epaper
Saturday, November 15, 2025
epaper

కాంట్రాక్ట్ కార్మికులపై వివక్ష వీడాలి

  • 15 శాతం లాభాల బోనస్ ఇవ్వాలి
  • కోల్ ఇండియా వేతనాలు చెల్లించాలి

కాకతీయ, కొత్తగూడెం రూరల్: కాంట్రాక్ట్ కార్మికులపై సింగరేణి యాజమాన్యం వివక్షతను వీడాలని, వారికి
లాభాల బోనస్ 15 శాతం ఇవ్వాలని ఐఎఫ్ టియు రాష్ట్ర ఉపాధ్యక్షుడు జే.సీతారామయ్య డిమాండ్ చేశారు. సింగరేణి కాలరీస్ కాంట్రాక్టు వర్కర్స్ యూనియన్(ఐఎఫ్టియు) సింగరేణి ఓబి ఆపరేటర్స్ అండ్ వర్కర్స్ యూనియన్, సింగరేణి సులాబ్ వర్కర్స్ యూనియన్, మోటార్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో కొత్తగూడెం ఏరియా జిఎం కార్యాలయం వద్ద సమస్యల పరిష్కారం కోరుతూ ధర్నా నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. సింగరేణి యాజమాన్యం ఒకే కుటుంబం అంటూనే కాంట్రాక్టు కార్మికుల శ్రమను కాంట్రాక్టర్లకు దోచిపెడుతూ ఉందని వివక్షతతో పేద కాంట్రాక్టు కార్మికుల కడుపులు కొడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల ప్రకటించిన బోనస్ అసంతృప్తిగా ఉందని మండిపడ్డారు. సింగరేణి సాధించిన రూ.6930కోట్ల లాభాల నుండి 15 శాతం వాటాను కాంట్రాక్టు కార్మికులకు చెల్లించాలని డిమాండ్ చేశారు. సింగరేణిలో కాంట్రాక్టు కార్మికులకు 2013నుంచి కోల్ ఇండియా వేతనాలు(హై పవర్ వేతనాలు)చెల్లించాల్సి ఉందన్నారు. హెచ్ పిసి వేతనాలు చెల్లించక పోవడం వల్ల కాంట్రాక్టు కార్మికులకు తీరని అన్యాయం జరుగుతోందని, సింగరేణి 28 ఏండ్లుగా లాభాల బాటలో నడుస్తున్నప్పటికీ దీనికి కార్మికులు అధికంగా శ్రమ చేయడమేనని ఇందులో కాంట్రాక్టు కార్మికుల పాత్ర ఎంతో కీలకంగా ఉందని అన్నారు.

కాంట్రాక్టు కార్మికుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. కోల్ ఇండియాలో అమలుచేస్తున్న హై పవర్ కమిటీ వేతనాలను సింగరేణిలో అన్నివిభాగాల కాంట్రాక్టు కార్మికులకు చెల్లించాలని, సులభ్ కార్మికులకు కనీస వేతనాలు పిఎఫ్, ఈఎస్ఐ సౌకర్యాలను అమలు చేయించాలన్నారు. అన్ని విభాగాల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికులకు 26 రోజుల పని కల్పించాలన్నారు. బొగ్గు ఉత్పత్తిలో పాల్గొంటున్న కాంట్రాక్టు కార్మికులకు 11వ వేతన ఒప్పందం బేసిక్ ను అమలు చేయాలన్నారు.

సింగరేణి అన్ని ఏరియాలలో ఖాళీగా ఉన్న కంపెనీ క్వార్టర్స్ ను కాంట్రాక్టు కార్మికులకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అనంతరం సమస్యలపై వినతిపత్రం అందించారు. కార్యక్రమంలో సింగరేణి కాలరీస్ కాంట్రాక్టు వర్కర్స్ యూనియన్ రీజియన్ కార్యదర్శి ఎన్.సంజీవ్, మోటార్ వర్కర్స్ యూనియన్ నాయకులు శరత్, సులాబ్ వర్కర్స్ యూనియన్ నాయకురాలు రాజేశ్వరి, ఉలికి బాబా, వెంకన్న, లక్ష్మి, అవినాష్, వెంకట్ తదితరులు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

కాంగ్రెస్‌లో రేవంత్ జోష్‌

కాంగ్రెస్‌లో రేవంత్ జోష్‌ జూబ్లీహిల్స్ పీఠంపై హ‌స్తం పార్టీ జెండా ఉప ఎన్నిక గెలుపుతో...

సామినేనిని హ‌త్య చేసిందెవ‌రు..??

సామినేనిని హ‌త్య చేసిందెవ‌రు..?? ద‌ర్యాప్తు ఎందుకు ముందుకు సాగ‌డం లేదు..? ర‌క్త‌చ‌రిత్ర‌లో రాజ‌కీయ కోణంపై...

ఎన్ డి ఎ కూటమి విజయం

ఎన్ డి ఎ కూటమి విజయం హర్షం వ్యక్తం చేసిన బీజేపీ మండల...

యువతలో కొత్త జాగృతి ప్రేరణనే చైతన్యం

యువతలో కొత్త జాగృతి ప్రేరణనే చైతన్యం డ్రగ్స్ పై యుద్ధం ముగింపు ర్యాలీ ప్రజల...

భళారే.. యమ

భళారే.. యమ పిల్లల పండుగ రోజున అలరించిన బుడతడు కాకతీయ కొత్తగూడెం రూరల్: బాలల...

ఆయిల్ పామ్ సాగుతో రైతులకు లాభాల పంట…

ఆయిల్ పామ్ సాగుతో రైతులకు లాభాల పంట... రాష్ట్ర వ్యవసాయ,మార్కెటింగ్, సహకార, చేనేత...

కాంగ్రెస్ నాయకుడు మిక్కిలినేని కి మాతృవియోగం

కాంగ్రెస్ నాయకుడు మిక్కిలినేని కి మాతృవియోగం కాకతీయ,ఖమ్మం ప్రతినిధి: జిల్లా కాంగ్రెస్ నాయకుడు,...

టీబీ వ్యాధి పై ప్రతి ఒక్కరికి అవగాహన ఉండాలి

టీబీ వ్యాధి పై ప్రతి ఒక్కరికి అవగాహన ఉండాలి డాక్టర్ దుర్గాభవాని కాకతీయ, పినపాక:...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...

రేవంత్ కు కొత్త సవాల్!

* సర్కార్ కు పరీక్షగా సీఎస్ ఎంపిక? * ఈ నెలాఖరున రామకృష్ణారావు...

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం కాక‌తీయ‌, హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లాలోని బాటసింగారంలో...

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన ప్రతిపాదించిన ప్రాజెక్టుపై...

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా న్యూ డిల్లీ జూలై...

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు మొన్న యూనివర్సిటీల్లో ఆందోళనలు నిషేధిస్తూ మెమో నేడు...

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌ కాంగ్రెస్‌ దూత ఫోన్‌ ట్యాపింగ్‌..! గాంధీ...
spot_img

Popular Categories

spot_imgspot_img