epaper
Friday, November 14, 2025
epaper

భూ సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు…

భూ సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు…
జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి
రెవెన్యూ సదస్సుల భూ సమస్యల పరిష్కారంపై
వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన జిల్లా కలెక్టర్

కాకతీయ, ఖమ్మం ప్రతినిధి: రెవెన్యూ భూ సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి సంబంధిత అధికారులను హెచ్చరించారు.
రెవిన్యూ సదస్సు దరఖాస్తుల పరిష్కారంపై అదనపు కలెక్టర్ పి. శ్రీనివాస రెడ్డి తో కలిసి, శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సంబంధిత అధికారులతో సమీక్షించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి మాట్లాడుతూ ప్రజలకు ఉన్న భూ సమస్యల పరిష్కారంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని, భూ భారతి దరఖాస్తులు, పెండింగ్ సాదా బైనామా , రెవెన్యూ సదస్సు దరఖాస్తులు యుద్ద ప్రాతిపదికన పరిష్కరించాలని ఆదేశించారు.గతంలో పలు మార్లు సమావేశాలు నిర్వహించి సూచనలు చేసినప్పటికీ కొన్ని మండలాల్లో ఆశించిన పురోగతి లేదని అన్నారు. పెండింగ్ దరఖాస్తుల పరిష్కారం వరకు సెలవుల్లో కూడా అధికారులు పూర్తి స్థాయిలో పని చేయాలని కలెక్టర్ ఆదేశించారు. రెవెన్యూ సమస్యల పరిష్కారంలో అలసత్వం వహిస్తే చర్యలు చేపట్టనున్నట్లు కలెక్టర్ హెచ్చరించారు. ఆన్ లైన్ లో ఉన్న సాదా బైనామా దరఖాస్తుల పరిశీలన వెంటనే ప్రారంభించాలని, డెస్క్ పరిశీలన ద్వారా అనర్హుల దరఖాస్తులను తిరస్కరించి ఆర్డిఓకు ఫార్వార్డ్ చేయాలని అన్నారు. నిబంధనల ప్రకారం అర్హత ఉన్న దరఖాస్తులకు జి.పి.ఓ., ఆర్.ఐ, సర్వేయర్ ద్వారా క్షేత్రస్థాయి పరిశీలన చేయాలని కలెక్టర్ ఆదేశించారు. సాదా బైనామా దరఖాస్తులలో అమ్మకందారుల రికార్డ్ సరిగ్గా లేకపోతే తిరస్కరించాలని, ప్రభుత్వ భూములు, నాలాలు, చెరువు ఎఫ్.టి.ఎల్., బఫర్ జోన్ పరిధిలో భూముల పట్టా కోసం సాదా బైనామా దరఖాస్తులు వస్తే నేరుగా తిరస్కరించవచ్చని, వీటిని డెస్క్ పరిశీలన ద్వారా గుర్తించాలని, ఈ ప్రక్రియ ప్రతి మండలంలో ఆదివారం నాటికి పూర్తి చేయాలని అన్నారు.
ప్రతి భూ సమస్య దరఖాస్తు సంబంధించి తిరస్కరిస్తే కారణాలు స్పష్టంగా తెలియజేస్తూ ఆన్ లైన్ లో నమోదు చేయాలని అన్నారు. మండలాలను ఆకస్మికంగా తనిఖీ చేసే సమయంలో తిరస్కరించిన దరఖాస్తులను ర్యాండంగా చెక్ చేయడం జరుగుతుందని అన్నారు.
రెవెన్యూ సదస్సులలో వచ్చిన సాదా బైనామా దరఖాస్తులు, అసైన్మెంట్ దరఖాస్తులు పక్కన పెట్టి మిగిలిన 16 వేల దరఖాస్తులను ప్రాధాన్యత క్రమంలో పరిష్కరించాలని కలెక్టర్ తెలిపారు.
సమీక్ష లో అదనపు కలెక్టర్ పి. శ్రీనివాస రెడ్డి మాట్లాడుతూ ప్రతి మండల పరిధిలో 2 నుంచి 3 బయోమెట్రిక్ డివైజ్ లు పెట్టుకొని త్వరగా పెండింగ్ దరఖాస్తుల స్క్రూటినీ పూర్తి చేయాలని అన్నారు.
అనంతరం మండలాల వారీగా సాదా బైనామా, రెవెన్యూ సదస్సులు దరఖాస్తుల స్క్రూటినీ సమీక్షిస్తూ పలు సూచనలు చేశారు. ఈ వీడియో సమావేశంలో కల్లూరు నుండి సబ్ కలెక్టర్ అజయ్ యాదవ్, వివిధ మండలాల నుండి తహసీల్దార్లు, కలెక్టరేట్ ఏఓ. కె. శ్రీనివాసరావు, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

