫ్‌ ప్రధాని న‌రేంద్ర మోదీ కాక‌తీయ‌, నేష‌న‌ల్...

సత్తుపల్లి కేంద్రంగా రూ.547 కోట్ల సైబర్‌ మోసం

సత్తుపల్లి కేంద్రంగా రూ.547 కోట్ల సైబర్‌ మోసం ఉద్యోగాల పేరుతో నిరుద్యోగులకు ఎర‌ వారి...

మాతృభాషను ప్రోత్సహించాలి

మాతృభాషను ప్రోత్సహించాలి భారత్​ అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలవాలి స్వదేశీ వస్తువులను తయారు చేయడానికి...

కనకదుర్గ ఆలయంలో అవాంఛనీయ ఘటనలు

కనకదుర్గ ఆలయంలో అవాంఛనీయ ఘటనలు 15 రోజుల్లో మూడు ఘటనలతో భక్తుల్లో ఆందోళన అభిషేకం...

భూ భారతి పేరిట దోపిడీ!…. మీసేవ–స్లాట్ బుకింగ్ కేంద్రాల మోసం వెలుగులోకి

భూ భారతి పేరిట దోపిడీ! మీసేవ–స్లాట్ బుకింగ్ కేంద్రాల మోసం వెలుగులోకి జనగామలో రూ.78...

సోనియాగాంధీకి అస్వస్థత!

సోనియాగాంధీకి అస్వస్థత! దీర్ఘకాలిక దగ్గుతో బాధపడుతున్న కాంగ్రెస్ అగ్రనేత ఢిల్లీలోని సర్ గంగారామ్ ఆస్పత్రిలో...

దేశంలోనే ధనవంతమైన బల్దియా !

దేశంలోనే ధనవంతమైన బల్దియా ! ఆదాయంలో బీఎంసీ రికార్డు..! మేయర్ ఎన్నికల వేళ ప్రత్యేక...

ఉమర్ ఖాలిద్‌కు న్యూయార్క్ మేయర్ లేఖ

ఉమర్ ఖాలిద్‌కు న్యూయార్క్ మేయర్ లేఖ జైలు డైరీ చదివానంటూ మద్దతు వివాదంగా మారిన...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...

రేవంత్ కు కొత్త సవాల్!

* సర్కార్ కు పరీక్షగా సీఎస్ ఎంపిక? * ఈ నెలాఖరున రామకృష్ణారావు...

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం కాక‌తీయ‌, హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లాలోని బాటసింగారంలో...

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన ప్రతిపాదించిన ప్రాజెక్టుపై...

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా న్యూ డిల్లీ జూలై...

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు మొన్న యూనివర్సిటీల్లో ఆందోళనలు నిషేధిస్తూ మెమో నేడు...

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌ కాంగ్రెస్‌ దూత ఫోన్‌ ట్యాపింగ్‌..! గాంధీ...
spot_img

Popular Categories

spot_imgspot_img