epaper
Thursday, January 15, 2026
epaper

సంపద కోసమే వెనుజులాపై అమెరికా దాడి!

సంపద కోసమే వెనుజులాపై అమెరికా దాడి!
ప్రజాస్వామ్యంపై ట్రంప్‌ దండయాత్రను ఖండించాలి
అమెరికా వైఖరిపై దేశవ్యాప్త నిరసనలు అవసరం
కార్పొరేట్ల కోసమే ఎన్ఆర్ఈజీఎస్‌లో మార్పులు
శాసనసభకు రాని వారు రాజీనామా చేయాలి
జనవరి 18న సీపీఐ చారిత్రిక సభ
సీపీఐ జాతీయ కంట్రోల్ కమిషన్ ఛైర్మన్ డా. కె. నారాయణ

కాకతీయ, ఖమ్మం : సంపద కోసమే అమెరికా వెనుజులాపై దాడి చేసిందని, ప్రజాస్వామ్య ప్రభుత్వాలపై ట్రంప్ చేస్తున్న దాడిని యావత్ ప్రజలు ఖండించాలని సీపీఐ జాతీయ కంట్రోల్ కమిషన్ ఛైర్మన్ డా. కె. నారాయణ పిలుపునిచ్చారు. ఆదివారం ఖమ్మంలోని గిరిప్రసాద్ భవన్‌లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. మాదక ద్రవ్యాల సరఫరా పేరిట చేసిన ఆరోపణల్లో ఏమాత్రం నిజం లేదని, వెనుజులాలోని ఆయిల్ సంపదను తమ వశం చేసుకునేందుకే ట్రంప్ అక్కడి అధ్యక్షుడు, ఆయన భార్యను బంధీలుగా చేశారని నారాయణ ఆరోపించారు. ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన ప్రభుత్వంపై చర్చకు అవకాశం ఉన్నా దాన్ని పక్కనబెట్టి ట్రంప్ ప్రపంచ పోలీస్‌లా వ్యవహరిస్తున్నాడన్నారు. గతంలో అణుఆయుధాల పేరుతో ఇరాక్‌పై దాడి చేసి సద్దాం హుస్సేన్‌ను హతమార్చారని, ఆ తర్వాత అణుఆయుధాలపై ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు.

భారత్‌కు ముప్పే
వెనుజులాపై దాడి భారతదేశానికి కూడా నష్టమేనని, ఆయిల్ ఎగుమతుల పేరుతో భవిష్యత్తులో అమెరికా ఒత్తిడి తెచ్చే ప్రమాదం ఉందన్నారు. దీనిపై కేంద్ర ప్రభుత్వం తక్షణమే స్పందించాలని డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్య దేశాలపై విదేశీ శక్తులకు దాడి చేసే హక్కు లేదని స్పష్టం చేశారు. కమ్యూనిస్టుల పోరాట ఫలితంగా వచ్చిన జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో (ఎన్ఆర్ఈజీఎస్) మార్పులు కార్పొరేట్ సంస్థల కోసమే చేస్తున్నారని ఆరోపించారు. 40 కుటుంబాలకు రూ.28 లక్షల కోట్ల రాయితీలు ఇస్తున్న కేంద్ర ప్రభుత్వం, 85 కోట్ల మందికి రూ.10 లక్షల కోట్లు ఖర్చు చేయడానికి జంకుతోందన్నారు. జీఎస్టీ రూపంలో దోపిడీ చేస్తున్న కేంద్రం వెంటనే ఎన్ఆర్ఈజీఎస్ మార్పులను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. శాసనసభను బైకాట్ చేసి వేతనాలు పొందటం ఎలా సాధ్యమవుతుందని ప్రశ్నిస్తూ, సభకు వెళ్లని ప్రజాప్రతినిధులు తక్షణమే రాజీనామా చేయాలన్నారు. ప్రజా సమస్యలపై చర్చించాల్సిన బాధ్యతను విస్మరించారని విమర్శించారు. తెలుగు రాష్ట్రాల మధ్య నీటి వివాదాలపై ముఖ్యమంత్రులు చర్చల ద్వారా పరిష్కారం కనుగొనాలన్నారు.

