epaper
Thursday, January 15, 2026
epaper

నిర్వాసిత గ్రామాలను అభివృద్ధి చేయాలి

  • బీటీపీఎస్ నిధులను నిర్వాసిత గ్రామాల పురోగతికి ఉపయోగించాలి
  • సీపీఐ (ఎంఎల్) మాస్ లైన్ మణుగూరు డివిజన్ కార్యదర్శి మధుసూదన్ రెడ్డి

కాకతీయ, మణుగూరు :బీటీపీఎస్ నిధులను నిర్వాసిత గ్రామాల అభివృద్ధికి ఉపయోగించాలని, సత్వరమే మౌలిక సమస్యలను పరిష్కరించాలని సీపీఐ (ఎంఎల్) మాస్ లైన్ మణుగూరు డివిజన్ కార్యదర్శి ఆర్.మధుసూదన్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అంగట్లో అన్ని ఉన్నా అల్లుడు నోట్లో శని ఉన్నట్లు కోట్లాది రూపాయల బీటీపీఎస్, సీఎస్ఆర్ నిధులు వస్తున్నా.. నిర్వాసిత గ్రామాలలో సరైన మౌలిక సదుపాయాలు లేవని వాపోయారు. ఒకప్పుడు పచ్చని పైరులతో, ప్రశాంత వాతావరణంలో ఉన్న నిర్వాసిత గ్రామాలు నేడు దుమ్ము, ధూళితో దర్శనమిస్తున్నాయన్నారు. వాతావరణ కాలుష్యంతో ప్రజలు అనారోగ్యాల పాలవుతున్నారన్నారు.

నిర్వాసిత గ్రామాల ప్రజలు ఎన్నో సమస్యలతో ఇబ్బంది పడుతున్నా.. నిర్వాసిత గ్రామాల అభివృద్ధి పట్ల ప్రభుత్వం, ప్రభుత్వ అధికారులు నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారన్నారు. బీటీపీఎస్, సీఎస్ఆర్ నిధి కింద సుమారు రూ.20 కోట్లు ఇప్పటివరకు చెల్లించారు. కానీ ఈ నిధులు నిర్వాసిత గ్రామాల అభివృద్ధికి ఉపయోగించకుండా దారి మళ్ళించడం వలన నిర్వాసిత గ్రామాలు అభివృద్ధికి నోచుకోవడం లేదన్నారు. బీటీపీఎస్ నుండి మణుగూరు వరకు రోజు వందలాది బొగ్గు టిప్పర్లు తిరుగుతూ రోడ్డు గుంతల మయంగా మారిందన్నారు. ఇప్పటికే తమ పార్టీ ఆధ్వర్యంలో కరపత్రాలు, గ్రూప్ మీటింగ్స్ ద్వారా నిర్వాసిత గ్రామాలలో సమస్యలపై విస్తృత ప్రచారం నిర్వహించి ఆందోళనకు సిద్ధం చేస్తున్నామని తెలిపారు. ఇప్పటికైనా ప్రభుత్వం, అధికారులు వెంటనే స్పందించి, సమస్యలను పరిష్కరించాలన్నారు. కార్యక్రమాల్లో నాయకులు కురసం రామకృష్ణ, ఇందారపు వెంకట్ నర్సయ్య, అలవాల సమ్మన్న, పబ్బతి అనిల్, ముషిక లక్ష్మణ్, రావులపల్లి ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

ఖండాంతరాల్లో సిపిఐ శతాబ్ది సంబరం..!

ఖండాంతరాల్లో సిపిఐ శతాబ్ది సంబరం..! విదేశాల్లోనూ ఎగసిన వామపక్ష జెండా ఖమ్మం వామపక్ష కుటుంబాల...

రూ.15 లక్షల గంజాయి ద్రవం పట్టివేత.. ఇద్ద‌రి అరెస్టు..

రూ.15 లక్షల గంజాయి ద్రవం పట్టివేత.. ఇద్ద‌రి అరెస్టు.. ద్విచక్ర వాహనం, రెండు...

రిజర్వేషన్లకు ముందే టికెట్ల యుద్ధం

రిజర్వేషన్లకు ముందే టికెట్ల యుద్ధం * మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో పొలిటికల్ హీట్ *...

చైనా మాంజాలపై ఉక్కుపాదం

చైనా మాంజాలపై ఉక్కుపాదం * విక్రయిస్తే కేసులు తప్పవు * వాహనదారులకు ప్రాణహాని * పక్షుల...

ప్రజావాణి కి అధికారుల డుమ్మా

ప్రజావాణి కి అధికారుల డుమ్మా * 11 దాటినా జాడలేని అధికారులు * 29...

భూసారం కాపాడుకోవడం రైతు బాధ్యత

భూసారం కాపాడుకోవడం రైతు బాధ్యత సాగు ఖర్చులు త‌గ్గితేనే ఆదాయం పెరుగుతుంది అవసరానికి మించి...

స్థానిక సమస్యలకు సీపీఐ(ఎం)తోనే పరిష్కారం

స్థానిక సమస్యలకు సీపీఐ(ఎం)తోనే పరిష్కారం సంస్కృతి–సంప్రదాయాలకు ప్రతీక రంగవల్లికలు సీపీఐ(ఎం) ఖమ్మం డివిజన్ కార్యదర్శి...

నేడు కాంగ్రెస్‌ ముత్యాల ముగ్గుల పోటీలు

నేడు కాంగ్రెస్‌ ముత్యాల ముగ్గుల పోటీలు కొత్తగూడెం ప్రకాశం స్టేడియంలో 3 గంటలకు...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...

రేవంత్ కు కొత్త సవాల్!

* సర్కార్ కు పరీక్షగా సీఎస్ ఎంపిక? * ఈ నెలాఖరున రామకృష్ణారావు...

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం కాక‌తీయ‌, హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లాలోని బాటసింగారంలో...

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన ప్రతిపాదించిన ప్రాజెక్టుపై...

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా న్యూ డిల్లీ జూలై...

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు మొన్న యూనివర్సిటీల్లో ఆందోళనలు నిషేధిస్తూ మెమో నేడు...

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌ కాంగ్రెస్‌ దూత ఫోన్‌ ట్యాపింగ్‌..! గాంధీ...
spot_img

Popular Categories

spot_imgspot_img