కాకతీయ, ఖమ్మం ప్రతినిధి: ఉమ్మడి ఖమ్మం జిల్లా విద్యుత్ శాఖ ఎమ్మార్టీ డివిజనల్ ఇంజనీర్ గా సిరిపురం అంజయ్య మంగళవారం బాధ్యతలు చేపట్టారు. గతంలో ఉమ్మడి ఖమ్మం జిల్లా కన్స్ట్రక్షన్ డీఈ గా పనిచేసిన ఈయన ఉమ్మడి ఖమ్మం జిల్లా ఎంఆర్టి డివిజనల్ ఇంజనీర్ గా బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా జిల్లా స్థాయి కార్యాలయ సిబ్బంది డీఈ హీరా లాల్, ఏడీఈలు ఆనంద్, ఖాదర్ బాబు, బాలాజీ, నాగార్జున, యూనియన్ నాయకులు శాలువాతో సత్కరించి అంజయ్యకు అభినందనలు తెలిపారు.


