epaper
Saturday, November 15, 2025
epaper

పేదల సంక్షేమమే ప్రజా ప్రభుత్వం ఎజెండా

  • రాష్ట్ర రెవెన్యూ, సమాచార, గృహ నిర్మాణ శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి
  • గత 21 నెలల్లో రూ.12. 47 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టాం
  • రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి

కాకతీయ, ఖమ్మం రూరల్ : పేద ప్రజల అభివృద్ధి, సంక్షేమమే ఎజెండాగా ప్రభుత్వ పాలన సాగిస్తుందని రాష్ట్ర రెవెన్యూ, సమాచార పౌరసంబంధాల, గృహ నిర్మాణ శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి అన్నారు. ఆదివారం మంత్రి, జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టితో కలిసి ఏదులాపురం మున్సిపాలిటీలోని చిన్న వెంకటగిరి ప్రాంతంలో ఖమ్మం, కోదాడ ఆర్ అండ్ బి రోడ్డు నుంచి జి ప్లస్2 కాలనీ వరకు ప్రతిపాదించిన బీటీ రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ ఖమ్మం, కోదాడ ఆర్ అండ్ బి రోడ్డు నుంచి జిప్లస్2 కాలనీ వయా ఇందిరమ్మ కాలనీ ఫేజ్ 2 వరకు బీటీ రోడ్డును కోటి 71 లక్షలతో శంకుస్థాపన చేసుకున్నామని చెప్పారు.

ఇందిరమ్మ ప్రభుత్వం హయాంలో ఏదులాపురం మున్సిపాలిటీ  పరిధిలో కోటి 53 లక్షలతో అంతర్గత సిసి రోడ్లు, రూ.2 కోట్ల 65 లక్షలతో మినీ స్టేడియం నిర్మిస్తున్నామని, మంచినీటి సరఫరా కోసం సుమారు రూ.10 లక్షలు ఖర్చు చేశామని తెలిపారు. వెంకటగిరి ఆర్ అండ్ బి రోడ్డు నుండి ఖమ్మం కోదాడ ఆర్ అండ్ బి రోడ్డు వయా జంగాల కాలనీ వరకు కోటి 32 లక్షలతో, ప్రకాష్ నగర్ బ్రిడ్జి నుంచి ఖమ్మం కోదాడ ఆర్ అండ్ బి రోడ్డు వయా కోట నారాయణపురం ఇందిరమ్మ కాలనీ వరకు 2 కోట్ల 50 లక్షల రూపాయలతో, వెంకటగిరి ఎస్సీ, బిసి కాలనీ నుండి గుదిమల్ల వరకు 2 కోట్ల 4 లక్షలతో మంజూరు చేసామని, వీటికి త్వరలోనే శంకుస్థాపన చేస్తామని అన్నారు. గడిచిన 21 నెలల్లో ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలో రూ.12.47 కోట్లతో వివిధ అభివృద్ధి కార్యక్రమాలు చేశామని తెలిపారు.

పేద విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందించేందుకు డైట్ చార్జీలు 40 శాతం, పిల్లలకు కాస్మోటిక్ ఛార్జీలను 200 శాతం పెంచామన్నారు. అర్హులైన పేదలందరికీ మరో మూడు విడతలలో రాజకీయాలకతీతంగా సొంత ఇండ్లు ఉండే విధంగా ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తామని అన్నారు.
జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి మాట్లాడుతూ..  కోటి 71 లక్షల రూపాయలతో బీటీ రోడ్డు నిర్మాణ పనులకు నేడు శంకుస్థాపన చేసుకుంటున్నామని, దీని వల్ల ఇందిరమ్మ కాలనీలోని వందలాది కుటుంబాలకు ఖమ్మం, కోదాడ రోడ్డు కనెక్టివిటీ వస్తుందని అన్నారు. మంత్రి సహకారంతో ఏదులాపురం మున్సిపాలిటీలో అదనపు నిధులు మంజూరు చేసుకుంటూ కొత్తగా ఏర్పడ్డ మున్సిపాలిటీలో అదనపు సౌకర్యాలైన డ్రైయిన్, త్రాగునీరు, అంతర్గత రోడ్ల కల్పనకు చర్యలు తీసుకుంటామని అన్నారు. కార్యక్రమ అనంతరం అక్కడే గతంలో చేపట్టి, నిర్మాణం పూర్తి కాని ఇందిరమ్మ ఇళ్ళను పరిశీలించారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ హరినాథ్ బాబు, ఖమ్మం ఆర్డీవో నర్సింహారావు, పాలేరు నియోజకవర్గ ప్రత్యేక అధికారి రమేష్, ఏదులాపురం మునిసిపల్ కమిషనర్ ఏ. శ్రీనివాస రెడ్డి, ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

