epaper
Thursday, January 15, 2026
epaper

‘పొలం బాట’ పేరుతో వసూళ్ల బాట..

‘పొలం బాట’ పేరుతో వసూళ్ల బాట..
మంగ‌పేట‌లో విద్యుత్ అధికారి ప్రశాంతంగా వసూల్
ట్రాన్స్‌ఫార్మ‌ర్ పెట్టాలంటే డ‌బ్బులివ్వాల్సిందేనంట‌

కాకతీయ, ములుగు ప్రతినిధి : ములుగు జిల్లా మంగపేట మండలం పరిధిలో వ్యవసాయ విద్యుత్ సదుపాయాల పేరుతో అక్రమ వసూళ్లు జోరు పెంచిన కిందిస్థాయి విద్యుత్ శాఖ అధికారి రైతులపై ఆంక్షల కుటీల వల నూను గట్టిగా బిగిస్తున్నాడన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. రైతుల కోసం అమలవుతున్న ‘పొలం బాట’ కార్యక్రమాన్ని తన స్వార్ధ ప్రయోజనాల కోసం ‘వసూళ్ల బాట’గా మలచుకున్నాడనే ఆరోపణలు మండలవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. మంగపేట మండలంలోని ఒక రైతు నుండి కొత్తగా ట్రాన్స్‌ఫార్మర్ ఏర్పాటు, పాత యంత్రాల మార్పిడి, లైన్ల మరమ్మతుల వంటి పనుల పేరుతో లక్షల్లో డబ్బులు వసూలు చేస్తున్నాడని ఆరోపిస్తున్నారు. ఒక ట్రాన్స్‌ఫార్మర్ ఏర్పాటు విషయంలో సరాసరి ₹1.50 లక్షలు వరకు వసూలు చేశాడనే ప్రచారం పెద్ద ఎత్తున సాగుతోంది. సాధారణంగా నామమాత్రపు ఖర్చుతో, ప్రభుత్వ విధానాల ప్రకారం రైతులకు అందాల్సిన సదుపాయాలకే భారీ లావాదేవీలు జరిపించడంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఎవరూ ఏమీ చేయలేరని…

ఇప్పటికే ప్రమోషన్ జాబితాలో ఉన్న తమకై ఎవరూ ఏమీ చేయలేరని, సీఎండీ స్థాయి వరకు పరిచయాలు ఉన్నాయని సదరు ఉద్యోగి సమక్షంలోనే చెప్పుకుంటున్నాడని బాధితులు ఆరోపణలు చేస్తున్నారు. అయితే విద్యుత్ శాఖలో అవినీతి, అక్రమాలకు తావివ్వం, నిరూపితమైనా కఠిన చర్యలే అన్న సీఎండీ హెచ్చరికలున్నప్పటికీ ఈ ఉద్యోగిపై మాత్రం చర్యలు చేపట్టడంలో నిర్లక్ష్యం కనబరుస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. రైతులకు ఉపశమనం కల్పించే ఉద్దేశంతో ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘పొలం బాట’ కార్యక్రమాన్ని వ్యక్తిగత లాభార్జన సాధనంగా మార్చుకోవడం తీవ్ర ఆందోళన కలిగిస్తున్న విషయం. మంగపేట రైతులపై జరిగిందని పేర్కొంటున్న ఈ వసూళ్ల వ్యవహారంపై ఉన్నతాధికారులు తక్షణమే విచారణ జరిపి నిజనిజాలు వెలుగులోకి తేవాలని, అక్రమాలకు పాల్పడిన అధికారిపై కఠిన చర్యలు తీసుకోవాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.రైతుల శ్రేయస్సు కోసం ప్రవేశపెట్టిన కార్యక్రమంలోనే లంచాల నీడ పడుతుండటం బాధాకరం అని స్థానికులు వ్యాఖ్యానిస్తున్నారు. ఈ ఆరోపణలపై విద్యుత్ శాఖ ఉన్నతాధికారులు స్పందించి రైతులకు న్యాయం చేయాలనే ధ్వని వినిపిస్తోంది.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

పల్లె పండుగలో పశువుల పరేడ్‌

పల్లె పండుగలో పశువుల పరేడ్‌ నర్సంపేట సంక్రాంతి సంబరాల్లో జీవ జాతులు గేదెలు,...

గట్టమ్మ ఆల‌యంలో గుడి మెలిగే పండుగ‌

గట్టమ్మ ఆల‌యంలో గుడి మెలిగే పండుగ‌ ఆదివాసీ నాయకపోడు సంప్రదాయాలతో శుద్ధి పండగ...

ఐనవోలు ఆలయం భక్తుల విశ్వాసానికి ప్రతీక

ఐనవోలు ఆలయం భక్తుల విశ్వాసానికి ప్రతీక భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించాలి అధికారులు...

ముగ్గుల పోటీ విజేతలకు బహుమతుల ప్రధానం

ముగ్గుల పోటీ విజేతలకు బహుమతుల ప్రధానం కాకతీయ, దుగ్గొండి: సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని...

యువకులు క్రీడలపై మక్కువ చూపాలి

యువకులు క్రీడలపై మక్కువ చూపాలి ---- ఎస్సై కరుణాకర్ కాకతీయ, ఇనుగుర్తి: యువకులు చెడు...

మున్సిపాలిటీ ఎన్నికల్లో విజయమే లక్ష్యం

మున్సిపాలిటీ ఎన్నికల్లో విజయమే లక్ష్యం డోర్నకల్ అభివృద్ధి బిఆర్ఎస్ హయాంలోనే కాంగ్రెస్ హామీలపై మాజీ...

కాంగ్రెస్ లోకి మాజీ జెడ్పిటిసి పద్మ మేఘ నాయక్

కాంగ్రెస్ లోకి మాజీ జెడ్పిటిసి పద్మ మేఘ నాయక్ - ఎమ్మెల్యే దొంతి...

18 న మేడారానికి సీఎం రేవంత్ రెడ్డి

18 న మేడారానికి సీఎం రేవంత్ రెడ్డి 19న సమ్మక్క–సారలమ్మ గద్దెల పునరుద్ధరణకు...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...

రేవంత్ కు కొత్త సవాల్!

* సర్కార్ కు పరీక్షగా సీఎస్ ఎంపిక? * ఈ నెలాఖరున రామకృష్ణారావు...

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం కాక‌తీయ‌, హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లాలోని బాటసింగారంలో...

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన ప్రతిపాదించిన ప్రాజెక్టుపై...

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా న్యూ డిల్లీ జూలై...

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు మొన్న యూనివర్సిటీల్లో ఆందోళనలు నిషేధిస్తూ మెమో నేడు...

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌ కాంగ్రెస్‌ దూత ఫోన్‌ ట్యాపింగ్‌..! గాంధీ...
spot_img

Popular Categories

spot_imgspot_img