epaper
Thursday, January 15, 2026
epaper

భూ భారతి పేరిట దోపిడీ!…. మీసేవ–స్లాట్ బుకింగ్ కేంద్రాల మోసం వెలుగులోకి

భూ భారతి పేరిట దోపిడీ!
మీసేవ–స్లాట్ బుకింగ్ కేంద్రాల మోసం వెలుగులోకి
జనగామలో రూ.78 లక్షల స్కామ్‌ అంచనా
చలాన్లు ఎడిట్‌ చేసి ప్రభుత్వానికి గండి
22 కేసులు.. ముగ్గురు అరెస్టు
రాష్ట్రవ్యాప్తంగా మరిన్ని మోసాలు జ‌రిగి ఉంటాయా అన్న‌మానాలు
విచార‌ణ చేప‌డుతున్న పోలీసు, రెవెన్యూ అధికారులు

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : జనగామ జిల్లాలో ‘భూ భారతి’ పోర్టల్‌ను అడ్డుపెట్టుకుని మీసేవ, స్లాట్ బుకింగ్ కేంద్రాల నిర్వాహకులు చేసిన భారీ ఆర్థిక కుంభకోణం సంచలనం రేపుతోంది. భూమి రిజిస్ట్రేషన్లు, ఇతర డాక్యుమెంట్లకు సంబంధించిన ఫీజులు రైతుల నుంచి పూర్తిగా వసూలు చేసి, ప్రభుత్వానికి మాత్రం తక్కువ మొత్తమే జమ చేసినట్లు దర్యాప్తులో బయటపడింది. తప్పుడు చలాన్లు, ఫేక్‌ రసీదుల ద్వారా ప్రభుత్వ ఖజానాకు భారీగా గండి కొట్టినట్లు అధికారులు నిర్ధారించారు. ఓ జర్నలిస్టుకు సంబంధించిన డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ సమయంలో చలాన్లలో తేడాలు కనిపించడంతో అనుమానం మొదలైంది. అధికారులు లోతుగా విచారించగా, మొత్తం 10 డాక్యుమెంట్లలో ఇదే తరహా మోసాలు జరిగినట్లు గుర్తించారు. ఈ డాక్యుమెంట్ల ద్వారా మాత్రమే రూ.8,68,884 వసూలు చేసి, ప్రభుత్వానికి రూ.13,307 మాత్రమే చెల్లించి, రూ.8,55,577ను దారి మళ్లించినట్లు లెక్కలు చెబుతున్నాయి.

ప్రత్యేక యాప్‌లతో చలాన్ ఎడిటింగ్

మీసేవ, స్లాట్ బుకింగ్ కేంద్రాల నిర్వాహకులు ప్రత్యేక యాప్‌లను ఉపయోగించి చలాన్లను ఎడిట్‌ చేసినట్లు పోలీసులు గుర్తించారు. రిజిస్ట్రేషన్ ఫీజులు, స్టాంప్ డ్యూటీలను రైతుల నుంచి పూర్తిగా తీసుకుని, ఆన్‌లైన్‌లో తక్కువ మొత్తాన్ని చూపిస్తూ మిగిలిన డబ్బును తమ వ్యక్తిగత ఖాతాలకు మళ్లించుకున్నట్లు తేలింది. ప్రాథమిక దర్యాప్తులో ఒక్క జనగామ జిల్లాలోనే సుమారు రూ.78 లక్షల మేర ప్రభుత్వ ఆదాయానికి నష్టం జరిగినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. ఇప్పటివరకు 22 చలాన్ ఎడిట్ కేసులు నమోదు కాగా, ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్టు చేసి విచారిస్తున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్టకు చెందిన ఓ ఇంటర్నెట్ సెంటర్ నిర్వాహకుడు, హైదరాబాద్‌కు చెందిన మరో వ్యక్తి ఈ కుంభకోణానికి మాస్టర్‌మైండ్‌లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఇదే తరహా మోసాలు రాష్ట్రవ్యాప్తంగా ఇతర జిల్లాల్లోనూ జరిగి ఉండవచ్చన్న అనుమానంతో ప్రభుత్వం సమగ్ర విచారణకు ఆదేశాలు జారీ చేసింది. భూ భారతి పోర్టల్‌, స్లాట్ బుకింగ్ వ్యవస్థల్లోని సాంకేతిక లోపాలపై కూడా అధికారులు దృష్టి సారించారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

సత్తుపల్లి కేంద్రంగా రూ.547 కోట్ల సైబర్‌ మోసం

సత్తుపల్లి కేంద్రంగా రూ.547 కోట్ల సైబర్‌ మోసం ఉద్యోగాల పేరుతో నిరుద్యోగులకు ఎర‌ వారి...

బీఆర్ఎస్‌కు ట‌ఫ్ టైం

బీఆర్ఎస్‌కు ట‌ఫ్ టైం ఖ‌మ్మంలో పార్టీని నిల‌బెట్టేది ఎవ‌రు..? మాజీమంత్రినా..? మాజీ ఎంపీనా..? కారు దిగిపోతున్న...

జర్నలిస్టులకు అండగా ప్రజా ప్రభుత్వం

జర్నలిస్టులకు అండగా ప్రజా ప్రభుత్వం అక్రిడిటేషన్లు తగ్గవు… మరింత పెరుగుతాయి జీవో–252లో మార్పులు, సూచనలకు...

ఇరాన్ ఆంక్షల దెబ్బ… బాస్మతి ఎగుమతులకు బ్రేక్

ఇరాన్ ఆంక్షల దెబ్బ… బాస్మతి ఎగుమతులకు బ్రేక్ అమెరికా ఆంక్షలతో ఇరాన్ ఆర్థిక...

జంక్ష‌న్లు జామ్‌

జంక్ష‌న్లు జామ్‌ విజయవాడ జాతీయ రహదారిపై వాహనాల రద్దీ 6 కిలోమీటర్ల మేర నిలిచిపోయిన...

మూసీ ప్రాజెక్టుతో రియ‌ల్ బూమ్‌

మూసీ ప్రాజెక్టుతో రియ‌ల్ బూమ్‌ ప్రాపర్టీ ధరలు హైక్ ! దాదాపు 15 నుండి...

క‌థ‌నం క‌ల‌క‌లం !

క‌థ‌నం క‌ల‌క‌లం ! ఐఏఎస్ అధికారికి, మంత్రికి మధ్య వివాహేతర బంధం ? అత్యంత...

విష‌మిచ్చి చంపండి

విష‌మిచ్చి చంపండి ఇప్ప‌టికే స‌గం చ‌నిపోయా మహిళా అధికారులను వివాదాల్లోకి లాగొద్దు రేటింగ్స్ కోసం మానసిక...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...

రేవంత్ కు కొత్త సవాల్!

* సర్కార్ కు పరీక్షగా సీఎస్ ఎంపిక? * ఈ నెలాఖరున రామకృష్ణారావు...

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం కాక‌తీయ‌, హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లాలోని బాటసింగారంలో...

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన ప్రతిపాదించిన ప్రాజెక్టుపై...

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా న్యూ డిల్లీ జూలై...

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు మొన్న యూనివర్సిటీల్లో ఆందోళనలు నిషేధిస్తూ మెమో నేడు...

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌ కాంగ్రెస్‌ దూత ఫోన్‌ ట్యాపింగ్‌..! గాంధీ...
spot_img

Popular Categories

spot_imgspot_img