epaper
Saturday, November 15, 2025
epaper

ప్రజావాణి దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలి

  • స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ డాక్టర్ పి. శ్రీజ

కాకతీయ, ఖమ్మం ప్రతినిధి: ప్రజావాణి దరఖాస్తులను పెండింగ్ లో ఉంచకుండా సత్వరమే పరిష్కరించాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ డాక్టర్ పి. శ్రీజ జిల్లా అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్, అదనపు కలెక్టర్ పి. శ్రీనివాస రెడ్డితో కలిసి ప్రజల నుండి అర్జీలను స్వీకరించారు. కొణిజర్ల మండలానికి చెందిన నారీ మహిళా సేవా సంఘం సభ్యులు తమకు స్వయం ఉపాధి కల్పించాలని కోరుతూ దరఖాస్తు చేసుకోగా, జిల్లా గ్రామీణ అభివృద్ధికి అధికారికి రాస్తూ తగు చర్యలు చేపట్టాలని సూచించారు. ఖమ్మం రూరల్ మండలం పల్లెగూడెం గ్రామానికి చెందిన వాకర్స్ సాగర్ కాల్వ పక్కన ఉన్న రహదారి వద్ద ప్రజలు బహిరంగ మలవిసర్జన చేస్తున్నారని, దీనిని నివారించి అక్కడ వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేయాలని కోరుతూ దరఖాస్తు చేసుకోగా, ఖమ్మం రూరల్ ఎంపీడీవో కు రాస్తూ ఓడిఎఫ్ స్టేటస్ చెక్ చేసి అక్కడ అవసరమైన చర్యలు తీసుకోవాలని అదనపు కలెక్టర్ ఆదేశించారు.

తిరుమలాయపాలేం మండలం జింకల గూడానికి చెందిన షేక్ ఇమామ్ సాబ్ 1979 లో ప్రభుత్వం అసైన్మెంట్ భూమి సర్వే నెంబర్ 262 నందు రెండు ఎకరాల ఇరవై గుంటల భూమి ఇచ్చారని, నేటి వరకు ఆ భూమి చూపించ లేదని తనకు న్యాయం చేయాలని కోరుతూ దరఖాస్తు చేసుకున్నారు. సింగరేణి మండలానికి చెందిన కె. సురేష్ తమ ఇంటి స్థలాన్ని కొందరు దౌర్జన్యంగా ఆక్రమించుకుని అక్రమ నిర్మాణాలు చేసుకుంటున్నారని, తమకు న్యాయం చేయాలని కోరుతూ దరఖాస్తు చేసుకోగా డీ.ఎల్.ఎస్.ఏ. కార్యదర్శికి రాస్తూ నిబంధన ప్రకారం చర్యలు తీసుకోవాలని తెలిపారు. పెనుబల్లి మండల కేంద్రం బిసి కాలనీకి చెందిన జి. కళావతి గ్రామ పంచాయతీ కార్యాలయంలో 1998 నుంచి స్వీపర్ గా పని చేస్తున్నానని, తనకు మే నెలలో 9500 జీతం వచ్చిందని, జూన్ నెల నుంచి తనతో వెట్టి చాకిరి చేయించుకుని రూ.3వేలు ఇస్తామని పంచాయతీ కార్యదర్శి బెదిరిస్తున్నారని, తనకు పూర్తి జీతం ఇప్పించాలని కోరుతూ దరఖాస్తు చేసుకోగా, ఎంపిడిఓ పెనుబల్లికి రాస్తూ విచారణ చేసి చర్యలు చేపట్టాలని అదనపు కలెక్టర్ ఆదేశించారు. ప్రజావాణి కార్యక్రమంలో డీఆర్ఓ ఏ. పద్మశ్రీ, జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

సామినేనిని హ‌త్య చేసిందెవ‌రు..??

సామినేనిని హ‌త్య చేసిందెవ‌రు..?? ద‌ర్యాప్తు ఎందుకు ముందుకు సాగ‌డం లేదు..? ర‌క్త‌చ‌రిత్ర‌లో రాజ‌కీయ కోణంపై...

ఎన్ డి ఎ కూటమి విజయం

ఎన్ డి ఎ కూటమి విజయం హర్షం వ్యక్తం చేసిన బీజేపీ మండల...

యువతలో కొత్త జాగృతి ప్రేరణనే చైతన్యం

యువతలో కొత్త జాగృతి ప్రేరణనే చైతన్యం డ్రగ్స్ పై యుద్ధం ముగింపు ర్యాలీ ప్రజల...

భళారే.. యమ

భళారే.. యమ పిల్లల పండుగ రోజున అలరించిన బుడతడు కాకతీయ కొత్తగూడెం రూరల్: బాలల...

ఆయిల్ పామ్ సాగుతో రైతులకు లాభాల పంట…

ఆయిల్ పామ్ సాగుతో రైతులకు లాభాల పంట... రాష్ట్ర వ్యవసాయ,మార్కెటింగ్, సహకార, చేనేత...

కాంగ్రెస్ నాయకుడు మిక్కిలినేని కి మాతృవియోగం

కాంగ్రెస్ నాయకుడు మిక్కిలినేని కి మాతృవియోగం కాకతీయ,ఖమ్మం ప్రతినిధి: జిల్లా కాంగ్రెస్ నాయకుడు,...

టీబీ వ్యాధి పై ప్రతి ఒక్కరికి అవగాహన ఉండాలి

టీబీ వ్యాధి పై ప్రతి ఒక్కరికి అవగాహన ఉండాలి డాక్టర్ దుర్గాభవాని కాకతీయ, పినపాక:...

సమాజ నిర్మాణం తరగతి గదిలోనే రూపుదిద్దుకుంటుంది…

సమాజ నిర్మాణం తరగతి గదిలోనే రూపుదిద్దుకుంటుంది... పిల్లలను స్వేచ్ఛగా వివక్షతరహితంగా పెంచాలి... స్మార్ట్ కిడ్జ్...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...

రేవంత్ కు కొత్త సవాల్!

* సర్కార్ కు పరీక్షగా సీఎస్ ఎంపిక? * ఈ నెలాఖరున రామకృష్ణారావు...

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం కాక‌తీయ‌, హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లాలోని బాటసింగారంలో...

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన ప్రతిపాదించిన ప్రాజెక్టుపై...

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా న్యూ డిల్లీ జూలై...

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు మొన్న యూనివర్సిటీల్లో ఆందోళనలు నిషేధిస్తూ మెమో నేడు...

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌ కాంగ్రెస్‌ దూత ఫోన్‌ ట్యాపింగ్‌..! గాంధీ...
spot_img

Popular Categories

spot_imgspot_img