జనవరి 18న చారిత్రిక సభ
సీపీఐ శతాబ్ది ఉత్సవాల ముగింపు సందర్భంగా జనవరి 18న చారిత్రిక సభ నిర్వహిస్తున్నామని నారాయణ తెలిపారు. లక్షలాది మందితో జరిగే ఈ సభకు దేశ, విదేశీ ప్రతినిధులు హాజరవుతారని, 15 రోజుల పాటు సభలు, సమావేశాలు, సదస్సులతో ప్రచారం కొనసాగుతుందన్నారు. మతోన్మాద శక్తులను అడ్డుకునే శక్తి కమ్యూనిస్టులకే ఉందని, కమ్యూనిస్టులను అంతం చేయడం ఎవరి తరం కాదని స్పష్టం చేశారు. మీడియా సమావేశంలో సీపీఐ జాతీయ సమితి సభ్యులు బాగం హేమంతరావు, జిల్లా కార్యదర్శి దండి సురేష్, రాష్ట్ర సమితి సభ్యులు యర్రాబాబు, ఏపూరి లతాదేవి, సిద్ధినేని కర్ణకుమార్ తదితరులు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

ఖండాంతరాల్లో సిపిఐ శతాబ్ది సంబరం..!

ఖండాంతరాల్లో సిపిఐ శతాబ్ది సంబరం..! విదేశాల్లోనూ ఎగసిన వామపక్ష జెండా ఖమ్మం వామపక్ష కుటుంబాల...

రూ.15 లక్షల గంజాయి ద్రవం పట్టివేత.. ఇద్ద‌రి అరెస్టు..

రూ.15 లక్షల గంజాయి ద్రవం పట్టివేత.. ఇద్ద‌రి అరెస్టు.. ద్విచక్ర వాహనం, రెండు...

రిజర్వేషన్లకు ముందే టికెట్ల యుద్ధం

రిజర్వేషన్లకు ముందే టికెట్ల యుద్ధం * మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో పొలిటికల్ హీట్ *...

చైనా మాంజాలపై ఉక్కుపాదం

చైనా మాంజాలపై ఉక్కుపాదం * విక్రయిస్తే కేసులు తప్పవు * వాహనదారులకు ప్రాణహాని * పక్షుల...

ప్రజావాణి కి అధికారుల డుమ్మా

ప్రజావాణి కి అధికారుల డుమ్మా * 11 దాటినా జాడలేని అధికారులు * 29...

భూసారం కాపాడుకోవడం రైతు బాధ్యత

భూసారం కాపాడుకోవడం రైతు బాధ్యత సాగు ఖర్చులు త‌గ్గితేనే ఆదాయం పెరుగుతుంది అవసరానికి మించి...

స్థానిక సమస్యలకు సీపీఐ(ఎం)తోనే పరిష్కారం

స్థానిక సమస్యలకు సీపీఐ(ఎం)తోనే పరిష్కారం సంస్కృతి–సంప్రదాయాలకు ప్రతీక రంగవల్లికలు సీపీఐ(ఎం) ఖమ్మం డివిజన్ కార్యదర్శి...

నేడు కాంగ్రెస్‌ ముత్యాల ముగ్గుల పోటీలు

నేడు కాంగ్రెస్‌ ముత్యాల ముగ్గుల పోటీలు కొత్తగూడెం ప్రకాశం స్టేడియంలో 3 గంటలకు...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...

రేవంత్ కు కొత్త సవాల్!

* సర్కార్ కు పరీక్షగా సీఎస్ ఎంపిక? * ఈ నెలాఖరున రామకృష్ణారావు...

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం కాక‌తీయ‌, హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లాలోని బాటసింగారంలో...

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన ప్రతిపాదించిన ప్రాజెక్టుపై...

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా న్యూ డిల్లీ జూలై...

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు మొన్న యూనివర్సిటీల్లో ఆందోళనలు నిషేధిస్తూ మెమో నేడు...

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌ కాంగ్రెస్‌ దూత ఫోన్‌ ట్యాపింగ్‌..! గాంధీ...
spot_img

Popular Categories

spot_imgspot_img