రెండు ఆర్టీసీ బస్సులు ఎదురు ఎదురుగా ఢీ..
కాకతీయ,మణుగూరు/బూర్గంపాడు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం సారపాక గ్రామంలో రెండు ఆర్టీసీ బస్సులు ఎదురుగా ఢీకొన్నాయి.శుక్రవారం ఉదయం సారపాక మూలమలుపు వద్ద ఎదురెదురుగా ఆర్టీసీ బస్సులు ఢీకొనగా బస్సులో ప్రయాణిస్తున్న పలువురికి గాయాలు అయ్యాయి
.భద్రాచలం నుండి ఖమ్మంకి వెళ్తున్న బస్సు,ఖమ్మం నుండి భద్రాచలం నుంచి వస్తున్న బస్సు ఢీ కొన్నాయి.గాయాల పాలైన వ్యక్తులను 108 ద్వారా స్థానిక భద్రాచలం ప్రభుత్వ హాస్పిటల్ కు తరలించారు.ఈ ప్రమాదంపై పూర్తిస్థాయి వివరాలు తెలియాల్సి ఉంది.