సామినేనిని హ‌త్య చేసిందెవ‌రు..??

సామినేనిని హ‌త్య చేసిందెవ‌రు..?? ద‌ర్యాప్తు ఎందుకు ముందుకు సాగ‌డం లేదు..? ర‌క్త‌చ‌రిత్ర‌లో రాజ‌కీయ కోణంపై...

ఎన్ డి ఎ కూటమి విజయం

ఎన్ డి ఎ కూటమి విజయం హర్షం వ్యక్తం చేసిన బీజేపీ మండల...

యువతలో కొత్త జాగృతి ప్రేరణనే చైతన్యం

యువతలో కొత్త జాగృతి ప్రేరణనే చైతన్యం డ్రగ్స్ పై యుద్ధం ముగింపు ర్యాలీ ప్రజల...

భళారే.. యమ

భళారే.. యమ పిల్లల పండుగ రోజున అలరించిన బుడతడు కాకతీయ కొత్తగూడెం రూరల్: బాలల...

ఆయిల్ పామ్ సాగుతో రైతులకు లాభాల పంట…

ఆయిల్ పామ్ సాగుతో రైతులకు లాభాల పంట... రాష్ట్ర వ్యవసాయ,మార్కెటింగ్, సహకార, చేనేత...

కాంగ్రెస్ నాయకుడు మిక్కిలినేని కి మాతృవియోగం

కాంగ్రెస్ నాయకుడు మిక్కిలినేని కి మాతృవియోగం కాకతీయ,ఖమ్మం ప్రతినిధి: జిల్లా కాంగ్రెస్ నాయకుడు,...

టీబీ వ్యాధి పై ప్రతి ఒక్కరికి అవగాహన ఉండాలి

టీబీ వ్యాధి పై ప్రతి ఒక్కరికి అవగాహన ఉండాలి డాక్టర్ దుర్గాభవాని కాకతీయ, పినపాక:...

సమాజ నిర్మాణం తరగతి గదిలోనే రూపుదిద్దుకుంటుంది…

సమాజ నిర్మాణం తరగతి గదిలోనే రూపుదిద్దుకుంటుంది... పిల్లలను స్వేచ్ఛగా వివక్షతరహితంగా పెంచాలి... స్మార్ట్ కిడ్జ్...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...

రేవంత్ కు కొత్త సవాల్!

* సర్కార్ కు పరీక్షగా సీఎస్ ఎంపిక? * ఈ నెలాఖరున రామకృష్ణారావు...

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం కాక‌తీయ‌, హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లాలోని బాటసింగారంలో...

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన ప్రతిపాదించిన ప్రాజెక్టుపై...

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా న్యూ డిల్లీ జూలై...

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు మొన్న యూనివర్సిటీల్లో ఆందోళనలు నిషేధిస్తూ మెమో నేడు...

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌ కాంగ్రెస్‌ దూత ఫోన్‌ ట్యాపింగ్‌..! గాంధీ...
spot_img

Popular Categories

spot_imgspot_img