epaper
Monday, March 2, 2026
epaper

భూ సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు…

భూ సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు…
జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి
రెవెన్యూ సదస్సుల భూ సమస్యల పరిష్కారంపై
వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన జిల్లా కలెక్టర్

కాకతీయ, ఖమ్మం ప్రతినిధి: రెవెన్యూ భూ సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి సంబంధిత అధికారులను హెచ్చరించారు.
రెవిన్యూ సదస్సు దరఖాస్తుల పరిష్కారంపై అదనపు కలెక్టర్ పి. శ్రీనివాస రెడ్డి తో కలిసి, శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సంబంధిత అధికారులతో సమీక్షించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి మాట్లాడుతూ ప్రజలకు ఉన్న భూ సమస్యల పరిష్కారంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని, భూ భారతి దరఖాస్తులు, పెండింగ్ సాదా బైనామా , రెవెన్యూ సదస్సు దరఖాస్తులు యుద్ద ప్రాతిపదికన పరిష్కరించాలని ఆదేశించారు.గతంలో పలు మార్లు సమావేశాలు నిర్వహించి సూచనలు చేసినప్పటికీ కొన్ని మండలాల్లో ఆశించిన పురోగతి లేదని అన్నారు. పెండింగ్ దరఖాస్తుల పరిష్కారం వరకు సెలవుల్లో కూడా అధికారులు పూర్తి స్థాయిలో పని చేయాలని కలెక్టర్ ఆదేశించారు. రెవెన్యూ సమస్యల పరిష్కారంలో అలసత్వం వహిస్తే చర్యలు చేపట్టనున్నట్లు కలెక్టర్ హెచ్చరించారు. ఆన్ లైన్ లో ఉన్న సాదా బైనామా దరఖాస్తుల పరిశీలన వెంటనే ప్రారంభించాలని, డెస్క్ పరిశీలన ద్వారా అనర్హుల దరఖాస్తులను తిరస్కరించి ఆర్డిఓకు ఫార్వార్డ్ చేయాలని అన్నారు. నిబంధనల ప్రకారం అర్హత ఉన్న దరఖాస్తులకు జి.పి.ఓ., ఆర్.ఐ, సర్వేయర్ ద్వారా క్షేత్రస్థాయి పరిశీలన చేయాలని కలెక్టర్ ఆదేశించారు. సాదా బైనామా దరఖాస్తులలో అమ్మకందారుల రికార్డ్ సరిగ్గా లేకపోతే తిరస్కరించాలని, ప్రభుత్వ భూములు, నాలాలు, చెరువు ఎఫ్.టి.ఎల్., బఫర్ జోన్ పరిధిలో భూముల పట్టా కోసం సాదా బైనామా దరఖాస్తులు వస్తే నేరుగా తిరస్కరించవచ్చని, వీటిని డెస్క్ పరిశీలన ద్వారా గుర్తించాలని, ఈ ప్రక్రియ ప్రతి మండలంలో ఆదివారం నాటికి పూర్తి చేయాలని అన్నారు.
ప్రతి భూ సమస్య దరఖాస్తు సంబంధించి తిరస్కరిస్తే కారణాలు స్పష్టంగా తెలియజేస్తూ ఆన్ లైన్ లో నమోదు చేయాలని అన్నారు. మండలాలను ఆకస్మికంగా తనిఖీ చేసే సమయంలో తిరస్కరించిన దరఖాస్తులను ర్యాండంగా చెక్ చేయడం జరుగుతుందని అన్నారు.
రెవెన్యూ సదస్సులలో వచ్చిన సాదా బైనామా దరఖాస్తులు, అసైన్మెంట్ దరఖాస్తులు పక్కన పెట్టి మిగిలిన 16 వేల దరఖాస్తులను ప్రాధాన్యత క్రమంలో పరిష్కరించాలని కలెక్టర్ తెలిపారు.
సమీక్ష లో అదనపు కలెక్టర్ పి. శ్రీనివాస రెడ్డి మాట్లాడుతూ ప్రతి మండల పరిధిలో 2 నుంచి 3 బయోమెట్రిక్ డివైజ్ లు పెట్టుకొని త్వరగా పెండింగ్ దరఖాస్తుల స్క్రూటినీ పూర్తి చేయాలని అన్నారు.
అనంతరం మండలాల వారీగా సాదా బైనామా, రెవెన్యూ సదస్సులు దరఖాస్తుల స్క్రూటినీ సమీక్షిస్తూ పలు సూచనలు చేశారు. ఈ వీడియో సమావేశంలో కల్లూరు నుండి సబ్ కలెక్టర్ అజయ్ యాదవ్, వివిధ మండలాల నుండి తహసీల్దార్లు, కలెక్టరేట్ ఏఓ. కె. శ్రీనివాసరావు, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

ఎస్సీ వర్గీకరణ పోరులో అమరవీరులకు జోహార్లు

ఎస్సీ వర్గీకరణ పోరులో అమరవీరులకు జోహార్లు సింగరేణిలో ఎమ్మార్పీఎస్ గద్దె వద్ద నివాళులు త్యాగాలు...

బొగ్గు–ఇసుక లారీల బీభత్సం..!

బొగ్గు–ఇసుక లారీల బీభత్సం..! మణుగూరు–బయ్యారం రహదారి ధ్వంసం దుమ్ము ధూళితో గిరిజన బిడ్డల అనారోగ్యం ప్రజల...

అదుపుతప్పిన ఇసుక ట్రాక్టర్ – డ్రైవర్ దుర్మరణం

అదుపుతప్పిన ఇసుక ట్రాక్టర్ – డ్రైవర్ దుర్మరణం నాగులవంచ వద్ద తెల్లవారుజామున ప్రమాదం ఓవర్‌టేక్...

వెలుగుమట్ల బాధితులపై ముమ్మర సర్వే

వెలుగుమట్ల బాధితులపై ముమ్మర సర్వే 21 మంది తహశీల్దార్లతో యుద్ధప్రాతిపదికన సర్వే ఖమ్మం జిల్లాకు...

వెలుగుమట్ల బాధితులకు బీఆర్ఎస్ అండ

వెలుగుమట్ల బాధితులకు బీఆర్ఎస్ అండ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర ఆధ్వర్యంలో భోజనాల పంపిణీ కాకతీయ,...

సీఎం రేవంత్ రెడ్డికి సన్మానసభ పోస్టర్ ఆవిష్కరణ

సీఎం రేవంత్ రెడ్డికి సన్మానసభ పోస్టర్ ఆవిష్కరణ కాకతీయ, ఖమ్మం : ఎస్సీ...

భూదాన్ వ్యవహారంలో విపక్షాలే అభాసు

భూదాన్ వ్యవహారంలో విపక్షాలే అభాసు పేదల పేరుతో రాద్ధాంతం చేశారు ఏజెంట్ల మోసాలపై బాధితులకు...

మోదీ పాలనలో దేశానికి ప్రమాదం

మోదీ పాలనలో దేశానికి ప్రమాదం కార్పొరేట్ల కోసమే కేంద్రం విధానాలు సీపీఐ (ఎం) పొలిట్...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img