నామినేషన్ కేంద్రాలను పరిశీలించిన ఏసీపీ వసుంధర యాదవ్
కాకతీయ, ఖమ్మం : గ్రామపంచాయతీ ఎన్నికల నామినేషన్ స్వీకరణ కేంద్రాలను కల్లూరు ఏసీపీ వసుంధర యాదవ్ సందర్శించారు. వెంసూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని వేంసూరు, మర్లపాడు, వెంకటాపురం నామినేషన్ స్వీకరణ కేంద్రాలను సందర్శించి, ఎన్నికల సిబ్బందితో మాట్లాడారు. నామినేషన్ సందర్బంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఏర్పాటు చేసిన పోలీస్ బందోబస్తును పర్యవేక్షించాలని పోలీస్ అధికారులకు సూచించారు.నామినేషన్ కేంద్రాలను పరిశీలించిన ఏసీపీ వసుంధర యాదవ్


