epaper
Monday, March 2, 2026
epaper

సంపద కోసమే వెనుజులాపై అమెరికా దాడి!

సంపద కోసమే వెనుజులాపై అమెరికా దాడి!
ప్రజాస్వామ్యంపై ట్రంప్‌ దండయాత్రను ఖండించాలి
అమెరికా వైఖరిపై దేశవ్యాప్త నిరసనలు అవసరం
కార్పొరేట్ల కోసమే ఎన్ఆర్ఈజీఎస్‌లో మార్పులు
శాసనసభకు రాని వారు రాజీనామా చేయాలి
జనవరి 18న సీపీఐ చారిత్రిక సభ
సీపీఐ జాతీయ కంట్రోల్ కమిషన్ ఛైర్మన్ డా. కె. నారాయణ

కాకతీయ, ఖమ్మం : సంపద కోసమే అమెరికా వెనుజులాపై దాడి చేసిందని, ప్రజాస్వామ్య ప్రభుత్వాలపై ట్రంప్ చేస్తున్న దాడిని యావత్ ప్రజలు ఖండించాలని సీపీఐ జాతీయ కంట్రోల్ కమిషన్ ఛైర్మన్ డా. కె. నారాయణ పిలుపునిచ్చారు. ఆదివారం ఖమ్మంలోని గిరిప్రసాద్ భవన్‌లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. మాదక ద్రవ్యాల సరఫరా పేరిట చేసిన ఆరోపణల్లో ఏమాత్రం నిజం లేదని, వెనుజులాలోని ఆయిల్ సంపదను తమ వశం చేసుకునేందుకే ట్రంప్ అక్కడి అధ్యక్షుడు, ఆయన భార్యను బంధీలుగా చేశారని నారాయణ ఆరోపించారు. ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన ప్రభుత్వంపై చర్చకు అవకాశం ఉన్నా దాన్ని పక్కనబెట్టి ట్రంప్ ప్రపంచ పోలీస్‌లా వ్యవహరిస్తున్నాడన్నారు. గతంలో అణుఆయుధాల పేరుతో ఇరాక్‌పై దాడి చేసి సద్దాం హుస్సేన్‌ను హతమార్చారని, ఆ తర్వాత అణుఆయుధాలపై ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు.

భారత్‌కు ముప్పే
వెనుజులాపై దాడి భారతదేశానికి కూడా నష్టమేనని, ఆయిల్ ఎగుమతుల పేరుతో భవిష్యత్తులో అమెరికా ఒత్తిడి తెచ్చే ప్రమాదం ఉందన్నారు. దీనిపై కేంద్ర ప్రభుత్వం తక్షణమే స్పందించాలని డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్య దేశాలపై విదేశీ శక్తులకు దాడి చేసే హక్కు లేదని స్పష్టం చేశారు. కమ్యూనిస్టుల పోరాట ఫలితంగా వచ్చిన జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో (ఎన్ఆర్ఈజీఎస్) మార్పులు కార్పొరేట్ సంస్థల కోసమే చేస్తున్నారని ఆరోపించారు. 40 కుటుంబాలకు రూ.28 లక్షల కోట్ల రాయితీలు ఇస్తున్న కేంద్ర ప్రభుత్వం, 85 కోట్ల మందికి రూ.10 లక్షల కోట్లు ఖర్చు చేయడానికి జంకుతోందన్నారు. జీఎస్టీ రూపంలో దోపిడీ చేస్తున్న కేంద్రం వెంటనే ఎన్ఆర్ఈజీఎస్ మార్పులను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. శాసనసభను బైకాట్ చేసి వేతనాలు పొందటం ఎలా సాధ్యమవుతుందని ప్రశ్నిస్తూ, సభకు వెళ్లని ప్రజాప్రతినిధులు తక్షణమే రాజీనామా చేయాలన్నారు. ప్రజా సమస్యలపై చర్చించాల్సిన బాధ్యతను విస్మరించారని విమర్శించారు. తెలుగు రాష్ట్రాల మధ్య నీటి వివాదాలపై ముఖ్యమంత్రులు చర్చల ద్వారా పరిష్కారం కనుగొనాలన్నారు.

జనవరి 18న చారిత్రిక సభ
సీపీఐ శతాబ్ది ఉత్సవాల ముగింపు సందర్భంగా జనవరి 18న చారిత్రిక సభ నిర్వహిస్తున్నామని నారాయణ తెలిపారు. లక్షలాది మందితో జరిగే ఈ సభకు దేశ, విదేశీ ప్రతినిధులు హాజరవుతారని, 15 రోజుల పాటు సభలు, సమావేశాలు, సదస్సులతో ప్రచారం కొనసాగుతుందన్నారు. మతోన్మాద శక్తులను అడ్డుకునే శక్తి కమ్యూనిస్టులకే ఉందని, కమ్యూనిస్టులను అంతం చేయడం ఎవరి తరం కాదని స్పష్టం చేశారు. మీడియా సమావేశంలో సీపీఐ జాతీయ సమితి సభ్యులు బాగం హేమంతరావు, జిల్లా కార్యదర్శి దండి సురేష్, రాష్ట్ర సమితి సభ్యులు యర్రాబాబు, ఏపూరి లతాదేవి, సిద్ధినేని కర్ణకుమార్ తదితరులు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

ఎస్సీ వర్గీకరణ పోరులో అమరవీరులకు జోహార్లు

ఎస్సీ వర్గీకరణ పోరులో అమరవీరులకు జోహార్లు సింగరేణిలో ఎమ్మార్పీఎస్ గద్దె వద్ద నివాళులు త్యాగాలు...

బొగ్గు–ఇసుక లారీల బీభత్సం..!

బొగ్గు–ఇసుక లారీల బీభత్సం..! మణుగూరు–బయ్యారం రహదారి ధ్వంసం దుమ్ము ధూళితో గిరిజన బిడ్డల అనారోగ్యం ప్రజల...

అదుపుతప్పిన ఇసుక ట్రాక్టర్ – డ్రైవర్ దుర్మరణం

అదుపుతప్పిన ఇసుక ట్రాక్టర్ – డ్రైవర్ దుర్మరణం నాగులవంచ వద్ద తెల్లవారుజామున ప్రమాదం ఓవర్‌టేక్...

వెలుగుమట్ల బాధితులపై ముమ్మర సర్వే

వెలుగుమట్ల బాధితులపై ముమ్మర సర్వే 21 మంది తహశీల్దార్లతో యుద్ధప్రాతిపదికన సర్వే ఖమ్మం జిల్లాకు...

వెలుగుమట్ల బాధితులకు బీఆర్ఎస్ అండ

వెలుగుమట్ల బాధితులకు బీఆర్ఎస్ అండ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర ఆధ్వర్యంలో భోజనాల పంపిణీ కాకతీయ,...

సీఎం రేవంత్ రెడ్డికి సన్మానసభ పోస్టర్ ఆవిష్కరణ

సీఎం రేవంత్ రెడ్డికి సన్మానసభ పోస్టర్ ఆవిష్కరణ కాకతీయ, ఖమ్మం : ఎస్సీ...

భూదాన్ వ్యవహారంలో విపక్షాలే అభాసు

భూదాన్ వ్యవహారంలో విపక్షాలే అభాసు పేదల పేరుతో రాద్ధాంతం చేశారు ఏజెంట్ల మోసాలపై బాధితులకు...

మోదీ పాలనలో దేశానికి ప్రమాదం

మోదీ పాలనలో దేశానికి ప్రమాదం కార్పొరేట్ల కోసమే కేంద్రం విధానాలు సీపీఐ (ఎం) పొలిట్...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img