కారేపల్లి ప్రెస్ క్లబ్ అధ్యక్షుడిగా భీమవరపు శ్రీనివాసరావు
ప్రధానకార్యదర్శి బానోత్ బాలు నాయక్
కాకతీయ,కారేపల్లి : సింగరేణి (కారేపల్లి) మండల నూతన ప్రెస్ క్లబ్ కమిటీని మంగళవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కారేపల్లి మండల పరిధిలోని ఉసిరికాయలపల్లి శ్రీ కోట మైసమ్మ దేవాలయ ప్రాంగణంలో సీనియర్ జర్నలిస్ట్ దమ్మాలపాటి కృష్ణ ఎన్నికల అధికారిగా వ్యవహరించగా నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కాగా మూడోసారి ప్రెస్ క్లబ్ అధ్యక్షుడుగా భీమవరపు శ్రీనివాసరావు (వెలుగు), ప్రధాన కార్యదర్శిగా బానోత్ బాలు నాయక్ (ఆంధ్రప్రభ), కోశాధికారిగా పాలిక శ్రీనివాస్ (సాక్షి) తో పాటు ఉపాధ్యక్షులుగా ధరావత్ కళ్యాణ్, సహాయ కార్యదర్శిగా కేతిమల్ల సురేష్, గౌరవ అధ్యక్షుడిగా తేల్ల శ్రీనివాసరావు లను సభ్యులంతా కలిసి ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. అనంతరం నూతన ప్రెస్ క్లబ్ గా ఎన్నికైన వారిని తోటి జర్నలిస్టులు ఏపూరి లక్ష్మీనారాయణ, అనంతారపు వెంకటాచారి, పగడాల నాగేశ్వరరావు, కొండపల్లి వెంకటేశ్వర్లు,,ముక్క వెంకటేశ్వర్లు, కొత్తూరు శ్రీనివాసరావు, బాధవత్ రాము నాయక్ లు అభినందించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా నూతన ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు మాట్లాడుతూ జర్నలిస్టుల సమస్యలను పాలకుల ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు తమ వంతు కృషి చేస్తామని పేర్కొన్నారు.


