epaper
Sunday, March 1, 2026
epaper

రేపు కొండగట్టుకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్

రేపు కొండగట్టుకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్
శ్రీ ఆంజనేయ స్వామి దర్శనం
రూ.35.19 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన
జనసేన నేతలు, కార్యకర్తలతో సమావేశాలు

కాకతీయ, కరీంనగర్ బ్యూరో : తెలంగాణలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కొండగట్టులో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రేపు పర్యటించనున్నారు. కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామిని దర్శించుకుని, భక్తుల సౌకర్యార్థం తిరుమల తిరుపతి దేవస్థానాల (టీటీడీ) నిధులతో చేపట్టనున్న ఆలయాభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. అధికారిక షెడ్యూల్ ప్రకారం పవన్ కళ్యాణ్ ఉదయం హైదరాబాద్ మాధాపూర్ నివాసం నుంచి బయలుదేరి బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి హెలికాప్టర్ ద్వారా కొండగట్టు జేఎన్టీయూ హెలిప్యాడ్‌కు చేరుకుని, అనంతరం రోడ్డు మార్గంలో ఆలయానికి వెళ్తారు. ఉదయం 10.30 గంటలకు శ్రీ ఆంజనేయ స్వామి దర్శనం అనంతరం, టీటీడీ ఆధ్వర్యంలో చేపట్టనున్న ఆలయాభివృద్ధి భవన నిర్మాణ పనులకు శంకుస్థాపన చేయనున్నారు.

రూ.35.19 కోట్లతో ఆలయాభివృద్ధి

భక్తుల సౌకర్యార్థం చేపట్టనున్న ఈ అభివృద్ధి పనుల కోసం టీటీడీ రూ.35.19 కోట్ల నిధులను కేటాయించింది. ఈ ప్రాజెక్టుల ద్వారా కొండగట్టుకు వచ్చే భక్తులకు మరింత మెరుగైన వసతులు, మౌలిక సదుపాయాలు అందుబాటులోకి రానున్నాయి. ఆలయాభివృద్ధి దిశగా ఇది కీలక ముందడుగుగా భావిస్తున్నారు. శంకుస్థాపన కార్యక్రమానికి టీటీడీ చైర్మన్ బీ.ఆర్. నాయుడు, ఆంధ్రప్రదేశ్ శాసనమండలి విప్ పిడుగు హరీ ప్రసాద్, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, టీటీడీ బోర్డు సభ్యులు తదితర ప్రముఖులు హాజరుకానున్నారు. శంకుస్థాపన అనంతరం పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ తెలంగాణ రాష్ట్ర నాయకులు, కార్యకర్తలతో సమావేశం కానున్నారు. అలాగే ఇటీవల పంచాయతీ ఎన్నికల్లో జనసేన మద్దతుతో గెలిచిన అభ్యర్థులతో ప్రత్యేక భేటీ నిర్వహించనున్నారు. ఈ సమావేశాన్ని కొడిమ్యాల సమీపంలోని బృందావన్ రిసార్ట్‌లో ఏర్పాటు చేశారు.

కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటన నేపథ్యంలో కొండగట్టులో భద్రతను కట్టుదిట్టం చేశారు. జగిత్యాల జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్, జిల్లా ఎస్పీ అశోక్ కుమార్, ఆలయ ఈవో శ్రీకాంత్ రావు సంబంధిత అధికారులతో కలిసి భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. వెయ్యి మంది పోలీసులతో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసి ఆలయ పరిసరాల్లో గట్టి భద్రతా వలయం అమలు చేస్తున్నారు. పౌర్ణమి సందర్భంగా గిరి ప్రదక్షిణ జరగనుండటంతో భక్తుల రద్దీ భారీగా పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. పవన్ కళ్యాణ్ అభిమానులు, జనసేన కార్యకర్తలు వేల సంఖ్యలో తరలివచ్చే అవకాశాన్ని దృష్టిలో ఉంచుకుని అదనపు భద్రతా చర్యలు కొనసాగిస్తున్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

ఎమ్మెల్యే వ్యాఖ్యలపై రజక సంఘాల ఆగ్రహం

ఎమ్మెల్యే వ్యాఖ్యలపై రజక సంఘాల ఆగ్రహం కరీంనగర్‌లో వీర్లపల్లి శంకర్ దిష్టిబొమ్మ దహనం బాధిత...

లక్ష్మీనరసింహస్వామి కళ్యాణంలో కలెక్టర్ దంపతులు

లక్ష్మీనరసింహస్వామి కళ్యాణంలో కలెక్టర్ దంపతులు పట్టు వస్త్రాలు సమర్పణ కాక‌తీయ‌, జగిత్యాల : ధర్మపురి...

హుజూరాబాద్‌లో బీఆర్‌ఎస్ భూస్థాపితం ఖాయం

హుజూరాబాద్‌లో బీఆర్‌ఎస్ భూస్థాపితం ఖాయం కాంగ్రెస్ నియోజకవర్గ ఇంచార్జి ప్రణవ్ కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలు,...

బండి సంజయ్ ధర్మం తప్పుతున్నారు

బండి సంజయ్ ధర్మం తప్పుతున్నారు బీఆర్‌ఎస్ నగర అధ్యక్షుడు చల్ల హరిశంకర్ రెబల్స్ చేరిక,...

50వ డివిజన్‌ను ఆదర్శంగా తీర్చిదిద్దుతా

50వ డివిజన్‌ను ఆదర్శంగా తీర్చిదిద్దుతా కార్పొరేటర్ బోయినపల్లి ప్రవీణ్ రావు కాక‌తీయ‌, కరీంనగర్ :...

సైన్స్‌పై మ‌క్కువ పెంచుకోవాలి

సైన్స్‌పై మ‌క్కువ పెంచుకోవాలి ప్రశ్నించేత‌త్వం అల‌వ‌ర్చుకోవాలి రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కాకతీయ, రుద్రంగి:...

పెండింగ్ కేసులు త్వరగా పరిష్కరించాలి

పెండింగ్ కేసులు త్వరగా పరిష్కరించాలి ఏసీపీ విజయ్ కుమార్ గంగాధర పోలీస్ స్టేషన్ తనిఖీ కాక‌తీయ‌,...

డ్రైవర్ల చేతుల్లోనే ప్రజల ప్రాణాలు

డ్రైవర్ల చేతుల్లోనే ప్రజల ప్రాణాలు కంటి ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి సిరిసిల్ల ఎస్పీ...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img