- ఫ్రెండ్స్ సేవా ఆర్గనైజేషన్ అధ్యక్షుడు అస్మద్
కాకతీయ, కొత్తగూడెం : అన్ని దానాల్లోకల్లా రక్తదానం గొప్పదని, రక్తదానం ప్రాణదానంతో సమానం అని ప్రెండ్స్ సేవా ఆర్గనైజేషన్ అధ్యక్షుడు అస్మద్ అన్నారు. జాతీయ వాలంటరీ రక్తదాన దినోత్సవాన్ని పురస్కరించుకుని బుధవారం కొత్తగూడెం ప్రభుత్వ ఆసుపత్రిలో నిర్వహించిన శిబిరంలో ఆర్గనైజేషన్ సభ్యులతో కలిసి రక్తదానం చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రక్తదానం వల్ల వేలాది మంది జీవితాలను కాపాడడమే కాదు, అనేక వ్యాధుల బారిన పడిన మరెంతో మంది ప్రాణాలను కాపాడటానికి, అనేక వ్యాధులతో పోరాడటానికి వారికి సహాయం చేస్తుందన్నారు. ప్రజలు తమ రక్తాన్ని దానం చేసినప్పుడు, వారు అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందుతారన్నారు. ఇది బరువు తగ్గడానికి, ఆరోగ్యకరమైన కాలేయం, ఐరన్ స్థాయిని నిర్వహించడానికి, గుండెపోటు, క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడుతుందన్నారు. యువత స్వచ్ఛందంగా ముందుకు వచ్చి రక్తదానం చేయడం స్ఫూర్తిదాయకమన్నారు. ఆయన దాతలు ఇచ్చిన రక్తాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి అందజేస్తామని తెలిపారు.