సామినేనిని హ‌త్య చేసిందెవ‌రు..??

సామినేనిని హ‌త్య చేసిందెవ‌రు..?? ద‌ర్యాప్తు ఎందుకు ముందుకు సాగ‌డం లేదు..? ర‌క్త‌చ‌రిత్ర‌లో రాజ‌కీయ కోణంపై...

ఎన్ డి ఎ కూటమి విజయం

ఎన్ డి ఎ కూటమి విజయం హర్షం వ్యక్తం చేసిన బీజేపీ మండల...

యువతలో కొత్త జాగృతి ప్రేరణనే చైతన్యం

యువతలో కొత్త జాగృతి ప్రేరణనే చైతన్యం డ్రగ్స్ పై యుద్ధం ముగింపు ర్యాలీ ప్రజల...

భళారే.. యమ

భళారే.. యమ పిల్లల పండుగ రోజున అలరించిన బుడతడు కాకతీయ కొత్తగూడెం రూరల్: బాలల...

ఆయిల్ పామ్ సాగుతో రైతులకు లాభాల పంట…

ఆయిల్ పామ్ సాగుతో రైతులకు లాభాల పంట... రాష్ట్ర వ్యవసాయ,మార్కెటింగ్, సహకార, చేనేత...

కాంగ్రెస్ నాయకుడు మిక్కిలినేని కి మాతృవియోగం

కాంగ్రెస్ నాయకుడు మిక్కిలినేని కి మాతృవియోగం కాకతీయ,ఖమ్మం ప్రతినిధి: జిల్లా కాంగ్రెస్ నాయకుడు,...

టీబీ వ్యాధి పై ప్రతి ఒక్కరికి అవగాహన ఉండాలి

టీబీ వ్యాధి పై ప్రతి ఒక్కరికి అవగాహన ఉండాలి డాక్టర్ దుర్గాభవాని కాకతీయ, పినపాక:...

సమాజ నిర్మాణం తరగతి గదిలోనే రూపుదిద్దుకుంటుంది…

సమాజ నిర్మాణం తరగతి గదిలోనే రూపుదిద్దుకుంటుంది... పిల్లలను స్వేచ్ఛగా వివక్షతరహితంగా పెంచాలి... స్మార్ట్ కిడ్జ్...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...

రేవంత్ కు కొత్త సవాల్!

* సర్కార్ కు పరీక్షగా సీఎస్ ఎంపిక? * ఈ నెలాఖరున రామకృష్ణారావు...

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం కాక‌తీయ‌, హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లాలోని బాటసింగారంలో...

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన ప్రతిపాదించిన ప్రాజెక్టుపై...

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా న్యూ డిల్లీ జూలై...

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు మొన్న యూనివర్సిటీల్లో ఆందోళనలు నిషేధిస్తూ మెమో నేడు...

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌ కాంగ్రెస్‌ దూత ఫోన్‌ ట్యాపింగ్‌..! గాంధీ...
spot_img

Popular Categories

spot_imgspot_img