epaper
Sunday, March 1, 2026
epaper

స్థానిక ఎన్నికలకు షెడ్యూల్ విడుదల.. ఈ ఎన్నికల్లో పోటీ చేసేందుకు అర్హులెవరు? అనర్హులెవరు?

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ రాష్ట్రంలో గ్రామీణ స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్‌ను రాష్ట్ర ఎన్నికల సంఘం ఇటీవల ప్రకటించింది. దీంతో పల్లెల్లో ఎన్నికల వాతావరణం నెలకొంది. ఎక్కడ చూసినా రాజకీయ చర్చలు, అభ్యర్థుల ఎంపికపై ఆసక్తికర చర్చలు జరుగుతున్నాయి. పల్లె వాతావరణం పండుగలా మారి ఎన్నికల సందడి మొదలైంది.

స్థానిక సంస్థల ఎన్నికల్లో అభ్యర్థుల అర్హతలకు సంబంధించి కొన్ని ముఖ్యమైన నిబంధనలు అమల్లో ఉన్నాయి. 1994లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేసిన చట్టం ప్రకారం, ఇద్దరికంటే ఎక్కువ మంది పిల్లలు కలిగిన వారు పంచాయతీరాజ్ సంస్థల ఎన్నికల్లో పోటీ చేయడానికి అనర్హులుగా ప్రకటించబడ్డారు. ఈ చట్టం 1995 మే 31 నుంచి అమల్లోకి వచ్చింది. అంటే ఆ తేదీ తరువాత ముగ్గురికి మించిన పిల్లలు కలిగినవారు స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసే హక్కును కోల్పోయారు. అయితే కొన్ని ప్రత్యేక సందర్భాలను మాత్రం చట్టం అనుమతిస్తోంది. 1995 మే 31 నాటికి ఇప్పటికే ముగ్గురు పిల్లలు ఉన్నవారు, చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత కవలలు పుట్టిన వారు, ఒక కాన్పులోనే ముగ్గురు పిల్లలు పుట్టిన వారు పోటీ చేయడానికి అనుమతించబడ్డారు. ఈ నిబంధన తెలంగాణలో ఇప్పటికీ అమల్లో ఉండగా, ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం 2024 డిసెంబర్ 19 నుంచి ఈ పరిమితిని ఎత్తివేశారు.

ఎన్నికల షెడ్యూల్ వెలువడటంతో పల్లెల్లో పండుగలా సందడి మొదలైంది. విజయదశమి సమయానికే ఎన్నికల ప్రకటన రావడంతో దానిని ‘ఎన్నికల పండగ’గా పేర్కొంటున్నారు. ఇప్పటికే రిజర్వేషన్లు ప్రకటించడంతో అభ్యర్థుల పేర్లపై ఊహాగానాలు జోరందుకున్నాయి. ప్రధాన రాజకీయ పార్టీలు బలమైన అభ్యర్థులను ఎంపిక చేయడంలో మునిగిపోయాయి. అభ్యర్థుల సామాజిక సమీకరణం, ఆర్థిక స్థితి, స్థానిక బలాబలాలు వంటి అంశాలను పరిశీలిస్తూ అభ్యర్థుల ఎంపిక జరుగుతోంది. మరోవైపు, ఆశావహులు పండుగ వేళల్లో బలప్రదర్శనకు సన్నద్ధమవుతున్నారు. దసరా ఉత్సవాల్లో భాగంగా సాంస్కృతిక కార్యక్రమాలు, విందులు, రావణవధ వేడుకలు కూడా ఎన్నికల వాతావరణాన్ని మరింత ఉత్సాహంగా మార్చుతున్నాయి.

స్థానిక సంస్థల ఎన్నికలు రెండు విడతల్లో జరగనున్నాయి. అక్టోబర్ 9 నుంచి ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల తొలి విడత నామినేషన్ల స్వీకరణ ప్రారంభమవుతుంది. రెండో విడత నామినేషన్లు అక్టోబర్ 13 నుంచి స్వీకరించనున్నారు. తొలి విడత పోలింగ్ అక్టోబర్ 23న, రెండో విడత పోలింగ్ అక్టోబర్ 27న జరగనుంది. నవంబర్ 11న ఓట్ల లెక్కింపు జరుగుతుంది.

