epaper
Sunday, March 1, 2026
epaper

ఖమ్మం నగర అభివృద్ధిపై బీజేపీ పోరు

ఖమ్మం నగర అభివృద్ధిపై బీజేపీ పోరు
అక్రమ కట్టడాలను వెంట‌నే తొల‌గించాలి
ఆలయాల అభివృద్ధికి చ‌ర్య‌లు తీసుకోవాలి
శివారు డివిజన్ల ప్రజా కష్టాలు తీర్చండి
మున్సిపల్ కమిషనర్‌కు బీజేపీ జిల్లా అధ్యక్షుడు నెల్లూరి విన‌తి

కాకతీయ, ఖమ్మం : ఖమ్మం నగరంలో ప్రజలు ఎదుర్కొంటున్న మౌలిక సదుపాయాల సమస్యలు, హిందూ దేవాలయాల రక్షణ, అక్రమ కట్టడాల తొలగింపుపై తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరుతూ భారతీయ జనతా పార్టీ ఖమ్మం జిల్లా శాఖ గురువారం మున్సిపల్ కమిషనర్ అభిషేక్ అగస్త్యకు వినతిపత్రం అందజేసింది. బీజేపీ జిల్లా అధ్యక్షులు నెల్లూరి కోటేశ్వరరావు ఆధ్వర్యంలో పార్టీ నాయకులు కమిషనర్‌ను కలిసి, నగర పరిధిలో ముఖ్యంగా శివారు డివిజన్లలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను వివరించారు.
కార్పొరేషన్ పరిధిలోని శివారు డివిజన్లలో డ్రైనేజీ వ్యవస్థ పూర్తిగా అస్తవ్యస్తంగా మారిందని నెల్లూరి కోటేశ్వరరావు తెలిపారు. సరైన సైడ్ డ్రైన్స్ లేకపోవడంతో మురుగునీరు రోడ్లపై నిలిచిపోతుండటంతో దోమల బెడద పెరిగి ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నారని కమిషనర్ దృష్టికి తీసుకెళ్లారు. తక్షణమే పక్కా డ్రైనేజీ నిర్మాణానికి నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. 23వ డివిజన్‌లో ఇరుకు రోడ్ల కారణంగా ట్రాఫిక్ సమస్య తీవ్రంగా ఉందని, రోడ్లను వెడల్పు చేసి వాహన రాకపోకలకు ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవాలని కోరారు.

దేవాలయాల రక్షణపై నిర్లక్ష్యం

నగరంలో హిందూ దేవాలయాల అభివృద్ధి, రక్షణను మున్సిపల్ యంత్రాంగం విస్మరిస్తోందని బీజేపీ నేతలు అసంతృప్తి వ్యక్తం చేశారు. చాలా ఆలయాలకు ప్రహరీ గోడలు లేకపోవడంతో ఆవరణలు అపరిశుభ్రంగా మారుతున్నాయని, ఆలయాల పవిత్రతను కాపాడేందుకు మున్సిపల్ నిధులతో రక్షణ గోడలు నిర్మించాలని డిమాండ్ చేశారు. భక్తుల సౌకర్యార్థం, ముఖ్యంగా మహిళల కోసం స్వచ్ఛ భారత్ నిధుల ద్వారా దేవాలయాల వద్ద మరుగుదొడ్లు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు.
ఫుట్‌పాత్‌లపై అక్రమ ఆక్రమణల వల్ల పాదచారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, వాటిని వెంటనే తొలగించి ప్రజలకు భద్రత కల్పించాలని కోరారు. ఇక 37వ డివిజన్‌లోని ప్రభుత్వ పాఠశాలకు ప్రహరీ గోడ నిర్మించాలని, 1వ టౌన్ ప్రాంతంలో ప్రజల అవసరాల దృష్ట్యా సమీకృత కూరగాయల మార్కెట్, రైతు బజార్ ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. నగర సాంస్కృతిక వికాసం, ప్రజా ప్రయోజనాల దృష్ట్యా ఈ పనులకు వెంటనే నిధులు మంజూరు చేయాలని బీజేపీ జిల్లా అధ్యక్షులు మున్సిపల్ కమిషనర్‌ను కోరారు. ఈ కార్యక్రమంలో మందడపు సుబ్బారావు, దొంగల సత్యనారాయణ, గుత్తా వెంకటేశ్వరరావు, వీరెల్లి రాజేష్ గుప్తా, రవి గౌడు, బోయినపల్లి సురేష్, కొమిలి శ్రీనివాస్, అల్లిక అంజయ్య, గడిల నరేష్, చిన్ని కృష్ణ, తడుపునూరి రవీందర్, చారి, రాము, కంపసాటి అజయ్, సంపత్ తదితరులు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

ఎస్సీ వర్గీకరణ పోరులో అమరవీరులకు జోహార్లు

ఎస్సీ వర్గీకరణ పోరులో అమరవీరులకు జోహార్లు సింగరేణిలో ఎమ్మార్పీఎస్ గద్దె వద్ద నివాళులు త్యాగాలు...

బొగ్గు–ఇసుక లారీల బీభత్సం..!

బొగ్గు–ఇసుక లారీల బీభత్సం..! మణుగూరు–బయ్యారం రహదారి ధ్వంసం దుమ్ము ధూళితో గిరిజన బిడ్డల అనారోగ్యం ప్రజల...

అదుపుతప్పిన ఇసుక ట్రాక్టర్ – డ్రైవర్ దుర్మరణం

అదుపుతప్పిన ఇసుక ట్రాక్టర్ – డ్రైవర్ దుర్మరణం నాగులవంచ వద్ద తెల్లవారుజామున ప్రమాదం ఓవర్‌టేక్...

వెలుగుమట్ల బాధితులపై ముమ్మర సర్వే

వెలుగుమట్ల బాధితులపై ముమ్మర సర్వే 21 మంది తహశీల్దార్లతో యుద్ధప్రాతిపదికన సర్వే ఖమ్మం జిల్లాకు...

వెలుగుమట్ల బాధితులకు బీఆర్ఎస్ అండ

వెలుగుమట్ల బాధితులకు బీఆర్ఎస్ అండ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర ఆధ్వర్యంలో భోజనాల పంపిణీ కాకతీయ,...

సీఎం రేవంత్ రెడ్డికి సన్మానసభ పోస్టర్ ఆవిష్కరణ

సీఎం రేవంత్ రెడ్డికి సన్మానసభ పోస్టర్ ఆవిష్కరణ కాకతీయ, ఖమ్మం : ఎస్సీ...

భూదాన్ వ్యవహారంలో విపక్షాలే అభాసు

భూదాన్ వ్యవహారంలో విపక్షాలే అభాసు పేదల పేరుతో రాద్ధాంతం చేశారు ఏజెంట్ల మోసాలపై బాధితులకు...

మోదీ పాలనలో దేశానికి ప్రమాదం

మోదీ పాలనలో దేశానికి ప్రమాదం కార్పొరేట్ల కోసమే కేంద్రం విధానాలు సీపీఐ (ఎం) పొలిట్...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img