epaper
Thursday, January 15, 2026
epaper

రాహుల్‌, సోనియాలపై బీజేపీ కక్షసాధింపు

రాహుల్‌, సోనియాలపై బీజేపీ కక్షసాధింపు
ఈడీని అడ్డుపెట్టుకొని వేధింపులు
ఖ‌మ్మం జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు నూతి సత్యనారాయణ గౌడ్
ఖమ్మం ప‌ట్ట‌ణంలో భారీ నిర‌స‌న ప్ర‌ద‌ర్శ‌న‌

కాకతీయ, ఖమ్మం ప్రతినిధి : కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)ని అడ్డుపెట్టుకొని కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీలపై కక్షసాధింపు చర్యలకు పాల్పడుతోందని జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు నూతి సత్యనారాయణ గౌడ్ ఆరోపించారు. కాంగ్రెస్ నేతలపై జరుగుతున్న వేధింపులను నిరసిస్తూ ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ పిలుపు మేరకు, టీపీసీసీ ఆదేశాల ప్రకారం జిల్లా కాంగ్రెస్ కమిటీ, నగర కాంగ్రెస్ కమిటీల ఆధ్వర్యంలో గురువారం ఖమ్మంలో భారీ నిరసన కార్యక్రమం నిర్వహించారు. జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు నూతి సత్యనారాయణ గౌడ్, నగర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు నాగండ్ల దీపక్ చౌదరి నాయకత్వంలో కాంగ్రెస్ శ్రేణులు పెద్ద ఎత్తున తరలివచ్చి అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా నూతి సత్యనారాయణ గౌడ్ మాట్లాడారు.

కాంగ్రెస్ అగ్ర‌నేత‌ల‌పై బీజేపీ క‌క్ష సాధింపు

కొన్ని సంవత్సరాలుగా ఈడీని రాజకీయ ఆయుధంగా మార్చి కాంగ్రెస్ అగ్రనేతలపై అక్రమ కేసులు బనాయిస్తూ బీజేపీ రాక్షసానందం పొందుతోంద‌ని నూతి సత్యనారాయణ గౌడ్ అన్నారు. డిల్లీ హైకోర్టు తీర్పు బీజేపీకి చెంపపెట్టులాంటిదని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ అగ్రనేతలను రాజకీయంగా దెబ్బతీయాలనే దురుద్దేశంతో బీజేపీ వేసిన కేసులను డిల్లీ హైకోర్టు రాజకీయ ప్రేరేపిత కేసులుగా గుర్తించి ఈడీ దాఖలు చేసిన చార్జిషీట్‌ను తిరస్కరించిందన్నారు. దేశం కోసం ప్రాణాలు అర్పించిన కుటుంబానికి చెందిన నాయకులపై ఇలాంటి కుట్రలు చేయడం హేయమైన చర్య అని మండిపడ్డారు. యావత్తు దేశ ప్రజలు బీజేపీ అరాచకాలను గమనిస్తున్నారని, తగిన సమయంలో ప్రజలే సరైన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. రాజ్యాంగబద్ధ సంస్థలను స్వప్రయోజనాల కోసం బీజేపీ దుర్వినియోగం చేస్తోందని విమర్శించారు. రెండు దఫాలుగా అధికారంలో ఉన్న బీజేపీ పాలనలో దేశంలో అభివృద్ధి, సంక్షేమం శూన్యమని, తమ ఆప్తుల ఆస్తులు కాపాడుకోవడమే ప్రభుత్వ లక్ష్యంగా మారిందని ఆరోపించారు. నిరసన అనంతరం కాంగ్రెస్ శ్రేణులను 2టౌన్ పోలీస్ స్టేషన్‌కు తరలించగా, స్వంత పూచీకత్తుపై విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో సీనియర్ కాంగ్రెస్ నాయకులు పులిపాటి వెంకయ్య, రాష్ట్ర ఓబీసీ సెల్ ఉపాధ్యక్షుడు వడ్డేబోయిన నరసింహారావు, జిల్లా అనుబంధ సంఘాల అధ్యక్షులు దొబ్బల సౌజన్య, సయ్యద్ గౌస్, మొక్కా శేఖర్ గౌడ్, బొడ్డు బొందయ్య, కార్పొరేటర్లు రాపర్తి శరత్‌, మాజి కౌన్సిలర్ పాలకుర్తి నాగేశ్వరరావు, కాపా ఆదినారాయణ, శెట్టి రంగారావు, వైరా మార్కెట్ కమిటీ చైర్మన్ బోళ్ల గంగారావు, నరాల నరేష్ నాయుడు, గజ్జి సూర్యనారాయణతో పాటు పలువురు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

ఖండాంతరాల్లో సిపిఐ శతాబ్ది సంబరం..!

ఖండాంతరాల్లో సిపిఐ శతాబ్ది సంబరం..! విదేశాల్లోనూ ఎగసిన వామపక్ష జెండా ఖమ్మం వామపక్ష కుటుంబాల...

రూ.15 లక్షల గంజాయి ద్రవం పట్టివేత.. ఇద్ద‌రి అరెస్టు..

రూ.15 లక్షల గంజాయి ద్రవం పట్టివేత.. ఇద్ద‌రి అరెస్టు.. ద్విచక్ర వాహనం, రెండు...

రిజర్వేషన్లకు ముందే టికెట్ల యుద్ధం

రిజర్వేషన్లకు ముందే టికెట్ల యుద్ధం * మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో పొలిటికల్ హీట్ *...

చైనా మాంజాలపై ఉక్కుపాదం

చైనా మాంజాలపై ఉక్కుపాదం * విక్రయిస్తే కేసులు తప్పవు * వాహనదారులకు ప్రాణహాని * పక్షుల...

ప్రజావాణి కి అధికారుల డుమ్మా

ప్రజావాణి కి అధికారుల డుమ్మా * 11 దాటినా జాడలేని అధికారులు * 29...

భూసారం కాపాడుకోవడం రైతు బాధ్యత

భూసారం కాపాడుకోవడం రైతు బాధ్యత సాగు ఖర్చులు త‌గ్గితేనే ఆదాయం పెరుగుతుంది అవసరానికి మించి...

స్థానిక సమస్యలకు సీపీఐ(ఎం)తోనే పరిష్కారం

స్థానిక సమస్యలకు సీపీఐ(ఎం)తోనే పరిష్కారం సంస్కృతి–సంప్రదాయాలకు ప్రతీక రంగవల్లికలు సీపీఐ(ఎం) ఖమ్మం డివిజన్ కార్యదర్శి...

నేడు కాంగ్రెస్‌ ముత్యాల ముగ్గుల పోటీలు

నేడు కాంగ్రెస్‌ ముత్యాల ముగ్గుల పోటీలు కొత్తగూడెం ప్రకాశం స్టేడియంలో 3 గంటలకు...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...

రేవంత్ కు కొత్త సవాల్!

* సర్కార్ కు పరీక్షగా సీఎస్ ఎంపిక? * ఈ నెలాఖరున రామకృష్ణారావు...

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం కాక‌తీయ‌, హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లాలోని బాటసింగారంలో...

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన ప్రతిపాదించిన ప్రాజెక్టుపై...

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా న్యూ డిల్లీ జూలై...

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు మొన్న యూనివర్సిటీల్లో ఆందోళనలు నిషేధిస్తూ మెమో నేడు...

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌ కాంగ్రెస్‌ దూత ఫోన్‌ ట్యాపింగ్‌..! గాంధీ...
spot_img

Popular Categories

spot_imgspot_img