ప్రకృతి వ్యవసాయంపై అవగాన సదస్సు
కాకతీయ, చేర్యాల: ప్రకృతి వ్యవసాయ పద్ధతులపై అవగాహన కలిగి ఉండాలని ఏడిఏ రాధిక స్పష్టం చేశారు. నేషనల్ మిషన్ ఆన్ నేచరల్ ఫార్మింగ్ లో భాగంగా మండలంలోని రాంపూర్ గ్రామం ఎంపిక కావడం జరిగింది. కాగా గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద మంగళవారం రాంపూర్ గ్రామ సర్పంచ్ ఆధ్వర్యంలో రైతులకు దేశీయ విత్తనాలు, ప్రకృతి వ్యవసాయం, రసాయన రహిత పద్ధతులపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఏడిఎ రాధిక మాట్లాడుతూ.. రసాయనాలు లేకుండా పండించిన పంటలను వినియోగించడం ద్వారా ప్రజల ఆరోగ్యం మెరుగుపడుతుందని తెలిపారు. జీవామృతం ఉపయోగించి నేలను సుసంపన్నం చేయాలని అన్నారు. రసాయనిక ఎరువులు, పురుగు మందుల వాడకం పూర్తిగా తగ్గించాలని సూచించారు. రైతులు పండించే పంటల్లో ఎలాంటి హానికరమైన రసాయనాలూ వాడకూడదని, వీటితో క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని తెలిపారు. భావితరాలకు మంచి నేల, ఆరోగ్యం ఇవ్వాలన్నారు. భూమి, గాలి, నీరు కలుషితం కాకుండా చూసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో, గ్రామ సర్పంచి శేట్టే కొమురయ్య, ఏఈఓ, కురుమ సంఘం మండల అధ్యక్షుడు శవల్ల రాజయ్య,పిఎసిఎస్ మాజీ డైరెక్టర్ శెట్టి సిద్ధిరాములు, గ్రామపంచాయతీ పాలకవర్గం సభ్యులు రైతులు పాల్గొన్నారు.


