epaper
Monday, March 2, 2026
epaper

కాంట్రాక్ట్ కార్మికులపై వివక్ష వీడాలి

  • 15 శాతం లాభాల బోనస్ ఇవ్వాలి
  • కోల్ ఇండియా వేతనాలు చెల్లించాలి

కాకతీయ, కొత్తగూడెం రూరల్: కాంట్రాక్ట్ కార్మికులపై సింగరేణి యాజమాన్యం వివక్షతను వీడాలని, వారికి
లాభాల బోనస్ 15 శాతం ఇవ్వాలని ఐఎఫ్ టియు రాష్ట్ర ఉపాధ్యక్షుడు జే.సీతారామయ్య డిమాండ్ చేశారు. సింగరేణి కాలరీస్ కాంట్రాక్టు వర్కర్స్ యూనియన్(ఐఎఫ్టియు) సింగరేణి ఓబి ఆపరేటర్స్ అండ్ వర్కర్స్ యూనియన్, సింగరేణి సులాబ్ వర్కర్స్ యూనియన్, మోటార్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో కొత్తగూడెం ఏరియా జిఎం కార్యాలయం వద్ద సమస్యల పరిష్కారం కోరుతూ ధర్నా నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. సింగరేణి యాజమాన్యం ఒకే కుటుంబం అంటూనే కాంట్రాక్టు కార్మికుల శ్రమను కాంట్రాక్టర్లకు దోచిపెడుతూ ఉందని వివక్షతతో పేద కాంట్రాక్టు కార్మికుల కడుపులు కొడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల ప్రకటించిన బోనస్ అసంతృప్తిగా ఉందని మండిపడ్డారు. సింగరేణి సాధించిన రూ.6930కోట్ల లాభాల నుండి 15 శాతం వాటాను కాంట్రాక్టు కార్మికులకు చెల్లించాలని డిమాండ్ చేశారు. సింగరేణిలో కాంట్రాక్టు కార్మికులకు 2013నుంచి కోల్ ఇండియా వేతనాలు(హై పవర్ వేతనాలు)చెల్లించాల్సి ఉందన్నారు. హెచ్ పిసి వేతనాలు చెల్లించక పోవడం వల్ల కాంట్రాక్టు కార్మికులకు తీరని అన్యాయం జరుగుతోందని, సింగరేణి 28 ఏండ్లుగా లాభాల బాటలో నడుస్తున్నప్పటికీ దీనికి కార్మికులు అధికంగా శ్రమ చేయడమేనని ఇందులో కాంట్రాక్టు కార్మికుల పాత్ర ఎంతో కీలకంగా ఉందని అన్నారు.

కాంట్రాక్టు కార్మికుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. కోల్ ఇండియాలో అమలుచేస్తున్న హై పవర్ కమిటీ వేతనాలను సింగరేణిలో అన్నివిభాగాల కాంట్రాక్టు కార్మికులకు చెల్లించాలని, సులభ్ కార్మికులకు కనీస వేతనాలు పిఎఫ్, ఈఎస్ఐ సౌకర్యాలను అమలు చేయించాలన్నారు. అన్ని విభాగాల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికులకు 26 రోజుల పని కల్పించాలన్నారు. బొగ్గు ఉత్పత్తిలో పాల్గొంటున్న కాంట్రాక్టు కార్మికులకు 11వ వేతన ఒప్పందం బేసిక్ ను అమలు చేయాలన్నారు.

సింగరేణి అన్ని ఏరియాలలో ఖాళీగా ఉన్న కంపెనీ క్వార్టర్స్ ను కాంట్రాక్టు కార్మికులకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అనంతరం సమస్యలపై వినతిపత్రం అందించారు. కార్యక్రమంలో సింగరేణి కాలరీస్ కాంట్రాక్టు వర్కర్స్ యూనియన్ రీజియన్ కార్యదర్శి ఎన్.సంజీవ్, మోటార్ వర్కర్స్ యూనియన్ నాయకులు శరత్, సులాబ్ వర్కర్స్ యూనియన్ నాయకురాలు రాజేశ్వరి, ఉలికి బాబా, వెంకన్న, లక్ష్మి, అవినాష్, వెంకట్ తదితరులు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

ఎస్సీ వర్గీకరణ పోరులో అమరవీరులకు జోహార్లు

ఎస్సీ వర్గీకరణ పోరులో అమరవీరులకు జోహార్లు సింగరేణిలో ఎమ్మార్పీఎస్ గద్దె వద్ద నివాళులు త్యాగాలు...

బొగ్గు–ఇసుక లారీల బీభత్సం..!

బొగ్గు–ఇసుక లారీల బీభత్సం..! మణుగూరు–బయ్యారం రహదారి ధ్వంసం దుమ్ము ధూళితో గిరిజన బిడ్డల అనారోగ్యం ప్రజల...

అదుపుతప్పిన ఇసుక ట్రాక్టర్ – డ్రైవర్ దుర్మరణం

అదుపుతప్పిన ఇసుక ట్రాక్టర్ – డ్రైవర్ దుర్మరణం నాగులవంచ వద్ద తెల్లవారుజామున ప్రమాదం ఓవర్‌టేక్...

వెలుగుమట్ల బాధితులపై ముమ్మర సర్వే

వెలుగుమట్ల బాధితులపై ముమ్మర సర్వే 21 మంది తహశీల్దార్లతో యుద్ధప్రాతిపదికన సర్వే ఖమ్మం జిల్లాకు...

వెలుగుమట్ల బాధితులకు బీఆర్ఎస్ అండ

వెలుగుమట్ల బాధితులకు బీఆర్ఎస్ అండ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర ఆధ్వర్యంలో భోజనాల పంపిణీ కాకతీయ,...

సీఎం రేవంత్ రెడ్డికి సన్మానసభ పోస్టర్ ఆవిష్కరణ

సీఎం రేవంత్ రెడ్డికి సన్మానసభ పోస్టర్ ఆవిష్కరణ కాకతీయ, ఖమ్మం : ఎస్సీ...

భూదాన్ వ్యవహారంలో విపక్షాలే అభాసు

భూదాన్ వ్యవహారంలో విపక్షాలే అభాసు పేదల పేరుతో రాద్ధాంతం చేశారు ఏజెంట్ల మోసాలపై బాధితులకు...

మోదీ పాలనలో దేశానికి ప్రమాదం

మోదీ పాలనలో దేశానికి ప్రమాదం కార్పొరేట్ల కోసమే కేంద్రం విధానాలు సీపీఐ (ఎం) పొలిట్...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img