epaper
Thursday, November 20, 2025
epaper

సజావుగా పంచాయతీ ఎన్నికల నిర్వహణకు సన్నద్ధంగా ఉండాలి

సజావుగా పంచాయతీ ఎన్నికల నిర్వహణకు సన్నద్ధంగా ఉండాలి
రాష్ట్ర ఎన్నికల సంఘం కమీషనర్ రాణి కుముదిని
3 విడతల్లో పంచాయతీ ఎన్నికల నిర్వహణకు ప్రణాళికలు సిద్ధం
గ్రామపంచాయతీ ఎన్నికల సన్నద్ధతపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించిన ఎన్నికల సంఘం కమీషనర్

కాకతీయ, ఖమ్మం ప్రతినిధి: గ్రామపంచాయతీ ఎన్నికలను సజావుగా నిర్వహించేందుకు అధికారులు అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేసి, సన్నద్ధంగా ఉండాలని రాష్ట్ర ఎన్నికల సంఘం కమీషనర్ ఐ. రాణి కుముదిని అన్నారు.
గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణ, ఓటర్ జాబితా తయారీపై రాష్ట్ర ఎన్నికల సంఘం కమీషనర్, జిల్లా కలెక్టర్లతో గురువారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. హైదరాబాద్ నుండి జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి పాల్గొనగా, కలెక్టరేట్ నుంచి పోలీస్ కమీషనర్ సునీల్ దత్, అదనపు కలెక్టర్ డాక్టర్ పి. శ్రీజ లతో కలిసి పాల్గొన్నారు.ఈ సందర్భంగా రాష్ట్ర ఎన్నికల సంఘం కమీషనర్ రాణి కుముదిని మాట్లాడుతూ గ్రామ పంచాయతీ ఎన్నికలు త్వరలో నిర్వహణకు ప్రభుత్వం నిర్ణయించిందని, సజావుగా ఎన్నికలు జరిగేలా జిల్లా యంత్రాంగం చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని అన్నారు. 3 విడతల్లో పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలను కుంటే, ప్రతి ఫేజ్ లో ఏ మండలాలు ఎన్నికలు జరగాలో జిల్లా వారీగా ప్రణాళికలు అందించాలని అన్నారు.

పంచాయతీ తుది ఓటర్ జాబితాకు సంబంధించి ఫిర్యాదులు, అభ్యంతరాలను స్వీకరించి పరిష్కరించి, ప్రతి గ్రామ పంచాయతీకి సంబంధించి పోలింగ్ కేంద్రాలు, ఫోటోలతో కూడిన ఓటర్ జాబితా ప్రచురణకు చర్యలు తీసుకోవాలని అన్నారు.
ఎన్నికల షెడ్యూల్ విడుదలైన తర్వాత ఎంసిసి నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని అన్నారు. ఎంసిసి ఉల్లంఘనపై వచ్చే ప్రతి ఫిర్యాదు పరిష్కారానికి యంత్రాంగం సిద్ధం చేసుకోవాలని అన్నారు.
వీడియో కాన్ఫరెన్స్ అనంతరం స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ డాక్టర్ పి.శ్రీజ అధికారులతో మాట్లాడుతూ  గ్రామ పంచాయతీ, వార్డులకు సంబంధించి రిజర్వేషన్ ప్రక్రియ ఖరారు చేసి చెక్ చేసుకోవాలని, ప్రతి వర్గంలో మహిళలకు రిజర్వేషన్ 50 శాతం అమలు కావాల్సి ఉంటుందని అన్నారు.
ఈ సమావేశంలో  జెడ్పీ సిఈఓ దీక్షా రైనా, జిల్లా పంచాయతి అధికారి ఆశాలత, జెడ్పి డిప్యూటీ సిఇఓ నాగపద్మజ, డివిజనల్ పంచాయతీ అధికారులు విజయలక్ష్మి, రాంబాబు, ఎన్నికల విభాగం సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

నిబంధనలు పాటిస్తేనే ధాన్యం కేటాయింపు

నిబంధనలు పాటిస్తేనే ధాన్యం కేటాయింపు మిల్ల‌ర్ల‌కు అదనపు కలెక్టర్ శ్రీనివాస రెడ్డి హెచ్చ‌రిక‌ రైస్...

హోంగార్డ్ ఉద్యోగుల ఆరోగ్య భీమాపథకంపై అవగాహన సదస్సు

హోంగార్డ్ ఉద్యోగుల ఆరోగ్య భీమాపథకంపై అవగాహన సదస్సు కాకతీయ, ఖమ్మం : హోంగార్డు...

ఎర్త్ సైన్స్ యూనివర్సిటీలో ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా కలెక్టర్

ఎర్త్ సైన్స్ యూనివర్సిటీలో ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ కొత్తగూడెం,...

ఖమ్మం నరగంలో దారుణ హత్య

ఖమ్మం నరగంలో దారుణ హత్య భార్య ను గొంతు కోసి హత్య చేసిన...

పాఠశాలలను పరిశుభ్రంగా ఉంచాలి.

పాఠశాలలను పరిశుభ్రంగా ఉంచాలి. నాణ్యమైన విద్యను అందించడం ఉపాధ్యాయుల లక్ష్యం జూలూరుపాడులో రాష్ట్ర విద్యాశాఖ...

పాల్వంచ‌లో స‌మ‌స్య‌ల తిష్ట‌

పాల్వంచ‌లో స‌మ‌స్య‌ల తిష్ట‌ డ్రైనేజీలు, రోడ్లకు మ‌ర‌మ్మ‌తులు చేప‌ట్టాలి ఎంపీడీవోకు బీఆర్ ఎస్ నేత‌ల...

అటవీ భూమిని కాపాడాలి

అటవీ భూమిని కాపాడాలి ఫారెస్ట్ అధికారుల‌కు డీఎఫ్‌వో కిష్ట‌గౌడ్ సూచ‌న‌ కాకతీయ, జూలూరుపాడు :...

కవులు సమాజ సంపదతో సమానం

కవులు సమాజ సంపదతో సమానం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివ రావు జిల్లా గ్రంథాలయాభివృద్ధికి కృషి కాకతీయ,కొత్తగూడెం...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...

రేవంత్ కు కొత్త సవాల్!

* సర్కార్ కు పరీక్షగా సీఎస్ ఎంపిక? * ఈ నెలాఖరున రామకృష్ణారావు...

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం కాక‌తీయ‌, హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లాలోని బాటసింగారంలో...

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన ప్రతిపాదించిన ప్రాజెక్టుపై...

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా న్యూ డిల్లీ జూలై...

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు మొన్న యూనివర్సిటీల్లో ఆందోళనలు నిషేధిస్తూ మెమో నేడు...

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌ కాంగ్రెస్‌ దూత ఫోన్‌ ట్యాపింగ్‌..! గాంధీ...
spot_img

Popular Categories

spot_imgspot_img