గ్రామపంచాయతీ ఎన్నికలు మూడు విడతల్లో నిర్వహించబడతాయి. అక్టోబర్ 17న తొలి విడత నోటిఫికేషన్ వెలువడుతుంది. అక్టోబర్ 17 నుంచి 19 వరకు నామినేషన్లు స్వీకరించి, అక్టోబర్ 31న పోలింగ్ నిర్వహిస్తారు. రెండో విడత నోటిఫికేషన్ అక్టోబర్ 21న విడుదల అవుతుంది. అక్టోబర్ 21 నుంచి 23 వరకు నామినేషన్లు స్వీకరించి, నవంబర్ 4న రెండో విడత పోలింగ్ జరుగుతుంది. మూడో విడత నోటిఫికేషన్ అక్టోబర్ 25న జారీ చేసి, అక్టోబర్ 25 నుంచి 27 వరకు నామినేషన్లు స్వీకరించి, నవంబర్ 8న పోలింగ్ నిర్వహించనున్నారు.

ఎన్నికల ప్రకటన వెలువడటంతో తెలంగాణ పల్లెల్లో రాజకీయ జోరంతా కొత్త ఉత్సాహాన్ని నింపింది. అభ్యర్థుల ఎంపిక, పండుగ వేడుకలు, పార్టీల వ్యూహాలు కలిపి గ్రామాల్లో ఎన్నికల వాతావరణం పండగలా మారింది. రాబోయే రోజుల్లో ఈ ఎన్నికల తుఫాను రాష్ట్ర రాజకీయ రంగాన్ని మరింత వేడెక్కించడం ఖాయం.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

ఉద్యోగం ఉన్న‌ట్టా..?లేన‌ట్టా..?

ఉద్యోగం ఉన్న‌ట్టా..?లేన‌ట్టా..? ప‌నిచేస్తున్న‌ట్టా..? చేయ‌డం లేద‌న్న‌ట్టా..?! త్రిశంకు స్వ‌ర్గంలో భూ భార‌తి స‌ర్వేయ‌ర్లు వ‌ర్క ఆర్డ‌ర్...

భూ భారతి కాదు…భూ దోపిడీ!

భూ భారతి కాదు…భూ దోపిడీ! కాంగ్రెస్ నేతలు, అధికారుల జేబులు నింపడానికే కొత్త...

నియో పోలీస్‌కు నీటి భరోసా!

నియో పోలీస్‌కు నీటి భరోసా! జలమండలికి 3.95 ఎకరాల భూమి కేటాయింపు గ్రావిటీ విధానంలో...

ఇక రవీంద్రభారతిలో ఆన్‌లైన్ బుకింగ్‌లు

ఇక రవీంద్రభారతిలో ఆన్‌లైన్ బుకింగ్‌లు నూతన వెబ్‌సైట్‌ను ఆవిష్కరించిన మంత్రి జూపల్లి కృష్ణారావు ఇంటి...

కానిస్టేబుల్ సౌమ్య కుటుంబానికి ఎక్సైజ్ విశ్రాంత ఉద్యోగుల ఆసరా

కానిస్టేబుల్ సౌమ్య కుటుంబానికి ఎక్సైజ్ విశ్రాంత ఉద్యోగుల ఆసరా ఒక రోజు పెన్షన్‌తో...

కుమ్మెర ఘటనపై డీజీపీని కలిసిన జాగృతి ప్రతినిధులు

కుమ్మెర ఘటనపై డీజీపీని కలిసిన జాగృతి ప్రతినిధులు చిన్నారి మరణానికి కారణమైన వారిపై...

పేదల ఇండ్లు కూల్చడం అమానుషం

పేదల ఇండ్లు కూల్చడం అమానుషం కాంగ్రెస్ పాలనలో క‌క్షపూరిత విధానాలు కొనసాగుతున్నాయి మాజీ మంత్రి...

జీపీలకు రూ.389 కోట్లు.. ఉద్యోగులకు రూ.745 కోట్లు విడుదల

జీపీలకు రూ.389 కోట్లు.. ఉద్యోగులకు రూ.745 కోట్లు విడుదల పెండింగ్ బిల్లుల చెల్లింపుకు...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img