మానవత్వం చాటుకున్న భూక్యా రమేష్
: మృతురాలి కుటుంబానికి ఆర్థిక సాయం
కాకతీయ, కారేపల్లి : కష్టాల్లో ఉన్న వారికి అండగా నిలవడమే అసలైన సేవా గుణమని భూక్యా రమేష్ మరోసారి నిరూపించుకున్నారు. సింగరేణి మండల కేంద్ర పరిధిలోని దుబ్బ తండ గ్రామానికి చెందిన గుగులోతు ధ్వాలి గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ గురువారం తుది శ్వాస విడిచారు.
భౌతిక కాయానికి నివాళి – కుటుంబానికి భరోసా
ధ్వాలి మరణవార్త తెలిసిన వెంటనే భూక్యా రమేష్ దుబ్బ తండకు చేరుకున్నారు. ఆమె భౌతిక కాయానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. మృతురాలి కుటుంబ సభ్యులను పరామర్శించి, వారిలో ధైర్యాన్ని నింపారు. ఈ సందర్భంగా వారి కుటుంబానికి తక్షణ సహాయంగా రూ.3,000 రూపాయల ఆర్థిక సాయాన్ని అందజేసి తన ఉదారతను చాటుకున్నారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు
గుగులోతు రవీందర్ (కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షుడు)
భూక్య గణేష్
భూక్యా నందు
గుగులోతు లచ్చు
బానోతు లక్ష్మ
భూక్యా చందా
భూక్యా భాష్య
భూక్యా బజ్జు
మరియు పార్టీ కార్యకర్తలు, గ్రామస్థులు పాల్గొని ధ్వాలి అంతిమ నివాళులు అర్పించారు. ఆపద సమయంలో స్పందించి ఆర్థిక సాయం చేసిన భూక్యా రమేష్ ని గ్రామస్తులు అభినందించారు.


