- ఆన్లైన్ ఓపెన్ హౌస్ ప్రారంభించిన సీపీ
కాకతీయ, ఖమ్మం ప్రతినిధి: శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా పోలీసులు ఉపయోగించే ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతోనే నేరాలు నియంత్రణలో ఉన్నాయని పోలీస్ కమిషనర్ సునీల్ దత్ అన్నారు. పోలీస్ అమరవీరులసంస్మరణ దినోత్సవాలను (ఫ్లాగ్ డే) పురస్కారించుకొని సిటీ ఆర్ముడ్ పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో మంగళవారం ఏర్పాటు చేసిన ఆన్లైన్ ఓపెన్ హౌస్ కార్యక్రమాన్ని ఆయన ప్రారభించారు. పోలీసులు వినియోగించే ఫింగర్ ప్రింట్ యూనిట్, బాంబ్ డిస్పోజల్, పోలీస్ జగిలాలు శ్రమించే తీరు, పనివిధానం, సైబర్ నేరాలను పసిగట్టే విధానాలు, బ్రీత్ ఎనలైజర్స్ తదితరాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. చోరీలు, హత్యలు మాదకద్రవ్యాలను జాగిలాలు నేరగాళ్లను గుర్తించే విధానం, బాంబులు కనిపెట్టే తీరు తదితరాల ప్రదర్శన విద్యార్థులను ఆశ్చర్యచకితులను చేసింది. డాగ్ స్క్వాడ్ విన్యాసాలు అలరించాయి. అమరవీరుల సంస్మరణ దినం ఔన్నత్యాన్ని వివరించారు. కార్యక్రమంలో ఏఆర్ అడిషనల్ డీసీపీ కుమారస్వామి, ఏసీపీలు నర్సయ్య, సుశీల్ సింగ్, ఆర్ఐ కామరాజు, శ్రీశైలం, సురేష్, సాంబశివరావు, క్లూస్ టీమ్ ఇన్స్పెక్టర్ నరేష్, ఐటీ కోర్ టీమ్ హేమనాధ్ పాల్గొన్నారు.


